‘వేదన’ జీవి!
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు జగన్ అనేక హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారిని ఎన్ని రకాలుగా వేధించాలో అంతా చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ను పునరుద్ధరిస్తానని చెప్పి మరచిపోయారు.
పేరుకేమో గొప్ప కొలువులు.. పెదవి విప్పితే అన్నీ తిప్పలు
ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జగన్ సర్కారు చెలగాటం
సీపీఎస్ డబ్బునూ వాడేసుకున్న దౌర్భాగ్యం
రూ.21 వేల కోట్ల బకాయిలు పెండింగ్
జీతాలు ఎప్పుడొస్తాయోనని ప్రతి నెలా ఎదురుచూపులే
ఐదేళ్లలో ఒక్క డీఏ బకాయీ రాలేదు
కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి
ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి.
2022, నవంబరు 27న మంత్రి బొత్స
ప్రభుత్వ ఉద్యోగం అంటే..
ఒకప్పుడు.. గంట కొట్టినట్టుగా ఒకటో తేదీన వేతనం.. పీఎఫ్, జీపీఎఫ్, డీఏ తదితర సదుపాయాలు.. పిలిచి మరీ రుణాలిచ్చే బ్యాంకులు.. సకాలంలో పదవీ విరమణ ప్రయోజనాలు.. లెక్క తప్పకుండా వచ్చే పింఛను.. డీఏ చెల్లించాలని, ధరలకు అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరే స్వేచ్ఛ..
ఇప్పుడు జగన్ పాలనలో..
ఎప్పుడొస్తుందో తెలియని వేతనం.. పీఎఫ్, జీపీఎఫ్, ఆర్జిత సెలవు బిల్లుల ఊసే లేదు. పెండింగ్లో డీఏలు, పీఆర్సీ బకాయిలు.. సకాలంలో అందని పదవీ విరమణ ప్రయోజనాలు.. పింఛను కోసం నెలల తరబడి నిరీక్షణ.. ఏదైనా అడగాలంటేనే భయం. వెరసి.. వేతన జీవులు... వేదన జీవులుగా మారిన దుస్థితి!
హడావుడిగా బస్సు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడి పర్సును ఎవరో కొట్టేస్తారు. టికెట్ తీసుకునేందుకు జేబులో వెతగ్గా.. పర్సు కనిపించలేదు. పర్సు, అందులోని వెయ్యి రూపాయలు పోయాయని బాధపడుతూ.. విషయాన్ని కండక్టర్కు చెప్తారు. తనను గమ్యస్థానం చేర్చాలని, అక్కడికి వెళ్లాక ఛార్జీ మొత్తాన్ని చెల్లిస్తానని వేడుకుంటారు. కుదరదంటాడు కండక్టర్. అంతలో ఓ పెద్దాయన లేచి.. ‘ఇదిగో ఆ వ్యక్తి ఊరెళ్లడానికయ్యే ఛార్జీ’ అంటూ కండక్టర్కు రూ.200 ఇస్తాడు. దానికి ఉప్పొంగిన ప్రయాణికుడు.. ‘బాబూ! మీరు మహానుభావులు’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తారు. దానికి ఆ పెద్దాయన.. ‘ఏం పర్వాలేదు. ఇదిగో దారిలో తిండి, ఖర్చులకు పనికొస్తాయి’ అంటూ మరో రూ.100ను చేతిలో పెడతాడు. ఉబ్బితబ్బిబ్బయిన ప్రయాణికుడు... పెద్దాయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే పర్సు కొట్టేసింది ఆ పెద్దాయనే!!
- ఈ కథలోని పెద్దాయనలాగే ఉంది వేతన జీవుల విషయంలో జగన్ తీరు. మొదట ఉద్యోగుల ప్రయోజనాల్లో కోత వేస్తారు. ‘అయ్యో.. అదనపు ప్రయోజనాల సంగతి తర్వాత.. అసలు వచ్చే వాటికే కోత పెడితే ఎలా?’ అంటూ వారు ఆందోళన చెందే పరిస్థితి కల్పిస్తారు. ఆ కోత పెట్టిన వాటిల్లోంచే కొంత తిరిగి ఇచ్చి.. ఉద్యోగులను తామే ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకొంటారు. ఉద్యోగ సంఘాల నేతలతోనే భజన చేయించుకుంటారు. 11వ పీఆర్సీలో మొదట ఇంటి అద్దె భత్యం, అదనపు క్వాంటం పింఛనులో కోత విధించారు. తర్వాత హెచ్ఆర్ఏ పెంపు కాదు కదా.. ఉన్నదాన్నే ఇవ్వాలంటూ ఉద్యోగులు కోరే స్థితికి జగన్ తీసుకురావడం గమనార్హం.
ఈనాడు, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు జగన్ అనేక హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారిని ఎన్ని రకాలుగా వేధించాలో అంతా చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ను పునరుద్ధరిస్తానని చెప్పి మరచిపోయారు. ఈ ఐదేళ్లలో ఒక్క డీఏ బకాయినీ విడుదల చేయలేదు. నెల జీతాలు, పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. విశ్రాంత ఉద్యోగుల పింఛనుదీ అదే పరిస్థితి. జీపీఎఫ్, పీఎఫ్ డబ్బుల కోసం పెట్టే బిల్లుల మంజూరుకూ దిక్కు లేదు. ఉద్యోగుల సొమ్మును సర్కారు వాడేసుకోవడంతో.. అవసరాలకు వారు అవస్థలు పడాల్సి వచ్చింది. సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన డబ్బును.. గత ఏప్రిల్ నుంచి సంబంధిత ఖాతాల్లో జమ చేయడం లేదు. సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలని ఆయా సంఘాలు పిలుపునిస్తే.. పోలీసులతో అణచివేస్తూ వైకాపా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.
డీఏల మాటేంటి?
ఒక్కో ఉద్యోగికి జగన్ సర్కారు సరాసరిన రూ.రెండున్నర లక్షలకుపైగా బకాయి పడింది. 2023కు సంబంధించిన జనవరి, జులై డీఏలను మంజూరు చేయలేదు. 2022 జులైలో మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకు ప్రయోజనాలు అందలేదు.
- 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించిన 66 నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపి ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను మినహాయించేశారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, చెల్లించలేమంటూ 2020 జనవరి, జులై, 2021 జనవరికి రావాల్సిన మూడు డీఏలను ఎగ్గొట్టింది.
- 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి.. జీతాలు భారీగా పెరిగినట్లు చూపింది. కానీ.. వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇవ్వలేదు.
- 2022లో ఇవ్వాల్సిన జనవరి, జులై డీఏల బకాయిలు రూ.4,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జులైలో ఇచ్చిన డీఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు.
- 2023లో రెండు డీఏలు రావాల్సి ఉంది. వీటిని ఎప్పుడు ప్రకటిస్తుందో చెప్పడం లేదు.
- సీపీఎస్, పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు ఉన్నాయి.
సీపీఎస్ ఉద్యోగులను ముంచేశారు..
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు పాత పింఛనును అమలు చేస్తామన్న జగన్ ఆ హామీని తుంగలో తొక్కేశారు. ఉద్యోగులు వద్దంటున్నా గ్యారెంటీడ్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. సీపీఎస్ ఉద్యోగుల జీతం నుంచి ప్రభుత్వం 10శాతం మినహాయించి.. దానికి తాను మరో 10 శాతం కలిపి ఉద్యోగి ప్రాన్ ఖాతాలో వేస్తోంది. గత ఏప్రిల్ నుంచి ఆ నిధులను జమ చేయకపోగా, ఉద్యోగుల వేతనాల నుంచి తీసుకున్న 10 శాతాన్నీ వాడేసుకుంటోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటా కలిపి రూ.2,800కోట్లను ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 10% నుంచి 14%కు పెంచాలన్న కేంద్రం ఆదేశాలను అమలు చేయడం లేదు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను 90 శాతం నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఈ మొత్తంపై వడ్డీ, ఇతర ప్రయోజనాలను కోల్పోతున్నారు.
2004, సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. దీనికి ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సుమారు 10 వేల మంది సెప్టెంబరు తర్వాత ఉద్యోగాల్లో చేరారు. వీరికి పాత పింఛనును అమలు చేయాలన్న కేంద్రం సూచనలనూ రాష్ట్రం బేఖాతరు చేస్తోంది.
పదవీ విరమణ చేసినా..
రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలుగా ఇవ్వాల్సినవే రూ.200కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ గడువు డిసెంబరుతో ముగిసింది. దీంతో పాత వాటికే దిక్కులేకపోగా, ఇప్పుడు కొత్తగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
‘సమాన పనికి సమాన వేతనం’ ప్రాతిపదికన పొరుగుసేవల వారికి న్యాయం చేస్తానని 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక జీతం పెంచాలని కోరితే.. ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగిస్తున్నారు.
విభజించి.. నోళ్లు మూయించి..
పోలీసు నిర్బంధాలను అధిగమించి 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు వేల మంది తరలివచ్చి ‘చలో విజయవాడ’ను నిర్వహించారు. ఈ ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వం కాస్త దిగొచ్చి.. పీఆర్సీ చర్చల్లో కొంత ప్రయోజనాలు కల్పించినా, ఉద్యోగులకు చివరికి అన్యాయమే జరిగింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చి విభజించు.. పాలించు సూత్రాన్ని జగన్ సర్కారు ఆచరిస్తోంది.
వేల కోట్ల బకాయిలు
ఉద్యోగులకు ప్రభుత్వం ఏపీజీఎల్ఐ రుణాలు, జీపీఎఫ్, పీఎఫ్ బిల్లులు, అడ్వాన్సులు, పీఆర్సీ, ఈఎల్, డీఏ బకాయిలు తదితరాలన్నీ కలిపి రూ.21 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆయా సమస్యల విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భాల్లో ఎంతోకొంత ఇస్తామని ఊరడించడం, తర్వాత పట్టించుకోకపోవడం జగన్ సర్కారుకు పరిపాటిగా మారింది. ఒక అడుగు ముందుకేసి.. రాబోయేది మళ్లీ తామేనని, అప్పుడు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతోంది. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలవుల పెండింగ్ బకాయిలు రెండు విడతల్లో గతేడాది సెప్టెంబరులోపు చెల్లిస్తామని మంత్రుల కమిటీ హామీనిచ్చినా.. ఇంతవరకు అందలేదు.
- పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయి. వీటిని 2027లోగా చెల్లిస్తామని సర్కారు చెబుతోంది. కానీ, ఇంతవరకు దీనికి సంబంధించి జీఓనే ఇవ్వలేదు. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఇస్తామన్న 10 శాతానికీ అతీగతీ లేదు. పదవీ విరమణ చేసిన వారికి, కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటి విషయంలోనూ మాయ చేస్తోంది.
- ఉద్యోగుల టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్లు ఉన్నాయి. ఏపీజీఎల్ఐ బిల్లులు రూ.313కోట్లు ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బిల్లులను అప్లోడ్ చేసే యాప్ను సైతం ప్రభుత్వం ఆపేసింది. దీంతో మరో రూ.200కోట్ల బిల్లులు అప్లోడ్ కాలేదు.
- జీపీఎఫ్, పీఎఫ్ బిల్లుల బకాయిలు రూ.946కోట్లు ఉంటే నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రమే రూ.60కోట్లు చెల్లించింది. మిగతా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి.
- మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ.118కోట్లు, సరెండర్ లీవుల బకాయిలు రూ.2,250కోట్లు, ఇవికాకుండా 2021-22నాటికి చెల్లించాల్సిన సరెండర్ లీవుల బకాయిలు రూ.300కోట్లు ఉన్నాయి.
పీఆర్సీ.. ఒక డ్రామా..
ఎప్పుడూ లేని విధంగా మధ్యంతర భృతి (ఐఆర్) 27% కంటే 4% తగ్గించి.. 23% ఫిట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్ఆర్ఏ ఉంటే, జగన్ వచ్చాక 24 శాతానికి తగ్గించేశారు. జిల్లాకేంద్రాల్లో గతంలో 20% హెచ్ఆర్ఏ ఉండగా.. 16%కి కుదించేశారు.
- పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసేశారు. పీఆర్సీ పేస్కేల్ను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్ స్కేల్స్ ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్ కొత్తవి నిర్ణయిస్తారు? పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా? పోస్టులవారీ స్కేళ్ల ఆమోదం వల్ల కొందరికి వేతనం పెరగనుంది. డిప్యుటేషన్ అవకాశాలూ ఉంటాయి.
- 11వ పీఆర్సీ బకాయిలు, ప్రయోజనాలు కొలిక్కి రాకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ఇప్పుడు మధ్యంతర భృతి ఇవ్వకుండా, ఒకేసారి ఫిట్మెంట్ ఇస్తామంటూ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసింది. ఏడాదిలోగా 12వ పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వాలి. కానీ, ఇంతవరకు కార్యకలాపాలను ప్రారంభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్