సార్వత్రిక ఎన్నికల వేళ.. సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది.
జగన్ పర్యటనలకు విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి
వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందునేనట!
రెండు హెలికాప్టర్లకు నెల అద్దె రూ.3.85 కోట్లు, ఇతర ఖర్చులు అదనం
ఎన్నికల ప్రచారం కోసమేనని ప్రతిపక్షాల విమర్శ
ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది. వీటిలో ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచనుంది. గ్లోబల్ వెక్ట్రా సంస్థ నుంచి అద్దె ప్రాతిపదికన రెండు ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లను తీసుకుంటోంది. ఒక్కోదానికి రూ.1,91,75,000 చొప్పున రెండింటికీ కలిపి నెలకు రూ.3,83,50,000 అద్దె చెల్లించనుంది. సీఎంగా జగన్ పదవీకాలం మే నెలాఖరు వరకు ఉంది. అంటే ఈ మూడు నెలలకు హెలికాప్టర్ల అద్దెకే కేవలం రూ.11.50 కోట్లు ఖర్చవుతుంది. ఇవి కాకుండా గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటళ్లలో బస, పైలట్లు, సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు, ఇంధన రవాణా ఛార్జీలు, హెలికాప్టర్ సిబ్బంది మెడికల్ ఖర్చులు, ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించనుంది. హెలికాప్టర్లు సమకూర్చుకునేందుకు అనుమతిస్తూ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ భద్రతకు ముప్పు ఉందట.. అందుకే కొత్త హెలికాప్టర్లట
‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు, అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం భద్రత ఏర్పాట్ల పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్ 2010 నుంచి బెల్ 412 వీటీ-ఎంఆర్వీ ఎయిర్క్రాఫ్ట్ను వినియోగిస్తోంది. హెలికాప్టర్లో ముఖ్యమంత్రి పర్యటనలు పెరగటం, దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న హెలికాప్టర్ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ నిఘా విభాగం డీజీపీ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి ఈ రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది. వీటిని సీఎంతో పాటు ఇతర వీవీఐపీల పర్యటనలకూ వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం కోసమేనా?
మరో 10, 15 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రెండు నెలల్లోగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రత ముసుగులో ప్రభుత్వ ఖర్చుతో కొత్త హెలికాప్టర్లు సమకూర్చుకుని, ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు వినియోగించుకోబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
భద్రత పేరిట ఇప్పటికే అత్యుత్సాహం
ముఖ్యమంత్రికి అవసరమైన భద్రత ఏర్పాటు చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఏపీ పోలీసులు సీఎం భద్రత పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య, పిల్లలు, తల్లికి దేశ, విదేశాల్లో సైతం అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్మేట్ సెక్యూరిటీ) కల్పించేందుకు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు (ఎస్ఎస్జీ)ని ఏర్పాటు చేస్తూ ఏకంగా ప్రత్యేక చట్టమే చేశారు. ఆయన ఎక్కడున్నా ఎస్ఎస్జీ పూర్తి భద్రత కల్పిస్తుంది. ఎస్ఎస్జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ (లీగల్ ఇమ్యూనిటీ) కూడా చట్టంలో కల్పించారు. మరోవైపు జగన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే రోడ్లపైన ట్రాఫిక్ నిలిపేసిన ఉదంతాలున్నాయి. ఆయన జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటుంటే.. అక్కడి జాతీయ రహదారులపై సైతం వాహనాలను గంటల తరబడి ఆపేస్తున్నారు. సీఎం ఎక్కడికైనా వస్తున్నారంటే.. అక్కడి చెట్లన్నీ నరికేస్తున్నారు.
ఆయన పర్యటన ఉందంటే చాలు రెండు, మూడు రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలోని దుకాణాలు, వ్యాపారాలన్నింటినీ బలవంతంగా మూసేయిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజా సమస్యలపై గొంతెత్తేవారిని ముందుగానే అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. భద్రత కోసం ఇంత హంగామా చేస్తూ.. ఇప్పుడు మళ్లీ ఆయనకు ముప్పు ఉందంటూ ప్రజాధనాన్ని వెచ్చించి హెలికాప్టర్లు సమకూర్చుకోవటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘అసలు రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదమే లేదని డీజీపీ నుంచి ఎస్పీల వరకూ పదే పదే ప్రకటిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలు మన రాష్ట్రంలో లేనే లేవు. అయినా సరే వారి నుంచి ముప్పు ఉందంటూ రూ.కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడమేంటి?’ అని నిలదీస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్