Aadudam Andhra: ఆట అట్టర్ ఫ్లాప్!
ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం తొలిరోజే అట్టర్ ఫ్లాప్ అయింది. లక్షల్లో క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పగా, వేలల్లోనూ మైదానాలకు రాలేదు.
ముఖ్యమంత్రి ప్రారంభ అట్టహాసమే మిగిలింది
‘ఆడుదాం ఆంధ్రా’లో కొన్నిచోట్లే సాగిన ఆట
34 లక్షల ఆటగాళ్లన్నారు.. వేలల్లోనూ లేరు
ఈనాడు-అమరావతి, ఈనాడు యంత్రాంగం: ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) కార్యక్రమం తొలిరోజే అట్టర్ ఫ్లాప్ అయింది. లక్షల్లో క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు చెప్పగా, వేలల్లోనూ మైదానాలకు రాలేదు. ఆటగాళ్లు లేక పలుచోట్ల పోటీలే నిర్వహించలేదు. ఇంకొన్నిచోట్ల అప్పటికప్పుడు పేర్లు నమోదు చేసి పోటీలు పెట్టి మమ అనిపించారు. మైదానాలు ఖాళీగా కనిపించకుండా కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులే ఆటలాడారు. కోట్ల రూపాయిలు వెచ్చించి కొన్న క్రీడా పరికరాల్లో నాణ్యతలేమి కొట్టిచ్చినట్లు కనిపించింది. ఒక ఆటకే దెబ్బతిన్నాయి. ఈ కార్యక్రమానికి 34.19 లక్షల మంది క్రీడాకారులు, మరో 88.66 లక్షలమంది పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసింది. ప్రతి సచివాలయ పరిధిలోనూ విధిగా పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినా క్రీడా బృందాలు కనిపించలేదు. ఫోన్లు చేసినా స్పందన లేదు. అప్పటికిగానీ తెలియలేదు ఇవన్నీ ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లని. క్రీడాకారుల కొరతతో శ్రీకాకుళం జిల్లాలో 319 సచివాలయాల్లో పోటీలే ప్రారంభం కాలేదు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని అయిదో నంబరు సచివాలయ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఆడేందుకు ఎవరూ రాలేదు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి సచివాలయం-1, 2 పరిధిలో నాలుగు కబడ్డీ టీంలకు ఒక్కటే వచ్చింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా మరో టీం ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించామనిపించారు.
- కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల క్రీడా మైదానంలో ఆడడానికి తగినంత విస్తీర్ణం లేకపోయినా క్రికెట్ ఆడించేశారు. మ్యాచ్ చూడడం కోసం వచ్చిన వారితో జట్లను ఏర్పాటు చేయడంతో గందరగోళం నెలకొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొందరు వచ్చినప్పటికీ ఆడడానికి ప్రత్యర్థి జట్టు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. కబడ్డీ ఆడడానికి ఒక్కరూ రాలేదు.
- నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని అయిదో నంబరు సచివాలయ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఆటగాళ్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందిపై ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు గురైన సిబ్బంది అప్పటికప్పుడు గ్రామంలోకి వెళ్లి కొంతమందిని తీసుకొచ్చి కబడ్డీ ఆడించి మమ అనిపించారు.
- ప్యాపిలి మండలం వెంగళాంపల్లి గ్రామంలో వాలీబాల్ ఆడడానికి ఒక్కరూ రాలేదు. ఆడించాల్సిన ప్రదేశంలో రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు ఉండడంతో 20 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా ఒక్కరూ రాలేదని సచివాలయ సిబ్బంది వాపోయారు. ఇష్టం లేకున్నా వారి పేర్లను నమోదు చేశారని కొందరు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
- నూనెపల్లెలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఎంపైర్గా వాలంటీర్ బాబు, లెగ్ ఎంపైర్గా వాలంటీర్ శ్రీనాథ్ వ్యవహరించారు.
- అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెంలో పద్నాలుగు మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటే పర్యవేక్షణకు 24 మంది వాలంటీర్లు వచ్చారు.
- శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో క్రీడాపరికరాలు అరకొరగా పంపిణీ జరిగాయి. చిలకపాలెం సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే వస్తారని మధ్యాహ్నం 12:30 వరకు క్రీడాకారులు ఎదురుచూశారు. ఆయన రాకపోవడంతో అప్పటికప్పుడు ఎంపీపీ చిరంజీవితో కార్యక్రమం ప్రారంభించారు.
- క్రికెట్ బ్యాట్స్ నాణ్యత లేకపోవడంతో చాలాచోట్ల క్రీడాకారులు తాము తెచ్చుకున్న బ్యాట్లతో ఆడుకున్నారు. ఆడేందుకు అనువుగా లేవని తెలిపారు.
కబడ్డీ ఆడిన వైకాపా నేతలు
- తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి సచివాలయం-1, 2 పరిధిలో 872 మంది క్రీడాకారులు పాల్గొంటారని, 304 మంది ప్రేక్షకులు పాల్గొంటారని నివేదిక ఇచ్చారు. క్రీడా మైదానాలు స్థానికంగా లభించక, కిలోమీటరున్నర దూరంలోని డిగ్రీ కళాశాలలో కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలకు ఏర్పాట్లు చేశారు. నాలుగు కబడ్డీ టీమ్లు పోటీలకు రావాల్సి ఉండగా ఒక్క టీమ్ మాత్రమే వచ్చింది. అప్పుటికప్పుడు ఓ డమ్మీ టీమ్ను ఏర్పాటు చేసి ఆడించారు. ఈ టీమ్లో చినకొండేపూడికి చెందిన వైకాపా నాయకుడు, విద్యా కమిటీ ఛైర్మన్ రామకృష్ణ కూడా కబడ్డీ ఆడి మమ అనిపించారు. వాలంటీర్లే ప్రేక్షకులయ్యారు.
- కాకినాడ జిల్లా పెద్దాపురంలో క్రీడాకారులకు అల్పాహారం, భోజనాల ఏర్పాట్లు లేవు. పిఠాపురంలో ఆటాడేందుకు యువత ఆసక్తి చూపలేదు. పట్టణంలో 250 మంది వాలంటీర్లు ఉంటే 50 మంది కూడా హాజరుకాలేదు. సచివాలయ సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. ఆటలను ప్రారంభించి ప్రజాప్రతినిధులు వెళ్లిపోగా, క్రీడాకారులు లేక అధికారులు ఆడించలేదు.
మహిళా వాలంటీర్లతో వాలీబాల్
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఎండకు తాళలేక ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. అల్లవరం మండలం గోడిలంకలో మహిళలెవరూ రాకపోవడంతో మహిళా వాలంటీర్లతోనే వాలీబాల్ ఆడించారు. ముమ్మిడివరంలోని ఎంజీఆర్ మైదానంలో ఆటలాడుతుండగా పందులు చొరబడ్డాయి. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో క్రీడాకారులు లేక మధ్యాహ్నం 3 గంటల వరకు ఆటలు ప్రారంభం కాలేదు.
- ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో వాలీబాల్ ఆడిన క్రీడాకారులే క్రికెట్ కూడా ఆడి 11.30 గంటలకు వెళ్లిపోయారు. మెడికల్ సిబ్బంది ఒక్కరు తప్ప.. మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది.
సీఎం సొంత జిల్లాలో నాసిరకం బ్యాట్లు
- క్రీడా పరికరాల నాసిరకం వ్యవహారం వైయస్ఆర్ జిల్లాలోనే బయటపడింది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో మొదటి మ్యాచ్లోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. ప్రొద్దుటూరులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని విద్యార్థుల ద్వారా శుభ్రం చేయించి పోటీలను నిర్వహించారు. సిద్దవటంలో 80 ఏళ్ల వృద్ధురాలిని క్రీడాకారిణిగా ఎంపిక చేయడం విశేషం.
అందుబాటులో లేని సేవలు
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపల్ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగలంతా పోటీల నిర్వహణకు వెళ్లడంతో వివిధ సేవలు, అవసరాల కోసం వచ్చిన వారికి ఎవరూ అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. సచివాలయాలు, కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని బొడ్డవలస గురుకుల పాఠశాల మైదానంలో ఆడేందుకు పలువురు పేర్లు నమోదు చేయించుకున్నా కొత్తవలస నుంచి అమ్మాయిల జట్టు, కరాసువలస నుంచి అబ్బాయిల జట్టే వచ్చాయి. ఈ రెండు జట్లను మండల స్థాయికి పంపించారు. తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలోనూ అదే పరిస్థితి.
చూడాలని తీసుకొచ్చి ఆడించారు..
ప్రకాశం జిల్లా పీసీపల్లి పంచాయతీలో నిర్వహించిన క్రీడాపోటీలకు స్థానిక మహిళలు రాలేదు. ఈలోపు మురుగమ్మి పంచాయతీలోని అయ్యవారిపల్లికి చెందిన మహిళలు పొదుపు రుణాలు తీసుకునేందుకు పీసీపల్లి బ్యాంకుకు వచ్చారు. వారిని ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమం చూడాలంటూ తీసుకొచ్చారు. కాసేపయ్యాక వారితోనే టెన్నికాయిట్ ఆడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం