IT: ఐటీకి చావుదెబ్బ!
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే.
రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం
పెట్టుబడుల ఆకర్షణలో వెనకబడిన వైకాపా సర్కారు
5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే
ఈనాడు - అమరావతి
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో (IT professionals) అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. రాష్ట్రంలో ప్రముఖ నగరాలుగా వినుతికెక్కిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ విస్తరించి ఉంటే రాష్ట్ర యువతలో అధికశాతానికి వలసబాట తప్పేది. సొంత రాష్ట్రంలో ఘనమైన ఉపాధి దొరికేది. రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడివడిన అనంతరం తెదేపా ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ వైకాపా సర్కారు చూపకపోవడంతో ఆ రంగం ముందడుగు వేయలేకపోయింది.
అదానీ సంస్థ విశాఖలో రూ.70 వేల కోట్లతో 5 గిగావాట్ల(5,000 మెగావాట్ల) డేటా సెంటర్ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 20 ఏళ్లలో ఈ సెంటర్ అభివృద్ధి చేస్తామని పేర్కొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ తీరుతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని రూ.21,844 కోట్లకు తగ్గించి.. 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పరిమితమైంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ పీపీఏలు, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తల్ని వేధింపులకు గురిచేయడంతో బడా సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు, పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల అమలుకు ఆంధ్రప్రదేశ్ను పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి.
ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం పదేపదే చెప్పింది. ఐటీ పార్కులు, ఆఫీసు స్పేసెస్, కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది. నైపుణ్య మానవ వనరులు, వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నా ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. దాంతో రాష్ట్రం నుంచి ఏటా లక్షల మంది యువత ఇంజినీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నా సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క.. వలస వెళ్తున్నారు.
ప్రోత్సాహం ఎక్కడ?
ఐటీ పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోగా.. ఉన్న వాటినీ నిరుపయోగంగా మార్చేసింది జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వం విశాఖలో స్టార్టప్ విలేజ్ను ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్ కంపెనీలు ప్రత్యక్షంగా.. మరో 80 స్టార్టప్లు వర్చువల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత దశ యాక్సిలరేటర్ స్థాయి కంపెనీల కోసం సింగపూర్కు చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది. వాటిని యథావిధిగా వినియోగించుకున్నా.. ఐటీ రంగంలో పొరుగు రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టార్టప్ విలేజ్ను మూసేసి.. అక్కడి భవనాలను మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచింది. మిలీనియం టవర్స్ 1, 2 భవనాలను ఖాళీగా ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు తప్పించి.. కొత్త కంపెనీలకు అందులో స్థలాన్ని కేటాయించలేదు.
ప్రభుత్వ కృషితో వచ్చాయా?
వర్క్ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం కొన్ని చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించి.. ఏపీలో విశాఖను ఎంపిక చేసుకుంది. దీంతో అదనంగా ఉపాధి ఏమీ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం దగ్గర హెచ్సీఎల్ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యువతకు సొంతంగా శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పిస్తోంది. కానీ, కృష్ణా జిల్లాలో హెచ్సీఎల్ కేంద్రం 2023లో ఏర్పాటు చేసినట్లుగా జగన్ ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమైంది.
ముగ్గురున్నా ముందుకేది?
ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను భారీ వేతనాలు ఇచ్చి మరీ నియమించింది. వారిలో శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్రెడ్డిలు (సాంకేతిక), రాజశేఖరరెడ్డి (పాలసీ, ఇన్వెస్ట్మెంట్)లను నియమించినా ఫలితం కనపడలేదు. ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత 5 ఏళ్లలో 21 సంస్థలు కేవలం రూ.6.20 కోట్లను ప్రోత్సాహకాలుగా పొందాయి. అంటే ఏటా సగటున రూ.1.24 కోట్లు ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లైంది. దీన్ని బట్టి ఈ రంగంలో పురోగతిని అర్థం చేసుకోవచ్చు.
అరచేతిలో వైకుంఠం.. ఐటీ పాలసీ
2021-24 ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది. ఐటీ రంగాన్ని తామే పతాక స్థాయిలో అభివృద్ధి చేస్తామని కబుర్లు చెప్పింది. ప్రభుత్వం తక్షణం పలు లక్ష్యాలను సాధించాల్సి ఉందని పాలసీలో చెప్పింది. అవి..
- ఐటీ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడం
- ఐటీ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుగా కోవర్కింగ్ స్పేస్, శాటిలైట్ సెంటర్ల ఏర్పాటు
- స్టార్టప్లు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం
- పెట్టుబడులతో వచ్చేవారికి తక్షణ అనుమతులు
- విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ రంగానికి అవసరమైన రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్లు, కో-వర్కింగ్ స్పేసెస్, స్టేట్ డేటా సెంటర్ వంటి వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఇప్పటికీ ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు.
వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది. పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.
వచ్చింది.. నామమాత్రం
గత అయిదేళ్లలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటీఏఏపీ) గణాంకాల ప్రకారం గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి కేవలం 59 ఐటీ సంస్థలే వచ్చాయి. వాటిలోనూ అధికశాతం విశాఖ, తిరుపతికే పరిమితమయ్యాయి.
విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిలో ఐటీ రంగానికి సంబంధించినవి రూ.41,748 కోట్లే. మొత్తం పెట్టుబడుల ఒప్పందాల్లో వాటి వాటా 3.18 శాతం మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
భూ వివాదంలో బొత్స సందీప్?
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
ప్రభుత్వం మారక ముందే ఊడ్చేద్దాం!
ఒకవైపు నదుల్లో యంత్రాలతో తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా అవేవీ తమకు పట్టవన్నట్లు ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు