ఓటమి భయంతోనే వైకాపా దాడులు
పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి.
కదం తొక్కిన జర్నలిస్టులు గళం కలిపిన ప్రతిపక్షాలు
ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన
ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు
నేడు చలో కర్నూలు.. చలో అనంతపురం
ఈనాడు డిజిటల్, అమరావతి: పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ ఈ తరహా దాడులకు పురిగొల్పుతున్నారని విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డాయి. దాడులు ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. ఆందోళనల్లో తెదేపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీ, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ చలో కర్నూలు, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్పై దాడిని నిరసిస్తూ గురువారం చలో అనంతపురం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ వెల్లడించారు.
కార్యకర్తలను రెచ్చగొడుతున్న జగన్
గుంటూరులో ఏపీడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, తెదేపా నేతలు నక్కా ఆనంద్బాబు, కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహమ్మద్, డి.ప్రభాకర్ ఆందోళన నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. నక్కా ఆనంద్బాబు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ అకృత్యాలు బయటపెడుతుంటే తట్టుకోలేకనే వైకాపా కార్యకర్తలు మీడియాపై దాడులకు తెగబడుతున్నారు. నియంతృత్వ ధోరణితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘చొక్కాలు మడతపెట్టమంటూ సీఎం జగన్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు’ అని మండిపడ్డారు.
తాడేపల్లి ఆదేశాల మేరకే దాడులు
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ, జనసేన, తెదేపా, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ విగ్రహం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడులను జరుగుతున్నాయని మండిపడ్డారు. జిల్లా అదనపు ఎస్పీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.
కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి
తిరుపతిలో ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, గిరిజన విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులపై మాట్లాడేటప్పుడు కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే దాడులు
విజయనగరంలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గజపతినగరం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి కేఏ నాయుడు, భోగాపురం మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు, పాలకొండలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామమల్లిక నాయుడు, పలువురు ఆందోళనలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలవమనే భయంతోనే ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని తెదేపా నియోజకవర్గం ఇన్ఛార్జి అశోక్గజపతిరాజు విమర్శించారు. మీడియాని భయబ్రాంతులకు గురిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
దాడులు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఏపీయూడబ్యూజీ జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం నాయకులు ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జర్నలిస్టులపై దాడి చేసేవారిని శిక్షించాలి
- వైకాపా దాడిని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. రేపు సాక్షి జర్నలిస్టులకు కూడా ఇదే గతి పడుతుందని, అవినీతి సొమ్ముతో పుట్టిన ఆ పత్రిక నుంచి బయటపడాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులు, కార్యాలయాలపై దాడులు చేసే అల్లరి మూకను శిక్షించాలని ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ రంజనప్రకాష్ దేశాయ్కు సామాజిక కార్యకర్త అప్పన్న లేఖ రాశారు.
- ఒంగోలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై జేసీ గోపాలకృష్ణకు, ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందించారు. జిల్లాలోని తాల్లూరు, దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.
- ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులను ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఆరిఫ్, శివన్నారాయణ ఖండించారు. ఈ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ కాకినాడ జిల్లాలోని అంబాజీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందించారు. నిందితులను శిక్షించాలని కోరుతూ అనపర్తి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారును కలిసి వినతిపత్రం అందజేశారు.
- అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో తెదేపా నాయకులు అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ధర్నా నిర్వహించారు. ఆగలి తహసీల్దార్ కార్యాలయంలో మండల విలేకరుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
- వైకాపా దాడులను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు ఆక్షేపించాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా దాడులు చేస్తున్నారని తెదేపా కావలి నియోజకవర్గ బాధ్యులు కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని సైదాపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి పాత్రికేయులు నిరసన తెలిపారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
పత్రికా కార్యాలయాలు, విలేకరులపై దాడులు సరికావని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇలాంటి దాడులు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.
దాడి అమానుషం
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్
విజయవాడ (గాంధీనగర్), న్యూస్టుడే: పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడి.. పత్రికా స్వేచ్ఛను హరించాలనే ఆలోచనలో ఉన్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ.. నిజాలు రాసే ‘ఈనాడు’పై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ప్రభుత్వ వైఫల్యాలపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే అక్కసుతో దాడులకు తెగబడడం సరికాదన్నారు. యూనియన్ సీనియర్ నాయకుడు ఎస్.కె.బాబు, యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి.నాగరాజు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.