రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు!
రాష్ట్రం వాటా ఇవ్వదు.. భూసేకరణ చేయదు
ఆగిపోయిన ఏడీబీ రుణ రహదారుల ప్రాజెక్టులు
నరకం చూస్తున్న వాహనదారులు
జగన్ ప్రభుత్వ చేతకానితనం
ఈనాడు - అమరావతి
తాము పెట్టకున్నా.. పెట్టేవారిని చూపిస్తే పుణ్యం వస్తుందంటారు! అలా చూపించటం అటుంచి... పెట్టేవారు మేం రెడీ అంటూ ముందుకొచ్చినా... వారిని పెట్టకుండా అడ్డుకుంటే ఏమొస్తుంది? పాపం వస్తుంది! అలాంటి పాపాన్నైనా మూటగట్టుకోవటానికి సిద్ధపడుతోందిగాని.. ప్రజలకు సౌకర్యాలు కల్పించే బుద్ధిపుట్టడం లేదు జగన్ సర్కారుకు! అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో రహదారుల విస్తరణ!
ఆంధ్రావని రోడ్లంటే... ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది! రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు... జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు! ఆంధ్ర సరిహద్దులు దాటగానే... హమ్మయ్య అంటూ వెన్ను విరుచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రహదారుల గురించి జగన్ సర్కారు నిర్లక్ష్యం ఇప్పుడు అందరికీ అనుభవేక వైద్యమైంది. రాష్ట్రంలో రోడ్ల విస్తరణను ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయింది. వర్షాలకు అధ్వానంగా మారిన రహదారుల్లో కనీసం గుంతలు కూడా పూడ్చలేని దౌర్భాగ్యస్థితి! వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తుంటే ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది. అందుకేనేమో... రాష్ట్రంలో రహదారుల పనులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇప్పటికే న్యూడెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) రుణంతో చేపడుతున్న రహదారుల ప్రాజెక్టు అటకెక్కగా.. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రుణంతో చేయాల్సిన రహదారుల ప్రాజెక్టును కూడా ఇలాగే మూలకు చేరేలా చేస్తోంది. ఆ సొమ్ము మాత్రం వాడేసుకుంది. ఇందులోని మొదటి విడతలో ఉన్న ఓ రహదారి పనులు చేయలేమని గుత్తేదారులు దండం పెట్టేయగా, రెండో విడతలోని టెండరు దక్కించుకొని, ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు సైతం పునరాలోచనలో పడ్డారు. రుణం కింద ఇప్పటికే అడ్వాన్స్ సొమ్ము
తీసుకున్నారని, ఈ ప్రాజెక్టు సంగతి తేల్చాలని ఏడీబీ పదేపదే పట్టుబడుతున్నాసరే.. వైకాపా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించడంలేదు.
జాతీయ రహదారుల నుంచి పారిశ్రామికవాడలకు అనుసంధానంచేసే రహదారుల విస్తరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 78 శాతం ఏడీబీ రుణంగా ఇస్తుండగా, రాష్ట్రప్రభుత్వం కేవలం 22 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. తొలి విడతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట నుంచి రాజానగరం వరకు 30కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2018-19లో మంజూరైంది. రూ.298 కోట్ల అంచనా విలువతో గుత్తేదారు సంస్థ ఆరంభంలో వేగంగా పనులు చేపట్టింది. ఏడాదికే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవాటా నిధులివ్వకుండా, గుత్తేదారుకు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో ఈ ఏడాది జులై నాటికి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు 30 శాతం పనులే జరిగాయి. గుత్తేదారుకు రూ.58 కోట్లే చెల్లించారు. ఇంకా రూ.47 కోట్లు బిల్లులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో గుత్తేదారు సంస్థ ఆరు నెలలుగా పూర్తిగా పనులు ఆపేసింది.
రెండో దశ మొదలేకాలేదు..
ఏడీబీ రెండో దశలో పారిశ్రామిక ప్రాంతాలకు కలిపే నాలుగు రహదారులకు రుణం మంజూరుచేసింది. ఇందులో రెండు రహదారుల విస్తరణ పనులకు టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితిలో ఉన్నారు.
- తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలో కోల్కతా-చెన్నై జాతీయ రహదారిలోని ఓజిలి నుంచి పారిశ్రామికవాడ వరకు 8.4 కి.మీ రెండు వరుసలుగా రహదారి విస్తరణకు రూ.120 కోట్లతో ప్రాజెక్ట్ మంజూరైంది. పనులు దక్కించుకున్న గుత్తేదారు గతేడాది సెప్టెంబరులోనే ఒప్పందం చేసుకున్నారు. ఇందులో కూడా భూసేకరణ చేయకపోవడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఊసేలేకపోవడంతో ఇప్పటివరకు పనులు మొదలుకాలేదు.
- తిరుపతి జిల్లాలోని రౌతుసురమాల పారిశ్రామికవాడకు అనుసంధానం చేసే 9.3కి.మీ. రెండు వరుసల రహదారి (67.4 కోట్లు), అనకాపల్లి జిల్లా నక్కపల్లి పారిశ్రామికవాడకు అనుసంధానం చేసే 4.42 కి.మీ. (25.91 కోట్లు) పనులు కూడా ఇంకా మొదలుకాలేదు.
అడ్వాన్స్, ప్రభుత్వ వాటా ఖర్చుచేస్తేనే..
ఏడీబీ ప్రతిసారీ రూ.200 కోట్లు అడ్వాన్స్గా రుణం ఇస్తుంది. దానితోపాటు, రాష్ట్రప్రభుత్వ వాటా ఖర్చుచేస్తే.. మళ్లీ రుణంలో మిగిలిన మొత్తం దశలవారీగా విడుదలచేస్తుంది. అయితే మొదటి దశలో ఇలా ఇచ్చిన అడ్వాన్స్లో రూ.190 కోట్లు రాష్ట్రప్రభుత్వం వాడేసుకుంది. దీంతో రెండో విడత ప్రాజెక్టులో అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. తొలి దశలో ఇచ్చిన రుణంతోపాటు, ప్రభుత్వ వాటాను కూడా ఖర్చుచేసి, ఆ పత్రాలు చూపిస్తేనే మిగిలిన రుణం ఇస్తామని తెగేసి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏడీబీ ప్రాజెక్టుల జోలికి కూడా వెళ్లడం లేదు.
ఇది అనకాపల్లి నుంచి అచ్యుతాపురం కూడలి వరకు ఉన్న 13.78 కి.మీ. రోడ్డు. దీన్ని రూ.243 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించే పనులు బీవీఎస్ఆర్ అనే గుత్తేదారు సంస్థ దక్కించుకొని, గతేడాది జూన్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రహదారికి అవసరమైన భూమి సేకరించి అప్పగించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. భూసేకరణకు రూ.100 కోట్లు ఖర్చుచేయలేక చేతులెత్తేసింది. దీంతో ఏడాదిన్నరైనా పనులు మొదలుకాలేదు. 9 నెలల కిందటే గుత్తేదారు పనులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి పదేపదే విన్నవించినా ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో ఈ రహదారిలో గంప మట్టి కూడా పోయలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్