అభినవ అప్పుల అప్పారావులు!
ప్రతిపక్షంలో ఉండి ఎన్నెన్నో అన్నారు! అప్పు ముప్పన్నారు.. తప్పుతప్పన్నారు! అభినవ ఆర్థిక వేత్తలుగా మారిపోయారు!! అధికారమిస్తే ఎన్నెన్నో చేస్తామన్నారు! ప్రజా శ్రేయోభిలాషుల్లా పోజులిచ్చారు.
నాడు ఆర్థిక సంస్కర్తలుగా గొప్పలు
ఇప్పుడు ఇష్టారీతిన అప్పులు
జవాబుదారీతనం కనిపించని చేతలు
ప్రశ్నించే వారిపై అక్కసు
నాడు!!
ప్రతిపక్షంలో ఉండి ఎన్నెన్నో అన్నారు!
అప్పు ముప్పన్నారు.. తప్పుతప్పన్నారు!
అభినవ ఆర్థిక వేత్తలుగా మారిపోయారు!!
అధికారమిస్తే ఎన్నెన్నో చేస్తామన్నారు!
ప్రజా శ్రేయోభిలాషుల్లా పోజులిచ్చారు..
నేడు!
అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారు!
లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తున్నారు!
కొత్తదారుల్లో రుణాలు పుట్టిస్తున్నారు!
జీతాలు, పింఛన్లు ఇష్టమొచ్చినప్పుడు ఇస్తున్నారు!
అనుయాయుల బిల్లులే చెల్లిస్తున్నారు!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత పది సంవత్సరాలుగా పరిశీలిస్తున్న వారిని ఎవరినైనా... అప్పుడు ఒకలా చెప్పి, ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నది ఎవరని అడిగితే ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నానా కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా జగన్, ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి... ఇద్దరూ రాష్ట్ర ఖజానాకు తామే రక్షకులమన్నట్లు ఎన్నో సుద్దులు చెప్పారు. నాడు వీరిద్దరూ ఆర్థికవేత్తల పాత్రలను పోషిస్తూ... అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేయని విశ్లేషణ లేదు... చెప్పని మాట లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, అంతా రహస్య పాలన సాగుతోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటిపోయి మరీ ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తోందని నానాయాగీ చేశారు. చంద్రబాబు సర్కారును కాగ్ తీవ్రంగా ఆక్షేపిస్తోందనీ విమర్శలు కురిపించారు. తాము అధికారంలోకొస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మారుస్తామని, అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని పాలిస్తామనే స్థాయిలో ప్రజలను విజయవంతంగా నమ్మించారు. తర్వాత... జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. బుగ్గన ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే, నాటి అభినవ ఆర్థికవేత్తలిద్దరూ కొత్త ఆర్థిక పాఠాలు చెప్పడం ప్రారంభించారు. రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపడంలో జగన్ రికార్డు సృష్టించారు. బుగ్గన ఏకంగా... ‘‘అప్పు చేస్తే తప్పేముందండీ’’ అని ప్రశ్నించసాగారు. ‘‘ఉద్యోగుల జీతాలకు, పింఛన్లకు తొందరేమొచ్చింది. నెలలో ఎప్పుడో అప్పుడు ఇస్తున్నాం కదా. పెండింగు బిల్లులనూ ఈ సర్కారులోనో, వచ్చే సర్కారులోనో ఇస్తాం కదా’’ అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. దివాలా తీసిన కంపెనీని అప్పులోళ్లు చుట్టుముట్టినట్లు... ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతుంటే, బకాయిలపై నిలదీస్తుంటే పోలీసుభద్రత మధ్య ముఖం చాటే సుకుని తిరుగు తున్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గనదీ అదే శైలి!
వైకాపా 2014-19 మధ్య ప్రతిపక్షంలో ఉండగా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అనేక సందర్భాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడేవారు. ‘‘రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడికి పోతోంది? మీరసలు ఇంత అప్పును ఎందుకు చేస్తున్నారు? వాటిని కట్టేది ఎవరండీ? పన్నులు చెల్లిస్తున్న మనందరమే కదా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లిపోయి అదేదో గొప్ప పని చేసినట్లుగా చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు. విపరీతమైన అప్పులు చేయడం మానుకోండి...’’ అని నాటి తెదేపా సర్కారును ఉద్దేశించి విమర్శలు చేసేవారు.
రుణం తేవడం తప్పే కాదట!!
‘‘ప్రజల కోసమే అప్పులు చేస్తున్నాం. అప్పు చేస్తే తప్పేముంది. డబ్బు అవసరం వచ్చినందుకు అప్పులు చేశామని గర్వంగా చెబుతున్నాం. సామాన్యుడిని కాపాడేందుకు, పరిపాలన కోసమే అప్పులు చేయాల్సి వచ్చింది. మనం ఒక్కళ్లమే కాదు... అంతా రుణాలు తీసుకుంటున్నారు. ప్రపంచంలో అప్పు చేయని ఒక దేశం పేరు చెప్పండి. 2016-17 నుంచి స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం గమనిద్దాం. మామూలుగా 28% ఉండేది. ఇప్పుడు 30% దాటింది. మనతోపాటు చాలా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. మనమేమీ అత్యుత్తమంగా ఉన్నామని చెప్పడం లేదే...’’
(2019 నుంచి ఆర్థిక మంత్రిగా బుగ్గన చేస్తున్న వ్యాఖ్యలివీ)
ప్రతిపక్ష నేతగా జగన్ నాడు ఏం చెప్పారంటే..!
1) ‘‘ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి అప్పులు తీసుకునే, నిధులు వాడుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? నిబంధనలకు లోబడి జీఎస్డీపీలో 3% వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం 8% వరకు అప్పులు చేస్తోంది. ఇది ప్రభుత్వమా లేక ప్రయివేటు రంగ సంస్థా? ప్రభుత్వం బడ్జెట్ లెక్కలనూ తారుమారు చేస్తోంది..’’
(2016 మార్చి 17న బడ్జెట్ సమావేశాల సందర్బంగా శాసనసభ లాబీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ విమర్శలు)
మరిప్పుడు రోజూ అప్పులేగా...!
ఇప్పుడు ఎఫ్ఆర్బీఎం పరిధి అన్న మాటకు అర్థమే లేకుండా చేశారు. ప్రతి సంవత్సరం ఈ చట్టాన్ని తమకు అనుగుణంగా సవరించుకుంటున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ అప్పులను కాగ్ తప్పు పడుతోంది. కేంద్రం కూడా ఏపీ ఆర్థిక వ్యవహారాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయంది. జగన్... కొత్తగా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి పేరిట రూ.వేల కోట్ల అప్పులు పుట్టిస్తున్నారు. వాటిని ప్రభుత్వ అప్పులుగా చూపరు. పైగా అవే అప్పులను తీర్చేందుకు రాష్ట్ర బడ్జెట్లో గ్రాంట్ల రూపంలో నిధులిస్తున్నారు. అంతెందుకు ప్రతినెలా రిజర్వు బ్యాంకు వద్ద విపరీతంగా చేబదుళ్లు తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకుని మరీ ఆయా అప్పులను తీరుస్తున్నారు. అప్పు లేకుండా రాష్ట్ర ఆర్థిక నావ నడవలేని దుస్థితికి తెచ్చారు.
2. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలి. అర్థవంతమైన చర్చలకు వీలు కల్పించాలంటే పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల తాజా సమాచారాన్ని వాటి వెబ్సైట్లలో ఉంచుతోంది. ప్రతినెలా పన్నులు, పన్నేతర రాబడులు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర రాబడులు, రాబడిలో లోటు, ద్రవ్యలోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం వంటి వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వమూ తన వెబ్సైట్లో ఉంచాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వమూ అకౌంటింగ్ వ్యవస్థను కంప్యూటరైజ్ చేసినందున అంశాల వారీగా ఆయా వివరాలను వెల్లడించేందుకు ఇబ్బందులు ఏమీ ఉండవని భావిస్తున్నా’’
(2014 డిసెంబరులో అప్పటి సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ రాసిన లేఖలో చేసిన డిమాండ్లు ఇవీ.)
పారదర్శకతకు పాతరేశారేం జగన్?
ప్రస్తుత జగన్ సర్కారులో అన్నీ రహస్యాలే. కార్పొరేషన్లకు ఎంత మొత్తం గ్యారంటీ ఇచ్చారు? ఎన్ని అప్పులు తెచ్చారనే విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. ఏ లెక్కల్లోనూ పారదర్శకత లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన లెక్కలను ప్రతినెలా కాగ్ పరిశీలించి తన వెబ్సైట్లో వెలువరిస్తుంటుంది. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత రుణం తెచ్చారు? ఎంత రుణం తీర్చారు. ఎంత రుణాన్ని వినియోగించారన్న వివరాలు తాము కోరినా... ఏపీ సర్కారు ఇవ్వడం లేదని కాగ్ ప్రతినెలా అంటున్నా వీరిలో చలనం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీల ద్వారా తెచ్చిన రుణాల వివరాలను సైతం కాగ్కు సమర్పిస్తున్నాయి. ఆయా వివరాలను కాగ్ తన వెబ్సైట్లో స్పష్టంగా పొందుపరుస్తోంది. ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా పారదర్శకతపై లేఖలు రాసిన జగన్ మరిప్పుడు ఎందుకా విషయాన్ని విస్మరిస్తున్నారు? తెదేపా ప్రభుత్వ హయాంలో సీఎం డ్యాష్బోర్డులో అన్ని ప్రభుత్వ శాఖల సమాచారమూ ప్రజలకు అందుబాటులో ఉండేది. ఆ సమాచారాన్ని నిత్యం నవీకరించేవారు. ఇప్పుడు జగన్ సర్కారులో అంతా రహస్యం. పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందో కూడా చెప్పాలని కాగ్ ప్రతినెలా అడుగుతోంది. ఆ లెక్కలనూ వెల్లడించడం లేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!