‘కలెక్టర్లూ..’ ఇంతలా దిగజారిపోవాలా?
‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే.
‘ముఖ్య’ నేత సోదరుడు, మరో ముగ్గురికి తలొగ్గడమేనా?
ఇసుక తవ్వకాల్లేవంటూ 20 జిల్లాల కలెక్టర్ల నివేదిక
ఎన్జీటీ ముందు అడ్డంగా దొరకడంతో పోయిన పరువు
గుత్తేదారుకు శిక్ష ఖాయమని ఎన్జీటీ చెప్పినా ఆగని దందా
గురువారమూ రాష్ట్ర వ్యాప్తంగా తవ్వకాలు
ఈనాడు, అమరావతి: ‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలను లెక్క చేయకుండా భారీ దోపిడీకి పాల్పడుతున్నది వీరే. అందుకే కళ్లెదుటే ఇసుక తవ్వకాలు జరుగుతున్నా సరే, అడ్డుకునే ప్రయత్నం చేయకుండా కలెక్టర్లు వణికిపోతున్నారు. కనీసం ‘తవ్వకాలు నిజమే’ అని అంగీకరించేందుకూ భయపడిపోతున్నారు. నేరుగా ‘ముఖ్య’నేత ఆగ్రహానికి గురవుతామని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఏకంగా 20 జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక తవ్వకాలు జరగలేదని, తమ పరిశీలనలో అవేవీ కనిపించలేదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు నివేదిక ఇచ్చారు. ముఖ్య నేత సోదరుడితో పాటు నలుగురితో కూడిన ఇసుక మాఫియా బృందం సూచించినట్లే ఇసుక తవ్వకాల్లేని రీచ్లనే కలెక్టర్లు పరిశీలించి, తవ్వకాల్లేవంటూ నివేదిక ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కానీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్)కు చెందిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఇసుక దోపిడీ నిజమని తేల్చారు. దీంతో కలెక్టర్ల నివేదికలపై ఎన్జీటీ ఆశ్చర్యపోయింది. కలెక్టర్లు మరీ ఇంతలా ఎందుకు దిగజారిపోయారు? ప్రభుత్వ తాబేదార్లుగా ఎందుకు మారిపోయారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బుధవారం ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. గురువారం కూడా తవ్వకాలు యథవిధిగా కొనసాగాయి.
తవ్వకాల్లేని చోట తనిఖీలా?
జిల్లా పాలనా వ్యవహారాలతో యంత్రాంగానికి మార్గనిర్దేశకులుగా నిలవాల్సిన కలెక్టర్లు.. ఇసుక మాఫియాకు జీ హుజూర్ అంటున్నారు. అక్రమ తవ్వకాల్లేవంటూ ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చి.. పరువు పోగొట్టుకున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఇటీవల తమ జిల్లాల్లో రీచ్లను పరిశీలించారు. ఏ రీచ్లలో పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయో తెలిసినప్పటికీ.. వీరంతా వాటి జోలికి వెళ్లలేదు. అసలు తవ్వకాల్లేని చోట తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాల్లేవంటూ నివేదికలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ, నిప్పులాంటి నిజం ఎంవోఈఎఫ్ రూపంలో బయటపడింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది? ఇసుక మాఫియాకు, గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ ఎలా సహకరిస్తోందో వీరి నివేదిక కళ్లకు కట్టింది. కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తనిఖీలతోనే ఎంవోఈఎఫ్ ఇసుక దోపిడీని నిగ్గుతేల్చింది. ఈ బృందం మిగిలిన జిల్లాలకూ వెళ్తే.. అక్కడి అధికారుల బండారం బయటపడనుంది.
నమ్మకం కోల్పోయేలా చేశారు!
ఎక్కడా ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికతో షాక్కు గురైన ఎన్జీటీ.. ఇక వారితో తనిఖీలు చేయించడం వృథా అన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఎంవోఈఎఫ్ ద్వారానే పరిశీలింపజేయాలని నిర్ణయించింది. ఈ శాఖ ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశీలించి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. మిగిలిన జిల్లాల్లోనూ ఆ శాఖకు చెందిన కమిటీయే తనిఖీ చేసి నివేదిక రూపొందించాలని, దానిని నేరుగా సుప్రీంకోర్టు ముందుంచాలని ఎన్జీటీ ఆదేశించింది. అంటే మన కలెక్టర్లను నమ్మే పరిస్థితి లేదని ఎన్జీటీ నిర్ధారణకొచ్చినట్లు అయ్యింది.
శాటిలైట్ చిత్రాలతోనూ పట్టేశారు
ఇప్పుడే కాదు, 2021 నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎంవోఈఎఫ్ కమిటీ తేల్చింది. గూగుల్ ఎర్త్లోని శాటిలైట్ చిత్రాలను పరిశీలించి, ఎక్కడెక్కడ తవ్వారు? లీజు పరిధి దాటి ఎలా తవ్వేశారో గుర్తించింది. ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ఇలా ఎంవోఈఎఫ్ అధికారులు ప్రణాళిక ప్రకారం పరిశీలించి, అన్నింటినీ విశ్లేషించి నివేదిక ఇస్తే.. కలెక్టర్లు మాత్రం కావాలనే, మొక్కుబడి తనిఖీలతో మమ అనిపించారు. 2021 నుంచి ఎన్ని రీచ్లకు అనుమతులు ఇచ్చారు? వాటి పేర్లేంటి? విస్తీర్ణమెంత? అందులో ఎంత పరిమాణంలో తవ్వకాలకు అనుమతించారు అనే వివరాలు ఎంవోఈఎఫ్ అడిగితే.. గనుల శాఖ ఏవీ ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసింది. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి కర్త, కర్మ, క్రియ అన్నీ గనుల శాఖే. అందుకే కేంద్ర ప్రభుత్వ విభాగాలు అడిగినప్పటికీ రీచ్ల వివరాలు ఇవ్వకుండా గోప్యంగా ఉంచింది.
తవ్వుతాం.. ఆపే దమ్ముందా?
ఇసుక అక్రమ తవ్వకాలపై బుధవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. దోపిడీ నిజమని ట్రైబ్యునల్ తేల్చింది. గుత్తేదారు శిక్షార్హులని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అయినాసరే ముఖ్య నేత సోదరుడు, అతని మాఫియాలో కించిత్ భయం లేదు. మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లుగా గురువారం కూడా భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, వందల లారీల్లో తరలించారు. గురువారం తేదీతోనే వే బిల్లులు జారీ చేశారు. శ్రీకాకుళం, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, వైయస్ఆర్ తదితర జిల్లాల్లో గురువారం ఇసుక తవ్వకాలు యథావిధిగా సాగాయి. అక్రమ తవ్వకాల ద్వారా వస్తున్న సొమ్మంతా నిత్యం హైదరాబాద్కు చేరేలా ముఖ్య నేత సోదరుడు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి