Telangana: విద్యుత్ సంస్థల అప్పులు రూ.81,516 కోట్లు
రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లు
సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చిన విద్యుత్శాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు, విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)(Tstransco), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)(TSGENCO)తో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి రూ.22,423 కోట్లుంటే ఇప్పుడు రూ.81,516 కోట్లకు చేరాయి. వీటిలో విద్యుత్ కొనుగోలు చేసినందుకు బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే రూ.30,406 కోట్లున్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల వల్ల నెలకు వడ్డీల రూపేణా రూ.1000 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుత డిసెంబరు నుంచి వచ్చే 2024 మే నెలాఖరుకు రాబోయే ఆరు నెలల్లో కరెంటు బిల్లులు వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిపి మొత్తం ఆదాయం రూ.22,781 కోట్లు ఉంటుంది. కానీ ఇదే ఆరు నెలల్లో ఖర్చులు రూ.33,839 కోట్ల వరకు ఉంటాయని డిస్కంల అంచనా. ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.11,058 కోట్లు ఉంటుందని తేలింది. ఇప్పటికే రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లకు చేరాయి.
వ్యవసాయ విద్యుత్ వినియోగం లెక్కలే లేవు
వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నా.. వాస్తవంగా ఎన్ని యూనిట్లు వాడుతున్నారనే లెక్కలేమీ లేవని విద్యుత్ సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండవచ్చనే అంచనా వేసి ప్రభుత్వం రాయితీ సొమ్ము ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. తలసరి వార్షిక వినియోగం 2,349 యూనిట్లు.
నిరంతర సరఫరా చేయాలి
అన్ని వర్గాల వారికి నిరంతరం (24 గంటలూ) కరెంటు సరఫరా చేయాలని సీఎం రేవంత్రెడ్డి డిస్కంలను ఆదేశించారు. ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉందని, దీనికి ఎంత వ్యయమవుతుందో శాస్త్రీయంగా అంచనాలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అందరికీ 200 యూనిట్లు ఇస్తే ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇటీవల రాజీనామా చేసిన ఉత్తర డిస్కం సీఎండీ గోపాలరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ప్రభాకరరావును ‘ఈనాడు’ ఫోన్లో సంప్రదించగా.. ప్రభుత్వం తనను రమ్మని పిలవలేదని.. పిలిస్తే సమావేశానికి వెళ్లేవాడినని ఆయన తెలిపారు.
ఎందుకీ అప్పులు, నష్టాలు...
- ప్రధానంగా నిరంతర (24 గంటలూ) సరఫరాకు అవసరమైనంత విద్యుత్ రాష్ట్రానికి సొంతంగా లేదు. బయటి నుంచి ఎక్కువగా కొనాల్సి వస్తోంది. ఉదాహరణకు భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్)లో అధిక ధరలకు ఏ రోజుకారోజు కొనడం కోసం డిస్కంలు నెలకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నాయి. వీటికితోడు గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన కొత్తగూడెం 7వ దశ, భద్రాద్రి, ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.
- అన్నివర్గాల వారు వాడే కరెంటుకు నెలనెలా చెల్లించే బిల్లుల రూపంలో రూ.2,800 కోట్ల ఆదాయం మాత్రమే డిస్కంలకు వస్తోంది. వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా, మరికొన్ని వర్గాలకు తక్కువ ధరలకు ప్రభుత్వం కరెంటును సరఫరా చేస్తోంది. ఈ రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా మొదటివారంలో రూ.958 కోట్లు విడుదల చేస్తోంది. ఈ రెండూ కలిపితే మొత్తం నెలవారీ ఆదాయం రూ.3,758 కోట్లు అని తేలింది.
- కరెంటు కొన్నందుకు డిస్కంలు నెలనెలా విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.3,305 కోట్లు చెల్లించాలి. ఇవి కాకుండా గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలకు నెలకు రూ.1,457 కోట్లు కట్టాలి. ఈ రెండూ కలిపితే ఖర్చులు రూ.4762 కోట్లు అవుతోంది. ఇవికాకుండా అప్పుడప్పుడు అనూహ్యంగా కరెంటు డిమాండు పెరిగితే అదనపు వ్యయం తప్పదు.
- థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును రోజూ దాదాపు 50 వేల టన్నుల వరకు కొంటున్నారు. టన్నుకు సగటున రూ.4,750 చొప్పున ధర చెల్లించి కొంటుండగా.. దాన్ని బొగ్గు గనుల నుంచి థర్మల్ కేంద్రంవద్దకు చేర్చడానికి టన్నుకు రూ.240 చొప్పున అదనంగా రవాణా వ్యయం భారం పడుతోంది.
- సింగరేణి గనుల నుంచి బొగ్గును కొంటున్నా ఆ సంస్థకు ఎప్పటికప్పుడు సొమ్ము చెల్లించడం లేదు. రాష్ట్ర జెన్కో కొన్న బొగ్గుకు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ.6,800 కోట్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్