హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు.
మే 2 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలే లేవట
కేవలం నిల్వ కేంద్రాల్లో ఇసుకే విక్రయిస్తున్నారట
ఈసీలు తీసుకున్నాకే తవ్వుతామన్న సర్కారు
ఈసీలు ఇవ్వకున్నా అన్ని జిల్లాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు
ఈనాడు, అమరావతి
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. గతంలో తవ్వి తీసి స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఇసుక తవ్వకాలు చేపడతారని హామీ ఇస్తున్నాం.’
ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముంగిట ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బుధవారం చెప్పిన మాట. అయితే గురువారం కూడా పలు జిల్లాల్లోని ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలు దర్జాగా కొనసాగాయి. వీటికి ఎటువంటి పర్యావరణ అనుమతుల్లేవు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రభుత్వం ఎంత పచ్చి అబద్ధాలు చెప్పించింది అనడానికి ఈ తవ్వకాలే నిదర్శనం.
‘రాష్ట్రంలో ఇసుక టెండర్లలో రెండు ఏజెన్సీలు ఎంపికయ్యాయి. వాటితో ఒప్పందాల ప్రక్రియ తుది దశలో ఉంది. అది పూర్తికాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్ మొదలుపెడతాయి. అప్పటి వరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్ల్లో ఇసుక కార్యకలాపాలు జరుగుతాయి’
ఇది గత నెల 25న గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఇచ్చిన అధికారిక ప్రకటన. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వలేదు. కానీ పాత ఏజెన్సీ (జేపీ సంస్థ)తో అన్ని రీచ్ల్లో తవ్వకాలు జరుగుతాయంటూ గనులశాఖ సంచాలకులు వితండవాదం చేస్తున్న తీరిది.
సాక్షాత్తూ హైకోర్టునూ జగన్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. పర్యావరణ అనుమతులు కొత్తగా తీసుకున్నాకే మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టాలంటూ పర్యావరణ సంస్థ ఏప్రిల్లోనే స్పష్టంగా చెప్పింది. అదేమీ పట్టించుకోకుండా ఇప్పటికీ ఇసుక తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలను 2021 మే నుంచి జేపీ సంస్థ చేపట్టింది. అయితే ఉపగుత్తేదారుగా తమిళనాడుకు చెందిన టర్న్కీ సంస్థ మొత్తం వ్యవహారం నడిపింది. మధ్యలో దానిపేరిట అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేసి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సిండికేట్లుగా ఏర్పడి నదులను ఊడ్చేశారు. దీనిపై గతంలో అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ బెంచ్ను ఆశ్రయించారు. సెమీ మెకనైజ్డ్ విధానంలో తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు పునఃపరిశీలించాలని ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు వచ్చాయి. దీంతో జేపీ సంస్థకు అనుమతిచ్చిన 110 రీచ్ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) ఏప్రిల్ 24న గనుల శాఖకు, జేపీ సంస్థకు ఆదేశాలిచ్చింది. సియా ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా నేటికీ తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి.
కళ్ల ముందే తవ్వేస్తున్నా.. మొండి వాదన
వివిధ జిల్లాల్లోని ప్రధాన నదుల్లో ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అదేమీ లేదంటూ గనులశాఖ మొండిగా వాదిస్తోంది. కళ్ల ముందే భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, వందల లారీల్లో తరలిస్తున్నప్పటికీ అది నిజం కాదంటూ అడ్డంగా బుకాయిస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన తెదేపా, జనసేన, భాజపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా అనేక రీచ్ల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకుంటే, ఆ పూట తవ్వకాలు ఆపేస్తున్నారు. మర్నాటి నుంచి యథావిధిగా దందా కొనసాగిస్తున్నారు.
ఇవన్నీ కనిపించలేదా?
- అనంతపురం జిల్లా పెద్దపప్పూరులోని పెన్నా నదిలో రెండు రీచ్ల్లో, సీఎం సొంత జిల్లా వైయస్ఆర్లోని సిద్ధవటం మండలం జంగాలపల్లి, మూలపల్లిలో గురువారం ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిగాయి.
- శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడ, కొత్తూరు మండలం అంగూరు, జనుమూరు మండలం డొంపాక, పొందూరు మండలం సింగూరు రీచ్ల్లో ఇసుక తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి.
- నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఇసుక రీచ్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి, కాటవరం, జొన్నాడ, తాతపూడి తదితర రీచ్ల్లో ఇసుక తవ్వుతున్నారు. గురువారంనుంచి నదిలో నీరు ప్రవహిస్తుండటంతో తవ్వకాలు ఆపారు.
- ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చోడవరం, శ్రీకాకుళం, మద్దూరు, రొయ్యూరు, లంకపల్లి, గనిఆత్కూరు తదితర రీచ్ల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలించారు. ఎగువ నుంచి వరద రావడంతో రెండు రోజులుగా తవ్వకాలు ఆపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. -
ఇలాంటివి మీ ఇంట్లో తింటారా టీచర్!
తిరుపతి జిల్లాలోని బీఎన్కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల వంట గదిలో కుళ్లిన క్యాబేజీ, అరటిపండ్లు కనిపించాయి. శుక్రవారం మండలస్థాయి అధికారులు తనిఖీ చేసి అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. -
సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.