మళ్లీ జగన్ గెలిస్తే జనాలను బతకనిస్తారా!?
అఫ్గానిస్థాన్లోని తాలిబాన్లను మించిన అరాచకం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ను మించిన నియంతగా సీఎం జగన్ మారారు. ప్రతిపక్షాలు గళం ఎత్తకూడదు.
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
పుతిన్, కిమ్లను మించిపోతున్నజగన్
‘ఈటీవీ - ప్రతిధ్వని’ చర్చలో వక్తల అభిప్రాయం
అఫ్గానిస్థాన్లోని తాలిబాన్లను మించిన అరాచకం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ను మించిన నియంతగా సీఎం జగన్ మారారు. ప్రతిపక్షాలు గళం ఎత్తకూడదు. మీడియా కలం చూపకూడదు. ప్రజలు నోరు తెరవకూడదు. కోర్టులు, ఎన్నికల సంఘం ప్రశ్నించడాన్ని సహించరు. ఎవరన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే భరించరు. భౌతికదాడులు చేయడానికి వైకాపా మూకలు ఆయుధాలతో నడిరోడ్డుపై స్వైరవిహారం చేస్తాయి. అనుచరగణాలు కబ్జాలు చేస్తాయి. ప్రభుత్వ చెప్పుచేతల్లోని విచారణ సంస్థలు పనిచేస్తాయి. గిట్టనివారి వ్యాపారాలపై దాడులు చేస్తాయి. ‘మళ్లీ గెలిస్తే జనాల్ని బతకనిస్తారా?’ అనే అంశంపై బుధవారం ‘ఈటీవీ- ప్రతిధ్వని’ చర్చ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.
గతంలో లేని రాజకీయ సంస్కృతి
- కందుల రమేష్, సీనియర్ పాత్రికేయుడు
ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత అసమ్మతి స్వరాలు వినిపించకూడదనే కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయని, తాను చెప్పిందే జరగాలని, చేసిందే విధానం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం ప్రారంభించారు. ఎవరైనా వ్యతిరేక స్వరం వినిపిస్తే జైలే గతి. భౌతికదాడుల నుంచి తప్పించుకోలేరనే భయానక వాతావరణం రాష్ట్రమంతటా వ్యాప్తి చేశారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఆధారాలున్నా వారిపై నేటికీ చర్యలు లేవు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు వెళ్లి తలుపులు పగలకొట్టేందుకు నాయకత్వం వహించిన ఎమ్మెల్యేకు నజరానాగా మంత్రి పదవిని కట్టబెట్టారు. డజన్ల కొద్దీ కేసులు, ఏడాదిన్నర జైలులో ఉన్న జగన్మోహన్రెడ్డి తన ప్రవృత్తికి తగ్గట్లుగానే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘చంద్రబాబును కాల్చి చంపాలి’.. ‘నడిరోడ్డుపై ఉరి తీయాలి’ అంటూ హింసను ప్రేరేపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభిమానులకు బీపీ వచ్చి దాడులు చేశారంటూ రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సరికాదు. జగన్ ప్రభుత్వంలో విచిత్రాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు అనేకం చూస్తున్నాం. సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైకాపా ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయటానికి కర్నూలు వచ్చిన సీబీఐ ఆ పని చేయలేకపోయింది. దేశ చరిత్రలో సీబీఐకి అలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. జగన్ అండతో పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైంది. ప్రజల ఓట్లతో అపరిమితమైన అధికారాన్ని జగన్కు కల్పించారు.
మళ్లీ వస్తే నియంతృత్వమే..
తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాననేది ఇప్పటికే జగన్ ప్రజలకు రుచి చూపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి నియంతృత్వంలో కొత్త పోకడలు, మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారు. తమది హింసా ప్రవృత్తి, మాఫియా మనస్తత్వం, రక్తపిపాసి భావన అని చాటుతారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించకపోవడం వల్లే జగన్ స్వేచ్ఛగా పాదయాత్ర చేశారు. అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఎవరు విమర్శించినా వ్యక్తిగతంగా దాడులు చేయిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, సంప్రదాయాలను గౌరవించాయి. వాటికి జగన్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలను నాశనం చేయాలి, ఇష్టంలేని శక్తులను, వర్గాలను అణచివేయాలి, ఇందుకు అధికారాన్ని తీవ్రంగా ఉపయోగించుకోవాలి అనే కొత్త ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలను జగన్ పాలన నేర్పిస్తోంది. ప్రభుత్వం మారితే వైకాపా నేతల అరాచకాలపై కేసులు నమోదు చేస్తే వారంతా తీవ్రమైన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. మరోసారి జగన్కు ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల ద్వారా విజయం సాధించి నియంతగా వ్యవహరించడం ఎలా? అనే విషయంలో సీఎం పీహెచ్డీ పొందినట్లే అనుకోవాలి. పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు ఉన్న పోలీసు కంప్లయింట్ అథారిటీ నిర్వీర్యమైంది. అంతా కోర్టుల మీద ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమోదవుతున్న వందల సంఖ్యలో కేసుల్లో చాలావాటికి కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ న్యాయస్థానాల ఆదేశాలను సైతం అమలు చేయడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ అరాచకం ముందు ప్రజలు విలవిలలాడిపోతారు. ప్రతిపక్షాలను రాచి రంపాన పెడతారు. గతంలో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించి, మరుగున పడుతోందనుకున్న ఫ్యాక్షన్ సంస్కృతి రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుంది. సమీప భవిష్యత్తులో ప్రజలు తేరుకునే అవకాశం ఉండదు.
తాలిబాన్లు సైతం దిగదుడుపు
- ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు
విచారణ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్షాలు, సంస్థలపై దాడులు చేయడం నిలువునా నియంత పాలనకు నిదర్శనం. దాడులకు పాల్పడిన వారి దృశ్యాలు, చిత్రాలు బయటికొచ్చినా బాధ్యులను అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థలకు చట్టాలు గుర్తుకురావడంలేదు. అల్లరిమూకలకు అధికార పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై దేశద్రోహం కేసులు కూడా పెడుతున్నారు. తాలిబ్లను సైతం జగన్ ముందు దిగదుడుపే. ఎవరైనా విమర్శిస్తే తమ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు తిరగబడతారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. సాధారణంగా ఏ నాయకుడైనా సంయమనం పాటించాలని హితవు పలుకుతారు. జగన్ మాటలు హింసను, ఉద్రిక్తతలను ప్రోత్సహించేలా ఉంటున్నాయి. ప్రతిపక్ష నేతగా అదే ధోరణి. ఇప్పటికీ ఆ భావనలో మార్పు లేదు. అనంతపురం తర్వాత వరుసగా రెండు సంఘటనలు జరిగాయి. సీఎం, వైకాపా నేతలు ఆలోచన ధోరణిలో ఫ్యాక్షన్ భావజాలమే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయలేకపోతోంది. వాటిని నిర్వీర్యం చేశారు. ఫ్యాక్షన్ పోకడలు, ముద్దాయి ఆలోచనలు, సంస్కృతిని జగన్ కొనసాగిస్తున్నారు. కంచే చేను మేసినట్లుగా.. చట్టాలను రక్షించాల్సిన వారే ఆ పని తమది కాదన్నట్లుగా పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా, పార్టీ కార్యకర్తల్లా మారిపోయారు. బాధితులకు బదులు పోలీసులే ఫిర్యాదులు చేసి మరీ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి వేళ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ద్వారా రాజకీయంగా వారిని అణగదొక్కాలని చూస్తున్నారు.
అధికారులూ అదే బాటలో..
హిట్లర్ కూడా ముఖ్యమంత్రి ఎదుట దిగదుడుపే. పాలకులతోపాటు అధికారులు కూడా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. ‘ఈనాడు’కు ఆర్థిక ఇబ్బందులు కలిగించాలనే మార్గదర్శి సంస్థపై దాడులు చేశారు. న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించి మరీ బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేశారు. పత్రికా స్వేచ్ఛ ఉండాలని అంతా ఆకాంక్షిస్తుంటే- అలాంటి వ్యవస్థపై దాడులు చేసేలా అధికార పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. గత ఎన్నికల్లో గంపగుత్తుగా దళితులు జగన్కు ఓట్లేశారు. దానికి ప్రతిఫలంగా డాక్టరు సుధాకర్ నుంచి సుబ్రమణ్యం వరకు దళితులపై దాడులు, హత్యలు చేశారు. ఇసుక మాఫియాను దళితులు అడ్డుకుంటే వారిపై కేసులు పెడుతున్నారు. సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేశారు. రాష్ట్రపతికి లేఖ రాసి నక్సలైట్లలో కలిసిపోతానన్నా అతనికి దిక్కులేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు వస్తే ఆయనకు బెయిల్ ఇప్పించడమే కాకుండా ఊరేగింపులు జరిపించారు.
అయ్యా.. ఎస్
ఐఏఎస్ అధికారులు పలువురు అయ్యా..ఎస్ అంటుంటే.. ఐపీఎస్ అధికారులు కొందరు నీ బాంచన్ దొర అంటూ మొక్కుతున్నారు. మా ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు కదా అనే అపోహతో వైకాపాకు ఓటు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేం. రాష్ట్రం అప్పుల ఆంధ్రాగా మారింది. ఉద్యోగాలు లేవు. పనులు చేద్దామన్నా అవకాశం లేదు. కొత్త పరిశ్రమలు రావడంలేదు. స్వయం ఉపాధి చేసుకోవాలన్నా అవకాశాలు లేవు. నియంత పాలన కొనసాగితే ప్రజల ఆస్తులను అప్పనంగా ఆక్రమించుకుంటారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేస్తారు. రాజ్యహింసకు అడ్డు లేకుండాపోతుంది. మేధావులు, పారిశ్రామికవేత్తలు వంటి వారు వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది.
ఈటీవీ, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్