IT: ఐటీకి చావుదెబ్బ!
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే.
రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం
పెట్టుబడుల ఆకర్షణలో వెనకబడిన వైకాపా సర్కారు
5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే
ఈనాడు - అమరావతి
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా తదితర నగరాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో (IT professionals) అత్యధికులు తెలుగువారే. వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. రాష్ట్రంలో ప్రముఖ నగరాలుగా వినుతికెక్కిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ విస్తరించి ఉంటే రాష్ట్ర యువతలో అధికశాతానికి వలసబాట తప్పేది. సొంత రాష్ట్రంలో ఘనమైన ఉపాధి దొరికేది. రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడివడిన అనంతరం తెదేపా ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ వైకాపా సర్కారు చూపకపోవడంతో ఆ రంగం ముందడుగు వేయలేకపోయింది.
అదానీ సంస్థ విశాఖలో రూ.70 వేల కోట్లతో 5 గిగావాట్ల(5,000 మెగావాట్ల) డేటా సెంటర్ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 20 ఏళ్లలో ఈ సెంటర్ అభివృద్ధి చేస్తామని పేర్కొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ తీరుతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని రూ.21,844 కోట్లకు తగ్గించి.. 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పరిమితమైంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ పీపీఏలు, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తల్ని వేధింపులకు గురిచేయడంతో బడా సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు, పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల అమలుకు ఆంధ్రప్రదేశ్ను పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి.
ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం పదేపదే చెప్పింది. ఐటీ పార్కులు, ఆఫీసు స్పేసెస్, కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది. నైపుణ్య మానవ వనరులు, వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నా ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. దాంతో రాష్ట్రం నుంచి ఏటా లక్షల మంది యువత ఇంజినీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నా సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క.. వలస వెళ్తున్నారు.
ప్రోత్సాహం ఎక్కడ?
ఐటీ పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోగా.. ఉన్న వాటినీ నిరుపయోగంగా మార్చేసింది జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వం విశాఖలో స్టార్టప్ విలేజ్ను ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్ కంపెనీలు ప్రత్యక్షంగా.. మరో 80 స్టార్టప్లు వర్చువల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత దశ యాక్సిలరేటర్ స్థాయి కంపెనీల కోసం సింగపూర్కు చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది. వాటిని యథావిధిగా వినియోగించుకున్నా.. ఐటీ రంగంలో పొరుగు రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టార్టప్ విలేజ్ను మూసేసి.. అక్కడి భవనాలను మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచింది. మిలీనియం టవర్స్ 1, 2 భవనాలను ఖాళీగా ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు తప్పించి.. కొత్త కంపెనీలకు అందులో స్థలాన్ని కేటాయించలేదు.
ప్రభుత్వ కృషితో వచ్చాయా?
వర్క్ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం కొన్ని చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించి.. ఏపీలో విశాఖను ఎంపిక చేసుకుంది. దీంతో అదనంగా ఉపాధి ఏమీ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం దగ్గర హెచ్సీఎల్ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యువతకు సొంతంగా శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పిస్తోంది. కానీ, కృష్ణా జిల్లాలో హెచ్సీఎల్ కేంద్రం 2023లో ఏర్పాటు చేసినట్లుగా జగన్ ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమైంది.
ముగ్గురున్నా ముందుకేది?
ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను భారీ వేతనాలు ఇచ్చి మరీ నియమించింది. వారిలో శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్రెడ్డిలు (సాంకేతిక), రాజశేఖరరెడ్డి (పాలసీ, ఇన్వెస్ట్మెంట్)లను నియమించినా ఫలితం కనపడలేదు. ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత 5 ఏళ్లలో 21 సంస్థలు కేవలం రూ.6.20 కోట్లను ప్రోత్సాహకాలుగా పొందాయి. అంటే ఏటా సగటున రూ.1.24 కోట్లు ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లైంది. దీన్ని బట్టి ఈ రంగంలో పురోగతిని అర్థం చేసుకోవచ్చు.
అరచేతిలో వైకుంఠం.. ఐటీ పాలసీ
2021-24 ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది. ఐటీ రంగాన్ని తామే పతాక స్థాయిలో అభివృద్ధి చేస్తామని కబుర్లు చెప్పింది. ప్రభుత్వం తక్షణం పలు లక్ష్యాలను సాధించాల్సి ఉందని పాలసీలో చెప్పింది. అవి..
- ఐటీ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడం
- ఐటీ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుగా కోవర్కింగ్ స్పేస్, శాటిలైట్ సెంటర్ల ఏర్పాటు
- స్టార్టప్లు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం
- పెట్టుబడులతో వచ్చేవారికి తక్షణ అనుమతులు
- విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ రంగానికి అవసరమైన రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్లు, కో-వర్కింగ్ స్పేసెస్, స్టేట్ డేటా సెంటర్ వంటి వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఇప్పటికీ ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు.
వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది. పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.
వచ్చింది.. నామమాత్రం
గత అయిదేళ్లలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటీఏఏపీ) గణాంకాల ప్రకారం గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి కేవలం 59 ఐటీ సంస్థలే వచ్చాయి. వాటిలోనూ అధికశాతం విశాఖ, తిరుపతికే పరిమితమయ్యాయి.
విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిలో ఐటీ రంగానికి సంబంధించినవి రూ.41,748 కోట్లే. మొత్తం పెట్టుబడుల ఒప్పందాల్లో వాటి వాటా 3.18 శాతం మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు