ఇది జగన్ మార్కు రూల్
రాష్ట్రంలో పాలనకు ఎలాంటి నిబంధనలూ లేవు.. ఏ పద్ధతులూ అక్కర్లేదు. అవసరమైతే ఒకే ఒక్క సంతకంతో ఏ రూలు, ఏ ఉత్తర్వులకైనా మినహాయింపు ఇచ్చేస్తారు.
ఈఈ.., ఎస్ఈ.. చీఫ్ ఇంజినీరూ ఆయనే
జూనియర్ ఈఈకి ఎస్ఈగా పదోన్నతి
పెద్దిరెడ్డి సిఫార్సు.. సీఎంవో ఆదేశాలు
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పాలనకు ఎలాంటి నిబంధనలూ లేవు.. ఏ పద్ధతులూ అక్కర్లేదు. అవసరమైతే ఒకే ఒక్క సంతకంతో ఏ రూలు, ఏ ఉత్తర్వులకైనా మినహాయింపు ఇచ్చేస్తారు. వాళ్లు ఏమనుకుంటారో అది చేసేస్తారు. అంతా మా ఇష్టం. మా రాజ్యం అంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. సీఎంవో ఏం చెబితే అదే నిర్ణయం. అందుకు అనుగుణంగా అయ్యా..ఎస్.. అంటూ ఉత్తర్వులు వెలువడిపోతున్నాయి. తాజాగా జలవనరులశాఖలో చోటు చేసుకున్న పరిణామం ఉద్యోగలోకాన్ని విస్తుపోయేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలోని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మల్లికార్జునరెడ్డి పని చేస్తున్నారు. ఆ కేడర్లో ఆయన కన్నా సీనియర్లు ఎందరో ఉన్నారు. కానీ ఈయన ఎస్ఈ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా గాలేరు నగరి సుజల స్రవంతి చీఫ్ ఇంజినీరు పదవీ విరమణ చేయగా, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు సూపరింటెండెంట్ ఇంజినీరుగా అడ్హాక్ పదోన్నతి కల్పించారు. అంతేకాదు- నేరుగా చీఫ్ ఇంజినీరు పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. అక్కడ ఆయన ఈఈ, ఎస్ఈ పోస్టులో అడ్హాక్ పదోన్నతి. ఆపైన చీఫ్ ఇంజినీరుగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు. ఒక పులివెందుల అధికారి సాధించిన అక్రమ పోస్టింగ్ ఇది. ఇది అలా ఇలా సాధించింది కాదు- సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్రెడ్డి నేరుగా సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు లేఖలపై ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్రెడ్డి సైతం సిఫార్సు చేసి జలవనరులశాఖలో ఫైలు తయారు చేయించి ఆఘమేఘాలపై కదిలించారు. ఆ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కన్నా రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సీనియర్లుగా ఉన్నారు. వాస్తవానికి వారందరికీ పదోన్నతులు ఇస్తే తప్ప ఈ మల్లికార్జున్రెడ్డికి పదోన్నతి పొందే అవకాశమే లేదు. పులివెందుల మార్కు రూలు పాలిస్తుండటంతో మొత్తం ఉద్యోగలోకమే విస్తుపోయే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన పైన ఉన్న సీనియర్లు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరైనా తప్పు చేస్తే పై వాళ్లకు చెబుతుంటాం. నేరుగా పై వాళ్లే తప్పు చేస్తే ఎవరికి చెబుతాం అని ఆవేదన చెందుతున్నారు.
నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ
జలవనరులశాఖలో ఎప్పటి నుంచో పదోన్నతుల వివాదం సాగుతోంది. జోనల్ వ్యవస్థను పక్కన పెట్టి వర్టికల్ సీనియారిటీ పద్ధతిలో పదోన్నతుల జాబితా ఖరారు చేసి గతంలో 2017లోనే పదోన్నతులు కల్పించారు. ఇలా జోనల్ వ్యవస్థను పక్కన పెట్టి పదోన్నతులు కల్పించడం రాజ్యాంగం విరుద్ధం అంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మరో వ్యవహారంలో ఏపీపీఎస్సీ సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ అన్ని అంశాల్లోను ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో వివాదాలు సాగుతుండటంతో పదోన్నతుల ప్రక్రియ ఎప్పటి నుంచో సందిగ్ధావస్థలో ఉంది. డీఈఈ పోస్టు నుంచి చీఫ్ ఇంజినీరు పోస్టు వరకు రెగ్యులర్ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పోస్టుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల పేరుతో పోస్టింగులు ఇస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటా సాధారణ బదిలీల సమయంలో ఇలా అదనపు బాధ్యతల కోసం పైరవీలు సాగుతున్నాయి. తాజాగా ఈ జనవరిలో కొత్తగా పదవీ విరమణలు ప్రారంభం కావడంతో పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. జనవరి 31న చాలామంది పదవీ విరమణ చేశారు. నిజానికి జనవరి 31న చీఫ్ ఇంజినీరు పోస్టులో పదవీ విరమణ చేసిన వెంటనే పూర్తి అదనపు బాధ్యతలతో కొత్త అధికారిని నియమించాల్సి ఉంది. కేవలం పులివెందుల ఈఈకి రాజకీయంగా అండదండలు ఉండటంతో ఆ వ్యవహారం పెండింగ్లో పడింది.
తొమ్మిదిమందిని తప్పించి..
ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందిన ఈఈ కన్నా ముందు జోన్ 4లో ఆరుగురు, జోన్ 1లో ముగ్గురు ఈఈలు ఉన్నారు. పదోన్నతులు ఇవ్వాలంటే తొలుత ఆ తొమ్మిది మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత ఈఈ మల్లికార్జునరెడ్డి పదోన్నతికి అర్హులవుతారు. జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, ముఖ్య కార్యదర్శి సైతం తమ ఫైలులో ఈ అంశాలు పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన పైన ఉన్న 9 మందికి పదోన్నతులు కల్పించాలని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 35 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని కూడా లెక్క తేల్చారు. నిజానికి సాధారణంగా పదోన్నతుల అంశం ముఖ్యమంత్రి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవహారంలో నేరుగా సీఎంవో నుంచి ఒత్తిడి ఉండటంతో సంబంధిత ఫైలు అక్కడికి చేరింది. ఎగువన ఉన్న అందరి పేర్లు కొట్టేసి పులివెందుల ఈఈ మల్లికార్జునరెడ్డికి పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిసింది.
అడ్హాక్ పద్ధతిలో..
ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఈఈ మల్లికార్జునరెడ్డికి అడ్హాక్ పదోన్నతి కల్పించారు. ఆయన కన్నా సీనియర్లు కూడా ఉన్నతాధికారులను కలిసి తమకు కూడా అడ్హాక్ పదోన్నతులు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఎలాగూ తమలో చాలామంది ఆగస్టు లోపు పదవీ విరమణ చేసేవారమేనని, ఆ ఎస్ఈ పోస్టులు మళ్లీ కావాలనుకున్న వారికి ఇచ్చుకోవచ్చని- అంతవరకు తమకు కూడా అడ్హాక్ పదోన్నతులు కల్పిస్తే ఎస్ఈలుగా పదవీ విరమణ చేస్తామని, ఆ ప్రయోజనాలు పొందుతామని వారు అడుగుతున్నారు. తమకు చీఫ్ ఇంజినీరు పోస్టులు అవసరం లేదని కూడా విన్నవిస్తున్నారు.
నాడు పంచాయతీరాజ్లో...
ఇప్పుడే కాదు- గతంలో పంచాయతీరాజ్శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్టు పోస్టులోను ఇదే తరహా వ్యవహారం సాగింది. సీనియారిటీ ప్రకారం అర్హత కలిగిన వారిని పక్కన పెట్టి ఆ జాబితాలో అయిదో స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి కూర్చోబెట్టారు. అప్పట్లో చీఫ్ ఇంజినీరుగా పదవీ విరమణ చేసిన బి.సుబ్బారెడ్డికే పదవీ కాలాన్ని రెండు విడతలుగా వైకాపా సర్కార్ పొడిగించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఈఎన్సీ పోస్టు అప్పగించారు. ఫలితంగా ఆయన కన్నా సీనియర్లు అయిన ఎస్సీ, ఎస్టీ చీఫ్ ఇంజినీర్లు నష్టపోయారు. బి.సుబ్బారెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాత సీనియర్గా ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన బాలూ నాయక్కు ఈఎన్సీ పోస్టు దక్కాల్సి ఉంది. ఆయనను కాదని ఆయన కన్నా జూనియర్గా అయిదో స్థానంలో ఉన్న సి.వి.సుబ్బారెడ్డిని ఆ పోస్టులో నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి చివరికి బాలూ నాయక్ను నియమించింది. ప్రస్తుతం జలవనరులశాఖ చీఫ్ ఇంజినీరు నియామక ప్రక్రియ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సీనియారిటీ ఉన్న ఈఈలకు అడ్హాక్ ఎస్ఈలుగా పదోన్నతులు కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. -
ఇలాంటివి మీ ఇంట్లో తింటారా టీచర్!
తిరుపతి జిల్లాలోని బీఎన్కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల వంట గదిలో కుళ్లిన క్యాబేజీ, అరటిపండ్లు కనిపించాయి. శుక్రవారం మండలస్థాయి అధికారులు తనిఖీ చేసి అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. -
సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)