‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది.
జగన్ పాలనలో ట్రిపుల్ఐటీ విద్యార్థుల దుస్థితి
ఇంటి నుంచి ఆహారం తెప్పించుకున్న ఒంగోలు పిల్లలు
గతంలో నూజివీడులో భోజనం బాగోలేదని ఆందోళన
జగన్ బంధువు అధికారి కావడంతో చర్యలకు భయం
ఈనాడు, అమరావతి
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. ‘పెట్టింది తినాలి.. పెట్టకపోతే పస్తులుండాలి.. గొంతెత్తితే మార్కుల్లో కోత’ ఇదీ ప్రస్తుతం ట్రిపుల్ఐటీ విద్యార్థుల దుస్థితి. విద్యార్థుల ఆకలి కేకలూ వినిపించుకోని సీఎం జగన్.. ప్రతి సభలోనూ వారికి ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు బాకా ఊదుతున్నారు.
ఒంగోలు ట్రిపుల్ఐటీలో ఈనెల 5న భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. వండిన అన్నం అయిపోయిందని చెప్పడంతో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి, భోజనం పంపించమని అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నాతోపాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం, నీళ్ల సీసాలు పంపించే ఏర్పాటు చేయగలరా’ అని ఓ విద్యార్థిని ఫోన్ చేసి అడిగిందంటే ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు! కానీ, జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. జగన్ సీఎం అయిన తర్వాత తనకు బంధువయ్యే వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం. దీనిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు హడలెత్తిపోతారు. గత కొంతకాలంగా ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో భోజనం, ఇతర సౌకర్యాలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది.
వసతికి సమస్యే..
ఒంగోలు ట్రిపుల్ఐటీ భవనాల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 2017లో పామూరు మండలం దూబగుంట వద్ద శంకుస్థాపన చేయగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ స్థలాన్ని కనిగిరి మండలం బల్లపల్లికి మార్చేసింది. అంచనా వ్యయం రూ.1,200కోట్లు కాగా.. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీంతో పీయూసీ 1, 2 విద్యార్థులకు ఇడుపులపాయలో చదువు చెబుతున్నారు. మిగతా 4000 మందిని స్థానికంగా అద్దెకు తీసుకున్న భవనాల్లో ఉంచుతున్నారు. ఇడుపులపాయలో ఎనిమిది వేల మంది ఒకేచోట ఉండాల్సి వస్తోంది. కొందరు విద్యార్థినులను గతేడాది మార్చిలో ఇడుపులపాయలోని పాత క్యాంపస్లోకి మార్చడానికి ప్రయత్నించగా.. అక్కడికి వెళ్లబోమని రెండు రోజులపాటు ధర్నా చేశారు. పాత క్యాంపస్లో పాములు, తేళ్లు, విష కీటకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత భవనాల్లోనే వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నచ్చచెప్పడంతో అప్పట్లో ఆందోళనలు విరమించారు.
శ్రీకాకుళంలో రూ.66.70కోట్లతో 2020లో అకడమిక్ బ్లాక్ నిర్మాణం మొదలుపెట్టారు. అది ఇంతవరకు పూర్తి కాలేదు. విద్యార్థులకు సరిపడా భవనాలు లేకపోవడంతో ఈ క్యాంపస్కు చెందిన 2వేల మందిని నూజివీడులో ఉంచుతున్నారు. రెండు క్యాంపస్లకు చెందిన 8వేల మంది ఒకేచోట ఉండడంతో నూజివీడులోనూ తరగతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలిక రేకుల షెడ్లలోనూ తరగతులు నిర్వహిస్తున్నారు.
వీసీ లేకుండానే..
నాలుగున్నరేళ్లుగా ట్రిపుల్ఐటీ వర్సిటీ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)కి ఉపకులపతినే నియమించలేదు. గతంలో దాదాపు రెండున్నరేళ్లపాటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిని ఇన్ఛార్జి వీసీగా కొనసాగించారు. ఇప్పుడు జేఎన్టీయూ, అనంతపురం ప్రొఫెసర్ విజయ్కుమార్ను ఇన్ఛార్జి వీసీగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏకంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని తీసుకొచ్చి శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీలకు డైరెక్టర్లుగా నియమించారు.
నీళ్లచారు.. చిమిడిన అన్నం..
చిమిడిన అన్నం.. రుచీపచీ లేని కూరలు.. పప్పులేని నీళ్ల చారు.. వీటిని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని నూజివీడు విద్యార్థులు గత అక్టోబరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ట్రిపుల్ఐటీల్లో చదివేవారిలో ఎక్కువమంది పేద కుటుంబాలకు చెందినవారే. పేదల పక్షమనే సీఎం జగన్ ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేరా? మంచి ఆహారం పెట్టేందుకు నిధులు ఇవ్వలేరా? ప్రభుత్వం వసతి దీవెన కింద రూ.20వేలు చెల్లిస్తోంది. ఇది నాణ్యమైన భోజనం అందించేందుకు సరిపోవడం లేదని విద్యార్థుల నుంచి అదనంగా రూ.7వేల వరకు మెస్ ఛార్జీల పేరుతో ట్రిపుల్ఐటీలు వసూలు చేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తున్నా పిల్లలకు సరిపడా, నాణ్యమైన భోజనం అందించడం లేదు. వాళ్లు ఆందోళనలు చేసినా పరిస్థితుల్లో మార్పు ఉండడం లేదు. పైగా ఫిర్యాదు చేస్తామంటే అంతర్గత మార్కులు, ప్రాక్టికల్ పరీక్షల్లో కోత వేస్తామని భయపెడతారు.
పెరుగులో పిండి కలుపుతున్నారంటూ గతంలో నూజివీడు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తనిఖీలు చేసిన రోజునే భోజనం బాగుంటుందని, ఆ తర్వాత మళ్లీ మామూలేనని ఆందోళన సమయంలో వెల్లడించారు. సాయంత్రం అందించే అల్పాహారం సైతం సరిపడా పెట్టడం లేదు. ఎదిగే వయసులో పోషకాలు అందకపోతే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ల చదువులేమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు