రోజూ చేయి చాచడమేనా!
ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్ సర్కార్ను చూస్తే సరిపోతుందేమో! ఇదేం పద్ధతి అంటూ వైకాపా ప్రభుత్వ తీరును కాగ్ ఎప్పుడో ఎండగట్టింది.
కాగ్ తేల్చిన జగన్ సర్కార్ అప్పుల చిట్టా!
ఏడాదంతా అప్పులే
ఏటేటా పెరిగిపోతున్న వడ్డీలు
ఈనాడు-అమరావతి: ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్ సర్కార్ను చూస్తే సరిపోతుందేమో! ఇదేం పద్ధతి అంటూ వైకాపా ప్రభుత్వ తీరును కాగ్ ఎప్పుడో ఎండగట్టింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా, ఖజానా ఖాతాలో కనీస నిల్వ కూడా లేకుండా ఏమిటీ అప్పులు.. చేబదుళ్లు అంటూ నిలదీసింది. కొంత జాగ్రత్తపడితే ఈ వడ్డీల బాధ తప్పుతుంది కదా.. అని సలహా కూడా ఇచ్చింది. రోజూ చేబదుళ్లు తీసుకుంటూ.. వడ్డీల రూపంలో వృథా ఖర్చులు చేస్తున్నారని విస్తుపోయింది. ఎప్పుడో 2021 లెక్కలు చూసిన తర్వాతే కాగ్ అలా చెప్పింది. జగన్ సర్కార్ ఆ మాట వినకపోగా, మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ.. వాటిపై భారీగా వడ్డీలూ చెల్లిస్తోంది. 2019-20లో ఏడాది మొత్తం 221 రోజులే ఇలా చేబదుళ్లు తీసుకుంటే.. నాలుగేళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులతోనే కాలం గడిపే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది. అప్పు పుడితేనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు.. ఏ కార్యక్రమానికైనా నిధులివ్వాలంటే రుణం తీసుకోవాల్సిందే. ఆఖరికి ఉద్యోగులు రిజర్వు బ్యాంకు వెబ్సైట్ చూసుకుని, రాష్ట్రం అప్పు ఎప్పుడు తెస్తుంది.. ఎంత తీసుకుంటోంది.. మనకు జీతం ఎప్పుడు వస్తుంది అని లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి. ఒక ప్రణాళిక లేకుండా ఎప్పుడూ రిజర్వు బ్యాంకు నుంచి చేబదుళ్లు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాను నడపాల్సి రావడంతో ఏటా వాటిపై చెల్లించే వడ్డీల భారమూ పెరిగిపోతోంది. సర్కార్ పెద్దలు మాత్రం అబ్బే.. అలాంటిదేం లేదంటారు. వైకాపా సర్కార్ అయిదేళ్ల కాలంలో నాలుగేళ్ల ఆర్థిక లెక్కలను కాగ్ ఖరారు చేసింది. వాటిని రాష్ట్ర శాసనసభలోనూ ప్రవేశపెట్టారు. ఏ ఏడాది ఎన్ని రోజులు చేబదుళ్లు, అప్పులు తీసుకువచ్చింది? ఎన్ని రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో రాష్ట్రం మునిగిపోయింది అన్న లెక్కలు గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. బహిరంగ మార్కెట్, కార్పొరేషన్ల రుణాలు, పబ్లిక్ ఎకౌంట్ నుంచి వాడుకున్నవి కాకుండా వేసిన లెక్కలివి.
ఏమిటీ చేబదుళ్లు? ఓవర్ డ్రాఫ్ట్ కథాకమామిషు
- ఖజానాలో ఉండాల్సిన కనీస నగదు నిల్వ: రూ. 1.94 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాలు, గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలే కాదు.. రోజువారీ నిర్వహణ కోసం రిజర్వు బ్యాంకు ఇచ్చే చేబదుళ్లు, ప్రత్యేక సదుపాయం రుణాలు కూడా తీసుకుంటుంది.
- ఓవర్డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తుండాలి. ఆ చేబదుళ్లకు వడ్డీలూ కట్టాలి. అదీ ఒక రకమైన అప్పే.
- రిజర్వు బ్యాంకు 3 తరహాలుగా ఈ రుణ వెసులుబాటు కల్పిస్తుంది. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్.
- రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద రూ.400 కోట్ల వరకు వాడుకోవచ్చు. ఈ మొత్తం మన రిజర్వు నిధిని బట్టి ఉంటుంది.
- ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వాడేసుకున్న తరువాత కూడా రిజర్వు బ్యాంకు నుంచి చేబదుళ్లు తీసుకోవచ్చు. రూ.2,252 కోట్ల మేర ఇలా తీసుకోవచ్చు.
- ఆ మొత్తమూ వాడుకున్న తర్వాత దాదాపు చేబదుళ్ల మొత్తమే ఓవర్ డ్రాఫ్ట్ట్గా వాడుకోవచ్చు.
- ఓడీలోకి వెళ్లిన తర్వాత 5 రోజుల్లోపు ఆ అప్పు మొత్తం ఆర్బీఐకి చెల్లించి బయటపడాలి.
- అలా చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం సొమ్ములూ వెనక్కు చెల్లిస్తూ, మళ్లీ ఆ సదుపాయాల కింద అంతే మొత్తం వాడుకుంటూ నడిపిస్తూ ఉంటారు.
- ఈ చేబదుళ్లు తీసుకోకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేసుకుంటే వడ్డీల భారాలు ఉండవు.
ఇవీ పరిమితులు..
- ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 14 రోజుల పాటు ఓవర్డ్రాఫ్ట్ వెసులుబాటును వినియోగించుకోవచ్చు.
- మూడు నెలల కాలంలో 36 రోజులకు మించి ఓడీ సౌకర్యం ఉండకూడదు.
జగన్ సర్కార్ అప్పుల చిట్టా ఇదీ (ఇలాంటి అప్పులు, వడ్డీలు, అప్పుల రోజులు ఎలా పెరిగిపోయాయో తెలిపే కాగ్ లెక్కలివి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!