నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.
అందరినీ ఆదుకుంటాం.. సంక్రాంతికి పెట్టుబడి రాయితీ అందిస్తాం
తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను బాధితులతో సీఎం జగన్
ఇలా వచ్చి.. మొక్కుబడిగా పంటలు చూసి.. అలా తిరుగుపయనం
కనీసం పొలం గట్టుకైనా వెళ్లకుండా రోడ్డు మీదే వేదికల ఏర్పాటు
తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను బాధితులతో సీఎం జగన్
ఈనాడు-తిరుపతి, అమరావతి: తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా, పెట్టుబడి రాయితీలు రావనే అపోహలు వద్దని స్పష్టం చేశారు. పంట నష్టానికి సంబంధించిన నమోదు ప్రక్రియను రేపో మాపో ప్రారంభిస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే నమోదుకు 15 రోజులు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి పెట్టుబడి రాయితీ జమ చేస్తామని, బీమా వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో పరిహారం ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ప్రస్తుతం రైతుల ప్రీమియం తామే చెల్లిస్తూ ఖరీఫ్ సీజన్కు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీఎం తన పర్యటనలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు, రైతులతో మాట్లాడటానికి చాలా తక్కువ సమయమే కేటాయించారు. నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బాధితుల పరామర్శకు వచ్చిన సీఎంకు బాపట్ల జిల్లా పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల వద్ద అధికారులు రెడ్కార్పెట్ ఏర్పాటుచేయడం విమర్శలకు దారితీసింది. రెండుచోట్లా కనీసం నేల మీద కాలు పెట్టకుండా జాతీయ రహదారిపై నుంచే పంట నష్టాన్ని పరిశీలించటానికి వీలుగా ప్రత్యేక టెంట్లు, వేదికలు ఏర్పాటు చేశారు. వాటిలో రెడ్కార్పెట్ పరిచారు. మొదట సీఎం తిరుపతి జిల్లాలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పరిధిలో స్వర్ణముఖి నది కరకట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘పంట నష్టపోయిన రైతులు ఎవరూ భయపడవద్దు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం’ అని అన్నారు.
సచివాలయ, వాలంటీరు వ్యవస్థ ద్వారా..
‘బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలతోపాటు ఒక లీటరు నూనె అందించాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సచివాలయ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉంది. వీళ్ల ద్వారా ప్రతి ఇంటికీ రేషన్ కిట్లను పంపిణీ చేశాం. బాధిత కుటుంబాలకు రూ. 2,500 చొప్పున నాలుగైదు రోజుల్లో పంపిణీ చేస్తాం. సమస్యలు ఉంటే జగనన్నకు చెబుతాం ఫోన్ నంబరుకు చేయండి’ అని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా వాకాడు పరిధిలోని బాలిరెడ్డిపాలెంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సుమారు 200 మందికి పాసులు ఇచ్చి సీఎం కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని నేతలు చెప్పారని, ఇక్కడికి వస్తే ఆంక్షలు పెట్టారని స్థానికులు వాపోయారు.
నేనొస్తే సహాయ చర్యలకు ఇబ్బంది అని..
తిరుపతి జిల్లా పర్యటన అనంతరం సీఎం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పాతనందాయపాలెం చేరుకున్నారు. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి పక్కనే దెబ్బతిన్న మిర్చి పంటను, తర్వాత బుద్దాం గ్రామం వద్ద నీట మునిగిన వరి పొలాలను రహదారి పైనుంచే పరిశీలించారు. విపత్తులు వచ్చినప్పుడు తాను వెంటనే వస్తే అధికార యంత్రాంగం అంతా తన వెనకే ఉంటుందని, సహాయక చర్యలు లోపిస్తాయని సీఎం జగన్ స్పష్టంచేశారు. అందుకే కలెక్టర్, జిల్లా యంత్రాంగం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను అప్రమత్తం చేశామన్నారు. వారు ఏ మేరకు పని చేశారో పరిశీలనకు తాను వస్తానని, ఆ సమయంలో ఏ ఒక్కరూ నెగెటివ్ చెప్పకూడదని ఆదేశాలిచ్చామన్నారు. అధికారులు సహాయక చర్యలు బాగా చేశారని ప్రశంసించారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 55 లక్షలమంది రైతులకు రూ. 7,800 కోట్ల బీమా చెల్లించిందని.. చంద్రబాబు హయాంలో అయిదేళ్లలో 35 లక్షలమందికి రూ. 3,400 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తొలుత మరుప్రోలువారిపాలెంలో తుపాను ప్రభావంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం తిలకరించారు. రైతులతో ముఖాముఖి ఉంటుందని కొందరు రైతుల్ని పిలిపించారు. అయితే పర్యటన ఆలస్యం అయిందంటూ వారితో చర్చించలేదు.
గర్భిణిని, అంబులెన్సునూ అడ్డుకోవడమేనా?
- బాపట్ల జిల్లాలో పురిటినొప్పులతో బాధపడుతున్న అంజలి అనే మహిళను ఆటోలో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా.. సీఎం వస్తున్న సమయంలో రోడ్డు మీద ఆటో నడపటం ఏంటని పోలీసులు అడ్డుకోవడంతో డ్రైవర్ ఆమెను అక్కడ దింపేసి వెళ్లిపోయాడు. ఆ మహిళ పంటిబిగువన నొప్పులు భరిస్తూ సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్యశిబిరం వద్ద కూలబడ్డారు. మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు తమ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
- బాపట్ల జిల్లా అధికారులు కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారిపై సీఎం కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సీఎం పర్యటన ముగిసే వరకు హైవేపై వాహనాలు ఆపేయడంతో జనం తీవ్రంగా అవస్థలు పడ్డారు. కిలోమీటర్ల మేర చుట్టుతిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో పోలీసులు 2 గంటలపాటు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అత్యవసరంగా రోగిని ఆసుపత్రి తీసుకెళ్లడం కోసం 108 వాహనం విద్యానగర్ చేరుకోగా.. పోలీసులు అనుమతించలేదు. డ్రైవర్ అత్యవసరమని ప్రాధేయ పడటంతో కొంతసేపటికి వదిలిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్