ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?
ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది జగన్ సర్కారు. వైకాపాలో పని చేయడం, ఆ పార్టీతో అంటకాగడం, సీఎం జగన్తో బంధుత్వం ఉండటం.. వీటినే అర్హతలుగా కమిషన్ సభ్యత్వ పదవులు కట్టబెట్టారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్
వైకాపాతో అంటకాగిన వారికే పదవులు
సభ్యుల భర్తీలో ఉత్తరాంధ్రకు మొండిచేయి
రాజ్యాంగబద్ధ సంస్థలో సమ ప్రాతినిధ్యానికి సమాధి
ఈనాడు, అమరావతి
సలాంబాబు.. వైకాపా యువజన విభాగం మాజీ అధ్యక్షుడు డాక్టర్ జీవీ సుధాకర్రెడ్డి.. వైకాపాలో పనిచేసిన నాయకుడు పి.సుధీర్.. జగన్కు దగ్గరి బంధువు.. ఆ కమిషన్లోని మరికొందరిదీ ఇలాంటి నేపథ్యమే... అదేదో వైకాపాకు సంబంధించిన కమిషన్ అనుకునేరు.. కానే కాదు.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అక్కడ వీరికెలా చోటు దక్కిందంటారా.. జగన్ పార్టీలో వర్క్ చేశారు.. అదే సోషల్ వర్క్ అనీ.. అంతకంటే అర్హతేం కావాలనీ.. సభ్యులుగా నియమించారు. అలా ఏపీపీఎస్సీని కాస్త ‘వైసీపీఎస్సీ’గా మార్చేశారు!
ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది జగన్ సర్కారు. వైకాపాలో పని చేయడం, ఆ పార్టీతో అంటకాగడం, సీఎం జగన్తో బంధుత్వం ఉండటం.. వీటినే అర్హతలుగా కమిషన్ సభ్యత్వ పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది సభ్యుల్లో ఆరుగురికి అసలు ఉద్యోగ నియామకాలపై అవగాహనే లేదు. ప్రభుత్వ విభాగాల్లో పని చేసిన అనుభవమూ లేదు. గ్రూపు-1, 2లాంటి ముఖ్యమైన పోస్టులు భర్తీ చేసే ఏపీపీఎస్సీకి ఇలాంటి దుస్థితి కల్పించారు. తొలుత గ్రూపు-1 నియామకాలకు మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్నే అమలుచేస్తోంది. దీంతో సభ్యులకు డిమాండ్ పెరిగింది.
ఉత్తరాంధ్రకు అన్యాయం
కమిషన్లో ఛైర్మన్ కాకుండా ఎనిమిది మంది సభ్యులు ఉంటే ఇందులో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉండగా.. నంద్యాల, అనంతపురం, గుంటూరు, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తానేదో పేటెంట్ తీసుకున్నట్లు గొప్పలు చెప్పే సీఎం జగన్ వాస్తవంలో ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉండే ఆ ప్రాంతానికి చెందిన విద్యావేత్తలకు ఉద్యోగ నియామక కమిషన్ పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. పెత్తందారీ పోకడలతో ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూనే మరోపక్క వారిపై ప్రేమ నటించడం జగన్కే చెల్లింది. రాష్ట్రంలో 18కిపైగా విశ్వవిద్యాలయాలు ఉంటే ఒక్క వర్సిటీకి కూడా ఉపకులపతిగా ఆ ప్రాంతానికి చెందిన వారిని నియమించలేదు. విచిత్రమేమిటంటే ఆ ప్రాంతంలోని వర్సిటీలకు సైతం ఇతర ప్రాంతాల వారినే వీసీలుగా నియమించారు. ఉద్యోగ నియామకాల్లో కీలకమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి ఒక్క సభ్యుడిని సైతం ఆ ప్రాంతం నుంచి నియమించేందుకు జగన్కు చేతులు రాలేదు. ఇదేనా ఉత్తరాంధ్ర అభివృద్ధిమీద, అక్కడి ప్రజలపైనా జగన్కు ఉన్న ప్రేమంటే? ఇదేనా ఆ ప్రాంతానికి చేసే సముచిత న్యాయం?
నియామకాలపై అవగాహన తక్కువే..
కమిషన్ నిర్వహించే నియామకాలు తక్కువగా ఉండగా... సభ్యుల నియామకాలు మాత్రం చకాచకా జరిగిపోతున్నాయి. వీరిలో కార్యాలయానికి వచ్చే వారు తక్కువే. నెలకోసారి జరిగే కమిషన్ సమావేశంలో మాత్రమే సభ్యులు మెరుస్తున్నారు. పలువురు సభ్యులకు ఉద్యోగ నియామకాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ప్రభుత్వ సర్వీస్ వ్యవహారాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. కమిషన్లో తీసుకునే నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ సంతకాలు పెట్టేందుకు మాత్రమే వారు పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. వీరి కోసం పెద్ద ఛాంబర్లు, ప్రత్యేక సహాయకులు ఉన్నారు. సభ్యుల నియామకాలపై పెట్టిన శ్రద్ధ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ పెట్టడం లేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న జగన్ సర్కారు ఆచరణలో దారుణంగా విఫలమైంది. కమిషన్ నుంచి గడిచిన నాలుగున్నరేళ్లలో కేవలం 2,210 పోస్టుల భర్తీ కోసం 33 నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో సగం వరకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే.
వైకాపాతో ఉన్నవారే అధికం..
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా 2022 ఫిబ్రవరి 19న మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ప్రభుత్వం నియమించింది. దీనికంటే ముందు నుంచే సభ్యుల నియామకం చేపట్టింది. ఎనిమిది మంది సభ్యుల్లో ఐదుగురిని ‘సోషల్ వర్కర్’ కేటగిరీలో నియమించగా.. ముగ్గురికి ఇన్సర్వీస్ కేటగిరీలో అవకాశాన్ని కల్పించింది. కమిషన్లో సభ్యులుగా ఉండే వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ప్రొటోకాల్ ఉంటుంది. ఒక్కొక్కరికి వేతనం రూ.2 లక్షలకుపైనే. ఈ హోదాలో ప్రభుత్వపరంగా వచ్చే సదుపాయాల గురించి ఆలోచించే వారే సభ్యుల్లో ఎక్కువగా ఉన్నట్లు విమర్శలున్నాయి.
సభ్యుల నేపథ్యం ఇదీ..
సలాం బాబు: కడప జిల్లా సీకేదిన్నె మండలం అంగడివీధికి చెందిన ఈయన వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. వైకాపాకు పని చేసినందుకు అధికారంలోకి రాగానే జగన్ ఆయన్ని ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించి, రుణం తీర్చుకున్నారు.
సీవీ శంకర్రెడ్డి: కడప జిల్లాకు చెందిన ఈయన కేంద్ర పర్యాటక శాఖలో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈయన సతీమణి తెలంగాణలో ఐఏఎస్ అధికారిణి. సీఎం జగన్కు సన్నిహితులైన ఓ న్యూరాలజిస్ట్ సిఫార్సుతో కమిషన్లో స్థానం కల్పించారు. ఈయన హైదరాబాద్లో స్థిరపడ్డారు.
రమణారెడ్డి: కర్నూలు జిల్లాకు చెందిన ఈయనకు తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలున్నాయి. కర్నూలు జిల్లాలో గతంలో రెండు విద్యా సంస్థలు నిర్వహించారు. హైదరాబాద్లో స్థిరపడటంతో వాటి నిర్వహణ నుంచి వైదొలిగారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
పి.సుధీర్: సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభాదాస్రెడ్డి మనవడు. కర్నూలు జిల్లాలో ఉంటారు.
సిద్ధం శ్రీరామ్: నంద్యాల సమీపంలోని బిల్లలాపురానికి చెందిన ఈయన మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో నంద్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్గా, యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా పని చేశారు. నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డితో ప్రస్తుతం సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పరిచయాలతో ఆయన ఏపీపీఎస్సీలో సభ్యుడిగా నియమితులయ్యారు.
డాక్టర్ జీవీ సుధాకర్రెడ్డి: అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని ఊరుచింతల ఈయనది. ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ కదిరిలో స్థిరపడ్డారు. వైకాపా ఆవిర్భావంతో ఆయన ఉద్యోగం వదిలేసి ఆ పార్టీలోకి వెళ్లారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసేవారు. వైకాపా అధికారంలోకి రావటంతో ఏపీపీఎస్సీ సభ్యుడిగా పదవి కట్టబెట్టింది.
బి.ఎస్.సెలీనా: గుంటూరుకు చెందిన ఈమె ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అకడమిక్ ఆఫీసర్గా ఉన్నారు. సీఎంతో సన్నిహితంగా ఉండే వారు చేసిన సిఫార్సు మేరకు ఈమె కమిషన్ సభ్యులయ్యారు.
సోనీవుడ్: కాకినాడ జిల్లా తునిలో నాసా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నారు. క్రైస్తవ ప్రచార సభలు సైతం నిర్వహిస్తారు. ఐపీఎస్ సునీల్ కుమార్ ఈయనకు మావయ్య. జగన్ పాదయాత్రలో ఏర్పడిన పరిచయం కమిషన్లో అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు