Jagananna Colonies: చెరువుకు గండి కొట్టారు.. కాలనీని ముంచారు

ఎటువంటి సమాచారం లేకుండా చెరువుకు గండి కొట్టడంతో సమీపంలో ఉన్న జగనన్న కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు పోటెత్తింది.

Updated : 11 Dec 2023 08:45 IST

రాజానగరం (మల్లంపూడి), న్యూస్‌టుడే: ఎటువంటి సమాచారం లేకుండా చెరువుకు గండి కొట్టడంతో సమీపంలో ఉన్న జగనన్న కాలనీలోకి(Jagananna Colonies) పెద్ద ఎత్తున నీరు పోటెత్తింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడిలో జరిగింది. కాలనీవాసులు తెలిపిన ప్రకారం..  శనివారం రాత్రి ఉన్నట్లుండి సమీప చెరువుకు గండి పడి కాలనీలోకి నడుంలోతు ప్రవాహం వచ్చేసింది. ఇంట్లో నుంచి విలువైన సామగ్రి తీసుకునేందుకు సైతం అవకాశం లేకుండా క్షణాల్లో ముంచెత్తింది. ప్రవాహ వేగానికి పొలాల్లో కట్టి ఉంచిన రెండు గేదెలు కొట్టుకుపోయి మృతి చెందాయి. ఆరబెట్టుకున్న ధాన్యం, ఇళ్ల నిర్మాణాల కోసం ఉంచిన సుమారు పది ట్రాక్టర్ల ఇసుక కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా చెరువుకు ఎవరో గండి కొట్టారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని