Dharmana: గేటుకు తాళం వేసి మంత్రి ధర్మాన సభ

శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌ ఆసరా సంబరాలు నిర్వహించారు.

Updated : 24 Jan 2024 08:46 IST

శ్రీకాకుళం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌ ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఆయన ప్రసంగించక ముందే సభ నుంచి కొందరు మహిళలు బయటకు వచ్చేయడంతో మిగిలినవాళ్లు వెళ్లిపోకుండా వైకాపా నేతలు పాఠశాల గేటుకు తాళం వేసేశారు.

బడి జరుగుతుండగానే సమావేశం నిర్వహించడంతో మైక్‌ సిస్టం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటేయకపోతే తమకు పోయేది ఏమీ లేదన్నారు. పథకాలన్నీ నిలిచిపోయి ప్రజలే నష్టపోతారని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు