నిబంధనలకు ‘సున్నం’ కొట్టి.. జగన్కు దోచిపెట్టి!
పాలించే వారు మనవారైతే గనులు, భూగర్భ వనరులను ‘నిక్షేప’ంగా దోచేయొచ్చని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జమానాలో జగన్ బ్యాచ్ నిరూపించింది.
ఈశ్వర్, దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర
హవాలా రూపంలో జగన్ జేబుల్లోకి రూ.55 కోట్లు
407 ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్కు అక్రమ అనుమతి
జగన్ కంపెనీల్లోకి రూ.95 కోట్లు మళ్లింపు
2013 ఏప్రిల్లోనే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు
విచారణ పదేళ్లలో 249 సార్లు వాయిదా
రుజువైతే నిందితులకు జీవితఖైదుకు అవకాశం
ఈటీవీ, హైదరాబాద్
అసలు కంపెనీయే లేదు... అయినా గనులు కావాలంటూ దరఖాస్తు చేశారు! తిరస్కరిస్తే కొద్దికాలం ఆగారు... తమ నేత వచ్చాక మేతకు శ్రీకారం చుట్టారు! లేని కంపెనీ పేరిటే దర్జాగా లీజులు పొందారు... పెట్టని పరిశ్రమకు శంకుస్థాపన చేశారు... ముడుపులిచ్చిన ఇంకో కంపెనీకి అన్నింటినీ అంటగట్టారు... ఈ జగన్నాటకంలో జగమంతా తెలిసిన ఏ1 భారీగా లబ్ధి పొందారు!! ఈ అవినీతి దందాపై సీబీఐ కేసు వేస్తే... పదేళ్లుగా వాయిదాలతో నడిపిస్తున్నారు...!
పాలించే వారు మనవారైతే గనులు, భూగర్భ వనరులను ‘నిక్షేప’ంగా దోచేయొచ్చని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జమానాలో జగన్ బ్యాచ్ నిరూపించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడింది. ఉన్నతాధికారులూ వారికి అంటకాగారు. తన తండ్రి అధికారం మాటున జగన్ చేసిన కుంభకోణాలపై సీబీఐ పెట్టిన కేసుల్లో దాల్మియా సిమెంట్స్ ఒకటి. ఈ సంస్థకు 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా కట్టబెట్టినందుకు జగన్ కంపెనీల్లోకి రూ.95 కోట్లు చేరాయని, హవాలా రూపంలోనూ రూ.55 కోట్లు ఆయనకు అందాయని సీబీఐ వెల్లడించింది. 13 మందిని నిందితులుగా తేలుస్తూ దాఖలైన ఈ కేసు... ఇప్పటికి 249సార్లు వాయిదా పడింది.
పక్కన పెట్టిన దరఖాస్తుకు ప్రాణం పోశారు...
కడప జిల్లా మైలవరం మండలంలో 407 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం పులివెందులకు చెందిన ఏవీ రాజ్యలక్ష్మి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్న జయ మినరల్స్ సంస్థ 1997లో గనుల శాఖకు దరఖాస్తు చేసింది. సరైన వివరాలు లేకపోవడం, దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో ఆ కంపెనీయే లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది. వైఎస్ 2004లో సీఎం అయ్యాక అదే దరఖాస్తు మళ్లీ తెరపైకి వచ్చింది.
తప్పుడు నివేదికతో లీజు బదిలీ
నిబంధనల ప్రకారం... ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ను, మైనింగ్ లీజులను లాభాల కోసం ఇతరులకు విక్రయించరాదు. అయితే, ఇక్కడ ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదంటూ వి.డి.రాజగోపాల్ తప్పుడు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో మైనింగ్ లీజులను ‘దాల్మియా’ కు 2008 డిసెంబరు 18న బదిలీ చేశారు. అయితే ఈశ్వర్ సిమెంట్స్ను టేకోవర్ చేసేందుకు ‘దాల్మియా’ రూ.3.75 కోట్లు చెల్లించింది. ఇందులో ‘ఈశ్వర్’కు రూ.2.14 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది.
ఫైళ్లు కదిలిన కొద్దీ జగన్కు లబ్ధి
రఘురాం సిమెంట్స్ లిమిటెడ్లో జగన్కు చెందిన సిలికాన్ బిల్డర్స్, సండూర్ పవర్లు 2006 అక్టోబరులో వాటాలు పొందాయి. 2006 డిసెంబరు 1న ‘రఘురాం’లో జగన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ కంపెనీ పేరును 2010 సెప్టెంబరు 1న భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రై.లి.గా మార్చారు. ఇందులో వైఎస్ భారతీరెడ్డి 2010 డిసెంబరు 26న బోర్డు ఆఫ్ డైరెక్టర్స్లో చేరారు. మరోవైపు లైసెన్స్, లీజుల ఫైళ్లు కదులుతున్న కొద్దీ... పునీత్ దాల్మియా నుంచి జగన్కు లబ్ధి చేకూరిందని సీబీఐ వివరించింది. ‘రఘురాం’లో పెట్టుబడుల ముసుగులో దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్... 2007 మార్చి 28 నుంచి 2009 ఆగస్టు 5 వరకు ఆరు విడతల్లో రూ.95 కోట్లను పొందినట్లు వెల్లడించింది.
గుట్టువిప్పిన పెన్డ్రైవ్
రఘురాం సిమెంట్స్ నుంచి కొన్న షేర్లను ఫ్రాన్స్కు చెందిన పర్ ఫిసిమ్ సంస్థకు 2010 ఏప్రిల్లో ‘దాల్మియా’ అమ్మేసింది. పర్ ఫిసిమ్తో విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారని, ఈ లావాదేవీలో ‘దాల్మియా’కు రూ.146.58 కోట్లు వచ్చాయని, అందులో పన్నులు పోగా మిగిలిన రూ.139 కోట్లు హవాలా మార్గంలో మళ్లీ జగన్కే చేరతాయనే వివరాలు ఉన్నట్లు సీబీఐ వివరించింది. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో దాల్మియా సంస్థ మేనేజర్ వద్ద లభించిన పెన్డ్రైవ్... హవాలా లావాదేవీల గుట్టురట్టు చేసింది. అందులోని వివరాల ప్రకారం... ‘జేఆర్ అకౌంట్’ అంటే జగన్మోహన్రెడ్డికి రూ.55 కోట్లు హవాలా మార్గంలో చేరాయని, మరో రూ.84 కోట్ల బ్యాలెన్స్ ఉందని తేలింది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రాథమిక విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో 2011 జూన్ నుంచి లావాదేవీలు నిలిచిపోయాయని సీబీఐ వెల్లడించింది.
కుట్రలోకి సజ్జల అండ్ కో...
సజ్జల దివాకర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భగీరథి డైరెక్టర్లుగా ఉన్న ఈశ్వర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రంగంలోకి దిగింది. జయ మినరల్స్ను తాము టేకోవర్ చేశామని, ప్రాస్పెక్టింగ్ లైసెన్సును జయ మినరల్స్కు బదులుగా ఈశ్వర్ సిమెంట్స్ పేరిట ఇవ్వాలని సజ్జల దివాకర్రెడ్డి 2004 అక్టోబరులో గనుల శాఖను కోరారు. మరోవైపు ఈశ్వర్ సిమెంట్స్ పేరిట మూడు నెలల్లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్, మైనింగ్ లీజులు సంపాదించి...వాటిని ‘దాల్మియా’కు బదిలీ చేయాలని... 2006 ఏప్రిల్ 12న సజ్జల దివాకర్రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కుట్రలో భాగంగా పునీత్ తన ఉద్యోగి టుగ్నైట్ను 2006 ఆగస్టు 18న ఈశ్వర్ సిమెంట్స్లోకి డైరెక్టర్గా దింపారు.
డైరెక్టర్ నుంచి మంత్రి వరకు అధికార దుర్వినియోగం
గతంలోనే దరఖాస్తును తిరస్కరించారని తెలిసీ.. గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ మూడు నెలల వ్యవధిలో ఈశ్వర్ సిమెంట్స్కు బదిలీ చేయాలన్న షరతుతో జయ మినరల్స్ పేరిట ప్రాస్పెక్టింగ్ లైసెన్సును మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. పరిశ్రమల శాఖ నాటి కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆ ఫైల్ను గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించగా ఆమె అనుమతించారు. దీంతో శ్రీలక్ష్మి 2006 జులై 14న జయ మినరల్స్కు 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలపై ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మంజూరు చేశారని సీబీఐ అభియోగం.
నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశం
సీబీఐ నమోదు చేసిన ఐపీసీ 120(బి) రెడ్విత్ 420, 409, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9, 12, 13(2) రెడ్విత్ 13(1)(సి)(డి) ప్రకారం... నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశముంది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
చెల్లింపులను ‘జె’తో కన్ఫర్మ్ చేయించండి
‘2010 డిసెంబరు 31 నాటికి 3500 టన్నులు అందింది. మరో 500 టన్నుల స్టాక్ 2011 జనవరి 3 నాటికి పంపిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని విజయసాయిరెడ్డి పంపించిన ఈ-మెయిల్ ప్రతిని పెన్డ్రైవ్లో సీబీఐ గుర్తించింది. దాని ప్రకారం... 2010 డిసెంబరు 31నాటికి రూ.35 కోట్లు, 2011 జనవరి 3 వరకు మరో రూ.5 కోట్ల చెల్లింపులు జరిగాయని సీబీఐ తెలిపింది. ‘‘విజయసాయి గారూ.. నిన్నటివరకు రూ.11.25 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి ‘జె’తో కన్ఫర్మ్ చేయించండి’’ అని పునీత్ దాల్మియా చేసిన ఎస్ఎంఎస్ కూడా పెన్డ్రైవ్లో లభించింది. ‘హైదరాబాద్ పార్టీకి 2011వ ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.1.25 కోట్ల చొప్పున రూ.15 కోట్ల చెల్లింపు’ అనే మరో ఆధారాన్ని కూడా సీబీఐ గుర్తించింది.
సీబీఐ కేసులో విచారణ 249 సార్లు వాయిదా
హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో 2013 ఏప్రిల్ 8న అభియోగపత్రం దాఖలైంది. ఇందులో ఏ1గా జగన్ను, ఏ2గా వి.విజయసాయిరెడ్డిని, ఏ3గా పునీత్ దాల్మియాను, ఏ4 సబితా ఇంద్రారెడ్డిని, ఏ5గా వై.శ్రీలక్ష్మితోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో ఇప్పటివరకు 249సార్లు వాయిదా పడింది. విచారణ సాగుతుండగానే ఏ7 సజ్జల దివాకర్రెడ్డి మరణించారు. పునీత్ దాల్మియా క్వాష్ పిటిషన్ వేయడంతో హైకోర్టు 2016లో స్టే విధించగా విచారణ చాలాకాలం నిలిచిపోయింది. హైకోర్టు 2021లో స్టే ఎత్తివేయడంతో విచారణ మళ్లీ కొనసాగింది. నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అభియోగాల నమోదు జరగాల్సి ఉంది. ఈ కేసులో ఈడీ ఇంకా ఛార్జిషీటు వేయలేదు. గతంలో పలుమార్లు ఛార్జిషీట్ సమర్పించినా సాంకేతిక కారణాలతో న్యాయస్థానం వెనక్కి పంపింది.
దొడ్డిదారిన దాల్మియా ప్రవేశం...
ప్రభుత్వం నుంచి జీవో రాగానే ప్రాస్పెక్టింగ్ లైసెన్సును ఈశ్వర్ సిమెంట్స్ పేరిట బదిలీ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి 2006 ఆగస్టు 23న గనుల శాఖకు దరఖాస్తు చేశారు. అంతకుముందే.. సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని సజ్జల దివాకర్రెడ్డి గనుల శాఖకు తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు సీబీఐ వివరించింది. ఆ తర్వాత.. ఈశ్వర్ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న దాల్మియా ఉద్యోగి టుగ్నైట్.. సున్నపురాయి మైనింగ్ లీజు కోసం 2007 ఫిబ్రవరి 15న దరఖాస్తు చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 20న ఈశ్వర్ సిమెంట్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసినట్లు నివేదిక ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజు వైఎస్ శంకుస్థాపన చేసింది దాల్మియా సిమెంట్స్దేనని సీబీఐ స్పష్టంచేసింది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరైనట్లు వెల్లడించింది. ప్లాంటు ఈశ్వర్ సిమెంట్స్ది కాదని తెలిసినా.. రాజగోపాల్ నోట్ పంపించగా శ్రీలక్ష్మి, సబిత దాన్ని ఆమోదించారు. ఇలా.. ఈశ్వర్ సిమెంట్స్కు 30 ఏళ్లపాటు సున్నపురాయి మైనింగ్ లీజును ఇస్తూ 2008 జనవరి 9న జీవో జారీచేశారు. తర్వాత ఆ లీజును దాల్మియాకు బదిలీ చేయాలంటూ ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల