ప్రభుత్వ తీరుపై వ్యాజ్యం వేయడమే పాపమా?
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
ఫోరం షాపింగ్కు పాల్పడుతోంది సర్కారే
ప్రస్తుత బెంచ్ వ్యాజ్యంపై విచారణ జరపొచ్చు
త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపనక్కర్లేదు
అమరావతి రైతుల తరఫు న్యాయవాది వాదన
విశాఖకు కార్యాలయాల తరలింపుపై లోతైన విచారణ జరుపుతామన్న హైకోర్టు
సోమవారానికి వాయిదా
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ప్రాంత రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని వారి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాల్సిన అవసరం లేదన్నారు. నచ్చిన బెంచ్ వద్దకు వ్యాజ్యం విచారణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వమే ఫోరం షాపింగ్/ బెంచ్ హంటింగ్కు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ వాదన చూస్తుంటే కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలన్నట్లు ఉందని, ఇది కోర్టు ధిక్కరణేనని చెప్పారు. పిటిషనర్లు వ్యాజ్యం దాఖలు చేయడమే పాపం అన్నట్లు ప్రభుత్వం చూస్తోందన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన రోస్టర్ ప్రకారం తమ వ్యాజ్యంపై ప్రస్తుత బెంచ్ విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి వద్దకు వ్యాజ్యం విచారణకు రావడంపై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరంపై శుక్రవారం ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగిశాయి. వ్యాజ్యాన్ని లోతుగా విచారించేందుకు సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
శుక్రవారం విచారణ ప్రారంభంకాగానే న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫోరం షాపింగ్ ఆరోపణపై ఈ వ్యాజ్యం విచారణకు రావడానికి ముందురోజే, మీరు (ఏజీ) వాదనలు చెప్పకముందే ఓ పత్రిక (సాక్షి)లో కథనం వచ్చిందన్నారు. ఏజీ స్పందిస్తూ.. ఆ కథనంతో తనకు సంబంధం లేదన్నారు. కోర్టులో విచారణకు రాక ముందే కేసు వివరాలు మీడియాలో వచ్చేస్తున్నాయన్నారు. మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారన్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ స్కిల్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్, అదనపు ఏజీ మీడియా సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పర్యవేక్షణ ముసుగులో సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే.
త్రిసభ్య ధర్మాసనం వినడం సబబు
-ఏజీ
శుక్రవారం విచారణలో ఏజీ వాదనలు కొనసాగిస్తూ ఈ వ్యాజ్యంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపడం సబబు అన్నారు. సింగిల్ జడ్జి వద్దకు విచారణకు వచ్చేందుకు వీలుగా వ్యాజ్యంలో వివరాలను తెలివిగా రాశారన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటుపై అభ్యంతరం ఉంటే కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు త్రిసభ్య ధర్మాసనం గతంలో వెసులుబాటు ఇచ్చిందని గుర్తుచేశారు. సంబంధం లేనివి, వ్యక్తిగత ప్రతీకారంతో కూడిన అంశాలను వ్యాజ్యంలో ప్రస్తావించారన్నారు. లోతుల్లోకి వెళ్లి విచారణ జరపాలని కోర్టు భావిస్తే వాదనలు వినిపిస్తామని చెప్పారు.
విశాఖకు పరిపాలన తరలించే ఎత్తుగడ
-ఉన్నం
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రతివాదనలు వినిపించారు. ‘కార్యాలయాల ఏర్పాటుకు విశాఖలో అనువైన ప్రదేశాలను గుర్తించి, ఐఏఎస్ కమిటీ చేసిన సిఫారసులకు వీలుగా ప్రభుత్వం జీవో 2283 జారీ చేసింది. దానిపై విచారణ రోస్టర్ ప్రకారం ఈ కోర్టు పరిధిలోనే ఉంది. అమరావతే రాజధాని అన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును తప్పించుకునేందుకే సీఎం క్యాంప్ కార్యాలయం ముసుగులో దొడ్డిదారిన విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించబోతున్నారు. ప్రస్తుత సచివాలయం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. క్యాంప్ ఆఫీసుల పేరుతో విశాఖలో కార్యాలయాల కోసం 7.53 లక్షల చ.అ.ల విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపిక చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కార్యాలయాలన్నింటినీ అక్కడికి తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం కార్యాలయ ఏర్పాటుపై అప్పట్లో వ్యాజ్యం వేసిన పిటిషనర్లకే త్రిసభ్య ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది. ఆ వ్యాజ్యం ప్రస్తుత పిటిషనర్లు వేయలేదు. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపనక్కర్లేదు. ప్రస్తుత బెంచే మా వ్యాజ్యంపై విచారణ జరపొచ్చు. మేం ఫోరం షాపింగ్కు పాల్పడుతున్నామన్న ప్రభుత్వ వాదన అర్థరహితం. ఏజీ చాలాసేపు వాదనలు వినిపించినా ప్రస్తుత బెంచ్ ఈ వ్యాజ్యాన్ని ఎందుకు విచారించకూడదో చెప్పలేకపోయారు. పిటిషనర్ల ఆస్తులు రాజధాని నగర ప్రాంత పరిధిలో ఉన్నాయి. వారి వ్యక్తిగత ప్రయోజనం ముడిపడి ఉన్నందున రిట్ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆవేదన, ఇబ్బందులనే అందులో ప్రస్తావించారు. త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఉల్లంఘిస్తూ కార్యాలయాల తరలింపునకు అధికారులు భారీగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పర్యాటక రిసార్టు పేరుతో రుషికొండను ధ్వంసం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నా రూ.200 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. వీటన్నింటికీ బాధ్యులను చేయాలనే అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల