YSRCP Leader: వైకాపా నేతకు 3 చోట్ల ఓటు హక్కు

తుది ఓటర్ల జాబితాలోనూ వైకాపా నేతలకు ఒకటికి మించి ఓట్లు వెలుగుచూశాయి. ఫిర్యాదులు చేసినా ఆ ఓట్లు తొలగించకపోవడం గమనార్హం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం ఆర్ముగంనగర్‌కు చెందిన వైకాపా నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డికి స్థానిక పురపాలికతో పాటు రెండు పంచాయతీల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు తేలింది.

Published : 25 Jan 2024 06:08 IST

నాయుడుపేట పట్టణం, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తుది ఓటర్ల జాబితాలోనూ వైకాపా నేతలకు (YSRCP Leaders) ఒకటికి మించి ఓట్లు వెలుగుచూశాయి. ఫిర్యాదులు చేసినా ఆ ఓట్లు తొలగించకపోవడం గమనార్హం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం ఆర్ముగంనగర్‌కు చెందిన వైకాపా నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డికి స్థానిక పురపాలికతో పాటు రెండు పంచాయతీల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులకు ఓట్లు ఉండటం గమనార్హం. నాయుడుపేట 68వ పోలింగ్‌ కేంద్రం, వేముగుంటపాళెం, మర్లపల్లిలో రాజారెడ్డి దంపతులకు ఓట్లు ఉన్నాయి. మరోవైపు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి 18వ వార్డులోని 52వ పోలింగ్‌ కేంద్రం జాబితాలో ఇంటి నంబరు 1-620లోని ఓటరు వివరాలు అర్థం కాని భాషలో ప్రచురించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని