Union Budget 2024: రాజధాని అమరావతి రైల్వే లైన్కు ‘వెయ్యి రూపాయలిచ్చిన’ కేంద్రం!
రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్కు బడ్జెట్లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే.
విశాఖపట్నం జోన్కు రూ. 9 కోట్లు
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ. 9,138 కోట్ల కేటాయింపులు
భారీగా నిధులు సాధించడంలో మరోసారి వైకాపా ఎంపీలు విఫలం
ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్కు బడ్జెట్లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే. రూ.2,679 కోట్ల వ్యయమయ్యే ఈ లైన్కు గత అయిదేళ్లలో రూ.2.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా సర్వేల కోసం వెచ్చించిందే. ఇపుడు రూ.వెయ్యి ఇస్తామని పేర్కొనడం చూస్తే కేంద్రం మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో గతంలో మంజూరైన వివిధ లైన్లకు కూడా రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షలు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలు తదితరాలకు కలిపి రూ.170 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచనా వేయగా, దీనికి ఇప్పుడు ఇస్తామంటున్నది కేవలం రూ.9 కోట్లు. ఇది రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న నిధుల తీరు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా.. అత్యధిక ప్రాజెక్టులకు మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. కేంద్ర తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా, అందులో రైల్వే శాఖకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. వాటిలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్కు కలిపి రూ.9,138 కోట్లు కేటాయించారు.
అంతమంది ఎంపీలున్నా..
ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎంత ఒత్తిడి తీసుకొస్తేనే అంత పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఉంటుంది. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం మరోసారి విఫలమైంది. లోక్సభ, రాజ్యసభల్లో కలిపి 31 మంది వైకాపా ఎంపీలున్నా.. రాష్ట్రానికి పెద్దఎత్తున రైల్వే నిధులను రాబట్టలేకపోయారు. విశాఖలో జోన్ కార్యాలయానికి సిద్ధంగా ఉన్నామని రైల్వేశాఖ చెబుతుంటే.. దానికి భూమిని అప్పగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో కేంద్రం అత్తెసరు నిధులతో సరిపెట్టింది. మొత్తంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రంలోని రెండు, మూడో లైన్లకు మాత్రమే కొంత ఆశాజనకంగా నిధుల కేటాయింపు జరిగింది.
ఇంత నిర్లక్ష్యమా?
రాజధాని ప్రాంతం అమరావతిని రైల్వే లైన్లతో అనుసంధానం చేసేందుకు వీలుగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 106 కి.మీ. కొత్త లైన్కు కేవలం రూ.వెయ్యి మాత్రమే కేటాయించారు. దీనికి రూ.2,679 కోట్లు వ్యయమవుతుందని గతంలో అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా వెచ్చిస్తుందో తెలపాలని రైల్వేశాఖ ప్రతిసారి కోరుతూనే ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఏటా మౌనం వహిస్తోంది. దీంతో కేంద్రం కూడా పట్టనట్లు వదిలేసింది. వైకాపా ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం కల్పించే ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు.
రూ.9 కోట్లు ఎక్కడ సరిపోతాయి?
విభజన హామీల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అయిదేళ్లు అవుతోంది. అందుకు సంబంధించి భవనాల నిర్మాణం, వసతుల కల్పన తదితరాలకు కలిపి రూ.170 కోట్లు అవసరమని గతంలో డీపీఆర్ సిద్ధం చేశారు. తాజాగా డీపీఆర్లో అంచనా విలువ మరింత పెరిగింది. ఈసారి దానికి బడ్జెట్ కేటాయించింది మాత్రం కేవలం రూ.9 కోట్లు మాత్రమే.
ఆ లైన్లను పట్టాలెక్కించే ఉద్దేశం ఉందా?
- రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఎప్పుడో మంజూరైన వివిధ లైన్లకు ఈసారి కూడా బడ్జెట్లో పేర్కొన్న నిధులు చూస్తే, అసలు వాటిని పట్టాలెక్కించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పలు ప్రాజెక్టులకు మరీ ఘోరంగా రూ.వెయ్యి చొప్పున కేటాయించారు.
- కాకినాడ-పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల-నల్గొండ (92 కి.మీ.), కంభం-ప్రొద్దుటూరు (142 కి.మీ.), గూడూరు-దుగరాజపట్నం (41.55 కి.మీ.) లైన్లకు కేవలం రూ.వెయ్యి చొప్పున ఇవ్వనున్నారు.
- కొండపల్లి-కొత్తగూడెం (125 కి.మీ.) రూ.10 లక్షలు, భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ.) రూ.10 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.
- జగ్గయ్యపేట నుంచి తెలంగాణలోని మేల్లచెరువు వరకు 19.1 కి.మీ. కొత్తలైన్కు రూపాయి కూడా ఇస్తామని చూపలేదు.
కీలక మార్గాలు పూర్తయ్యేదెప్పుడు?
రాష్ట్రంలో వివిధ కీలకమైన రైల్వే లైన్లకు కేటాయింపులు చూస్తే, అవి కూడా ఇప్పుడపుపడే పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
- కడప-బెంగళూరు (255 కి.మీ.) లైన్కు బడ్జెట్లో రూ.10.01 లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టు విలువ రూ.2,071 కోట్లుకాగా, ఆరేళ్ల కిందటే కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. పూర్తయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. గత బడ్జెట్లో కూడా దీనికి రూ.10.01 లక్షలు ఇవ్వగా, ఈసారి కూడా అంతే మొత్తం విదల్చనున్నారు.
- నడికుడి-శ్రీకాళహస్తి (309 కి.మీ.)మార్గం అంచనా విలువ రూ.2,643 కోట్లు కాగా రూ.450 కోట్లు కేటాయించారు.
- కోటిపల్లి-నర్సాపురం మధ్య 57.21 కి.మీ. కొత్త లైన్ అంచనా వ్యయం రూ.2,120 కోట్లుకాగా, దీనికి ఈసారి ఇస్తామంటున్నది రూ.300 కోట్లు.
రెండు, మూడో లైన్లకు అధిక నిధులు
రాష్ట్రంలో రెండు, మూడు లైన్లకు ఇవ్వనున్న నిధులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇందులో కాజీపేట-విజయవాడ (219 కి.మీ.) మూడో లైన్కు రూ.310 కోట్లు, విజయవాడ-గూడూరు (287 కి.మీ.) మూడో లైన్కు రూ.500 కోట్లు, గుంటూరు-గుంతకల్లు (401 కి.మీ.) రెండో లైన్కు రూ.283.50 కోట్లు, గుంటూరు-బీబీనగర్ (248కి.మీ.) రెండో లైన్కు రూ.200 కోట్లు ఉన్నాయి.
సర్వే దశలో ఉన్న దువ్వాడ-విజయవాడ మధ్య 335 కి.మీ. మూడో లైన్కు కేవలం రూ.వెయ్యి ఇవ్వనున్నారు.
కర్నూలు వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.115 కోట్లు
కర్నూలులోని వ్యాగన్ మరమ్మతుల కేంద్రం (మిడిలైఫ్ వ్యాగన్ రిహ్యాబిలిటేషన్ వర్క్షాపు)నకు రూ.115 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్టు మంజూరైనా దీని పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి