కరవు కాటు.. తుపాను పోటు.. కనికరం చూపని సర్కారు
ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది.
నిండా మునిగిన వరి రైతు
ఎకరాకు తిత్లీ సమయంలో ఇచ్చింది రూ.8 వేలు.. ఇప్పుడిచ్చేది రూ.6వేలే
అదీ కేంద్రం ఇస్తున్న సాయంతోనే సరిపెట్టేస్తున్న జగన్
ఈనాడు - అమరావతి: ఖరీఫ్లో కరవు దెబ్బతీసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు తగ్గింది. వేసిన పంటలైనా చేతికొస్తాయనుకున్న రైతుల ఆశల్ని మిగ్జాం తుపాను చిదిమేసింది. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి కోతకు సిద్ధంగా ఉన్న వరిని ముంచేసింది. మిరప, మినుము, మొక్కజొన్న తదితర పంటలతోపాటు అరటి, బొప్పాయి, పూలతోటల రైతుల ఆశల్ని తుంచేసింది. లక్షల ఎకరాల్లో పంట వర్షార్పణమయింది. అటు కరవు కాటు, ఇటు తుపాను పోటుతో.. ఈ ఏడాది రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖరీఫ్ పంట చేతికొచ్చే దశలో నీటిపాలవగా.. రబీలో వేసిన పైరు కూడా వర్షార్పణమైంది. అయినా ప్రభుత్వానికి రైతుల్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి కొరవడింది. 400 పైగా మండలాల్లో కరవు తీవ్రత నెలకొన్నా కాస్త కరవే అంటూ 103 మండలాలతో సరిపెట్టిన ముఖ్యమంత్రి జగన్కు.. తీవ్ర తుపానుతో నిలువెల్లా మునిగిన అన్నదాతలకు పెట్టుబడి సాయం పెంచి ఇద్దామన్న ఆలోచనా కొరవడింది. ఎకరానికి కనీసం రూ.12 వేల చొప్పున అయినా ఇవ్వాలని రైతులు కోరుతుంటే.. వైకాపా సర్కారు మాత్రం కేంద్రం నిర్ణయించిన మేరకు ఎకరాకు రూ.6 వేలతో సరిపెడుతోంది. తిత్లీ తుపాను సమయంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా వరికి రూ.8 వేలు, అరటికి రూ.12వేలు ఇవ్వగా.. వైకాపా ప్రభుత్వం అది కూడా తమవల్ల కాదంటూ చేతులెత్తేసింది.
ఖరీఫ్లో విత్తు పడక.. రబీలోనూ వానల్లేక
ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి రైతుకు ప్రతికూల వాతావరణమే ఎదురవుతోంది. జూన్లో 31.5%, ఆగస్టులో 55% చొప్పున సాధారణం కంటే తక్కువ వానలు కురిశాయి. అక్టోబరులో 90% తక్కువ వర్షపాతం నమోదైంది. గత శతాబ్దంలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు కురిశాయి. సాధారణ విస్తీర్ణం కంటే సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా సాగు తగ్గింది. 400కు పైగా మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, వైయస్ఆర్ జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నా ఒక్క కరవు మండలాన్నీ ప్రకటించలేదు. తమ పాలనలో కరవు లేదంటూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుండటంతో.. అధికారులు కూడా నోరు మెదపని పరిస్థితి నెలకొంది. 103 కరవు మండలాల్లో 14.21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, కేంద్ర నిబంధనల ప్రకారం రూ.503 కోట్లు, రాష్ట్ర విపత్తు నిబంధనల ప్రకారం రూ.844 కోట్ల పెట్టుబడి సాయం చేయాల్సి ఉంటుందని గుర్తించారు. రబీలోనూ కరవు కారణంగా.. వరి, శనగ, ఇతర పంటల సాగు తగ్గింది. సాధారణ విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు ఉంటే.. ఇప్పటికి 12 లక్షల ఎకరాల్లోనే విత్తు పడింది.
ఎకరాకు రూ.20 వేల పైనే నష్టం
ఖరీఫ్లో 62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, సుమారు 25 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసినట్లు అంచనా. 32 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో 20% కోతలు పూర్తయి ఉంటాయనుకున్నా 80% కోతకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మిగ్జాం విరుచుకుపడి వరిని ముంచేసింది. మొత్తంగా 22 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరి పొలాల్లో నీరు బయటకు వెళ్లినా పంట నష్టం తప్పదు. మొత్తంగా ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. వరి కోసి కుప్ప నూర్చినా ధాన్యంలో తేమ శాతం ఉందంటూ ఆర్బీకే సిబ్బంది సతాయించారు. నిబంధనల ప్రకారం 17% తేమ వచ్చినా తీసుకోవచ్చు. 15% ఉంటేనే తీసుకుంటామంటూ వేధించారు. ఈలోగా వాన విరుచుకుపడింది. తుపాను తీరం దాటడానికి ఒక్కరోజు ముందు.. తేమ శాతంతో పనిలేకుండా ధాన్యం కొనమని సీఎం ఆదేశించారు. అదే వారం రోజుల ముందు ప్రకటించి ఉంటే అధిక శాతం ధాన్యం మిల్లులకు చేరేది. సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. తుపాను రాకముందే.. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు మద్దతు ధర కంటే బస్తాకు రూ.400 వరకు తగ్గించి కొన్నారు. ఇప్పుడు తడిసిన ధాన్యానికి మరింత కోత పెడతారని రైతులు వాపోతున్నారు.
ఉదారంగా సాయం చేయలేరా?
వరి రైతులు ఎకరాకు సగటున రూ.20 వేలకు పైగా నష్టపోయారు. విపత్తు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.6 వేలు ఇస్తారు. అదీ 33% నష్టం ఉండాలి, పొలంలో నీరు బయటకు పోతే నష్టం కిందకు రాదు లాంటి సవాలక్ష కొర్రీలు వేస్తారు. మొక్కజొన్న పూర్తిగా నేల కరవాలంటారు. మొత్తంగా చూస్తే.. పంటలు దెబ్బతిన్న రైతుల్లో 20% మందికి కూడా కూడా సాయం అందదు. నిబంధనల్ని పక్కన పెట్టి.. ఎకరాకు కనీసం రూ.12 వేలకు తగ్గకుండా పెట్టుబడి రాయితీ ఇస్తే కొంతైనా భరోసా లభిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ఉదారత కనిపించడం లేదు.
మిరప, మినుము, పొగాకు, మొక్కజొన్నకూ నష్టమే
ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన మిరప రైతులూ మిగ్జాంతో తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో మిరప చేలలో నీరు నిలవడంతోపాటు కొన్నిచోట్ల గాలులకు మొక్కలు నేలవాలాయి. ఈ ఏడాది సుమారు 6 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. జెమిని వైరస్తో కొంత దెబ్బతింది. వర్షాభావంతో సాగు నీరందక కొంత మిరప పీకేశారు. తెగుళ్ల బారిన పడిన పంటను కాపాడుకునేందుకు పురుగుమందులకు భారీగా ఖర్చు పెట్టారు. నీటితడికి రూ.20వేలకు పైగా అయింది. తుపాను ధాటికి ఇప్పుడు మొత్తం మునిగింది.
- ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగాకు తోటలు తుపానుకు నేలవాలాయి. చాలాచోట్ల నీరు నిలిచింది. శనగ, మొక్కజొన్న, మినుము, ఆముదం నీటిలో మునిగాయి.
- అన్నమయ్య జిల్లాలో అరటి, బొప్పాయి నేలమట్టమయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ పండ్లతోటల రైతులు ఎకరాకు రూ.50వేలకు పైగా నష్టపోయారు. కూరగాయ పంటలూ దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం