హైస్కూల్ ప్లస్.. ఆదరణ మైనస్..!
రాష్ట్రంలో ‘హైస్కూల్ ప్లస్’ అంటూ చేపట్టిన ప్రయోగం మిథ్యగా మారింది. సీబీఎస్ఈ తరహాలో బాలికల కోసం పాఠశాలల్లోనే ప్రత్యేకంగా ప్రారంభించిన ఇంటర్ విద్యను వైకాపా సర్కారు గాలికి వదిలేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు ‘సున్నా’
బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో జగన్ సర్కారు ఫెయిల్
ప్రయోగశాలలు లేక పది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి
కొత్త నియామకాల్లేక స్కూల్ అసిస్టెంట్లతోనే పాఠాలు
గతేడాది ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 88 శాతం అనుత్తీర్ణత
‘ఆరంభ శూరత్వం’..
ఈ పదం జగన్ సర్కారుకు సరిగ్గా నప్పుతుంది.
ఎందుకూ అంటే..
‘హైస్కూల్ ప్లస్’ అన్నారు..
వాటిల్లో బాలికలకే ఇంటర్ ప్రవేశాలన్నారు..
ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు..
బోధకులు లేరు.. సౌకర్యాలను పట్టించుకోరు..
ఇంకేముంది.. ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది.. ప్రవేశాలూ తగ్గిపోయాయి..
ఉన్నవాటిని వదిలేసి.. కొత్త రాగం తీసి..
పేద పిల్లల జీవితాలతో ఆటలెందుకు జగన్?
రాష్ట్రంలో ‘హైస్కూల్ ప్లస్’ అంటూ చేపట్టిన ప్రయోగం మిథ్యగా మారింది. సీబీఎస్ఈ తరహాలో బాలికల కోసం పాఠశాలల్లోనే ప్రత్యేకంగా ప్రారంభించిన ఇంటర్ విద్యను వైకాపా సర్కారు గాలికి వదిలేసింది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగానే భావిస్తానని గొప్పలు చెప్పే సీఎం జగన్.. ఆయా విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించడంలోనూ విఫలమయ్యారు. పేదలకు అన్నీ తానే అన్నట్లు చెప్పుకొంటూ.. రూపుమార్చుకున్న అంటరానితనమంటూ.. ఆయన చేసిందేమైనా ఉందా అంటే ఏమీ లేదు. హైస్కూల్ ప్లస్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ చదువులో బాలికలు ప్రాక్టికల్స్ చేసేందుకు కనీసం ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేయలేదు. పాఠాలు చెప్పేందుకు గతేడాది లెక్చరర్లకే దిక్కు లేదు. ఉచిత పాఠ్యపుస్తకాల పథకాన్ని ఎత్తివేశారు. ఇవన్నీ రూపుమార్చుకున్న అంటరానితనం కాదా? ఒక్కమాటలో చెప్పాలంటే.. హైస్కూల్ ప్లస్ బాలికల ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం ఫెయిలైంది. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలిచ్చి.. ఆ తర్వాత వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.
గతేడాది 12 శాతమే ఉత్తీర్ణత
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో బాలికల జూనియర్ కళాశాలంటూ 292 పాఠశాలల్లో ‘హైస్కూల్ ప్లస్’ పేరిట ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించినా.. పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను మాత్రం నియమించలేదు. పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులతోనే స్థానికంగా పాఠాలు చెప్పించాలని ఆదేశించారు. 2022 జూన్లో తరగతులు ప్రారంభమైతే.. 2023 జనవరిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. కొన్నిచోట్ల పాత పుస్తకాలనే సర్దుబాటు చేశారు. పేద బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస సదుపాయాలూ లేవు. ప్రత్యేకంగా తరగతి గదులు లేకపోవడంతో హైస్కూల్లోని కొన్ని గదులనే దీనికోసం సర్దుబాటు చేశారు. గతేడాది 292చోట్ల ఇంటర్మీడియట్ ప్రారంభిస్తే.. 115 చోట్ల ఒక్కరూ చేరలేదు. మిగతా వాటిల్లోనూ సరాసరిగా 12మంది చొప్పున మాత్రమే ప్రవేశాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,054 మంది మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాస్తే, 366మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే కేవలం 12శాతం. రెండో సంవత్సరం చదువుతున్న వారికి ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. సమీపంలోని బడులు, జూనియర్ కళాశాలల్లో ఉన్నవాటినే వినియోగించుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చి వదిలేశారు. దీంతో చాలాచోట్ల అసలు ప్రయోగాలే జరగలేదు. కొన్నిచోట్ల 10 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ బోధన కోసం ఈ ఏడాది 1,752 మంది అధ్యాపకులను నియమించారు. వారికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా.. విడుదల చేయలేదు.
ఈ ఏడాదీ అదే దుస్థితి..
ఈ విద్యా సంవత్సరంలోనూ 44 చోట్ల ఒక్కరూ చేరలేదు. మొత్తం అన్ని కళాశాలల్లో కలిపి 4,935 మంది మాత్రమే ప్రవేశం పొందారు. అంటే.. సగటున ఒక్కో కళాశాలలో చేరింది 17 మందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి చూస్తే సగటున 27మంది చొప్పున ఉన్నారు. 20లోపు అమ్మాయిలు ఉన్న హైస్కూల్ ప్లస్లు 84వరకు ఉన్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు వీటిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. రెగ్యులర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు తగ్గిపోతుండటం సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది.
ఒకవైపు బాలికల కళాశాలల్లోనే ప్రవేశాలు లేవంటే, వచ్చే ఏడాది నుంచి మండలానికి ఒక కో-ఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు కళాశాలల ఏర్పాటు గురించి ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖలు కూడా రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 206 మండలాల్లో కో-ఎడ్యుకేషన్ కళాశాలలు లేనట్లు గుర్తించిన అధికారులు.. వచ్చే ఏడాది ఏర్పాటుకు హడావుడి చేస్తున్నారు. సదుపాయాలు కల్పించకుండా ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించడం.. ఆ తర్వాత విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేయడం ఈ ప్రభుత్వానికి సర్వసాధారణమైంది.
రెగ్యులర్ అధ్యాపకులే కరవు..
జూనియర్ కళాశాలల ఏర్పాటుకు హడావుడి చేస్తున్న ప్రభుత్వం వీటిలో బోధించేందుకు రెగ్యులర్ అధ్యాపకులను మాత్రం నియమించడం లేదు. హైస్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించింది. రెగ్యులర్ లెక్చరర్లుగా క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలానికో కో-ఎడ్యుకేషన్ కళాశాలలకూ స్కూల్ అసిస్టెంట్లనే నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెగ్యులర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 84 చోట్ల అధ్యాపక పోస్టులే లేవు. కాంట్రాక్టు వారితో బోధిస్తున్నారు. ఈ పోస్టులు మంజూరు చేయాలని ఎన్ని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం స్పందించడం లేదు. విద్యపై రూ.70వేల కోట్లు ఖర్చు చేశామని, విద్యార్థులను ప్రపంచ స్థాయిలో తీర్చుదిద్దుతున్నామని గొప్పలు చెబుతున్న జగన్ చేస్తున్న ఘనకార్యాలివీ.
మండలానికో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలుంటే, అందులో ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్చాలి.
2022లో సమీక్ష సమావేశంలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం