ఉత్తరాంధ్రంటే... ఉత్తదనుకుంటివా?
ఉత్తరాంధ్రకు జగన్ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది.
మూడు ఉమ్మడి జిల్లాలను నిలువునా మోసం చేసిన జగన్
హామీ ఇచ్చిన ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకుండా దగా
అవసరం రూ.3,288 కోట్లయితే... ఇచ్చింది రూ.594 కోట్లే
వైకాపా ఐదేళ్ల కాలంలో వెనకబడిన ప్రాంతంపై తీవ్ర నిర్లక్ష్యం
ఈనాడు - అమరావతి
ఉత్తరాంధ్ర అంటే ఉత్తుత్తి ఆంధ్ర అనుకున్నారో... ఉత్తరాంధ్రులంటే ఉత్తర కుమారులు అనుకున్నారో... అందుకే హామీలిచ్చారు... నిధులివ్వలేదు... ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులను నీటి మూటలు చేశారు... ఏడాదిలో పూర్తి చేస్తానని ఐదేళ్లయినా చేతులెత్తేశారు... ఇప్పుడు మళ్లీ చిటికెల పందిరి వేస్తూ... ఓట్ల కోసం వస్తున్నారు... జనులారా జరభద్రం!
ఉత్తరాంధ్రకు జగన్ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. వెనకబడిన జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టులే కీలకాధారం. సాగులోకి తీసుకురావాల్సిన ఆయకట్టు ఎంతో ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఉత్తరాంధ్రపై జగన్ తన ప్రసంగాల్లో కురిపిస్తున్న ప్రేమ... చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడి ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. ఆఖరికి తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఘనంగా లక్ష్యాలు విధించుకున్న వంశధార రెండో దశకు చెందిన రెండో భాగం, వంశధార-నాగావళి అనుసంధానం ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదు. ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి గత తెదేపా హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు అన్నింటికీ రూ.3,288.52 కోట్లు కేటాయించాల్సిన ఉండగా... ఐదేళ్లలో రూ.594.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియాని పరిస్థితి నెలకొంది.
తోటపల్లి ఎప్పటికయ్యేను సంపూర్ణం..?
ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి పాత రెగ్యులేటర్, ఓపెన్ హెడ్ ఛానల్ కింద ఉన్న 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 1,31,000 ఎకరాలకు నీరివ్వడం లక్ష్యం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లోని 132 గ్రామాలకు, ఉమ్మడి విజయనగరంలోని పది మండలాల్లో ఉన్న 155 గ్రామాలకు లబ్ధి కలుగుతుంది. కుడి కాలువ ద్వారా 42 చెరువులను నింపి 24 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. తెదేపా ప్రభుత్వ హయాంలోనే పనులు 90% పైగా పూర్తయ్యాయి. దీన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. మొదటి ప్యాకేజీలో బ్యారేజీ హెడ్వర్క్సుతోపాటు కుడి ప్రధాన కాలువను సున్నా కి.మీ. నుంచి 52.450 కి.మీ. వరకు తవ్వాలి. తెదేపా హయాంలోనే 77% పనులు జరిగాయి. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలో మిగిలిన పనుల కోసం కొత్తగా టెండర్లు పిలిచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో ఇంకా మట్టి తవ్వకం, 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని, అనేక కట్టడాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
రెండో ప్యాకేజీలో కుడి ప్రధాన కాలువను 52.450 కి.మీ. నుంచి 117.89 కి.మీ. వరకు తవ్వాలి. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలను నిర్మించాలి. తెదేపా హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయి. జగన్ వచ్చాక గుత్తేదారును తొలగించి మళ్లీ టెండర్లు పిలిచి కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి.
వంశధార రెండో దశపై సన్నగిల్లిన ఆశలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఇది. వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి వరద నీటిని హిరమండలం జలాశయానికి మళ్లించి ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది యోచన. 19.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తున్నారు. దీని కుడికాలువ కింద 20 వేల ఎకరాలు, వరద కాలువ కింద 20 వేల ఎకరాలు, హైలెవెల్ కాలువ కింద 5,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇవ్వాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించిన జగన్... ఆయా పనులను ఇప్పటికీ కొలిక్కి తేలేకపోయారు. చాలినన్ని నిధులు ఇవ్వకపోవడం, బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయి.
గజపతినగరం బ్రాంచి కాలువ
తోటపల్లి కుడి ప్రధాన కాలువ పొడిగింపు పథకం ఇది. గజపతినగరం బ్రాంచి కాలువను 97.70 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు పొడిగించి విజయనగరం జిల్లాలోని గరివిడి, మెరకముడిదాం, గుర్ల, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లోని 41 గ్రామాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు 1.912 టీఎంసీల నీటిని అందించాలనేది లక్ష్యం. జగన్ వచ్చాక రెండు గుత్తేదారు సంస్థలు తాము చేస్తున్న పనుల నుంచి వైదొలిగాయి. తాజాగా పనుల అంచనా వ్యయం పెరిగింది.
వంశధార-నాగావళి అనుసంధానం...
వంశధార-నాగావళి నదులను అనుసంధానించి... వంశధార వరద జలాలను మళ్లించే పనులూ పూర్తవలేదు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని జలాశయం నుంచి బూర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్టకు నీటిని మళ్లించాలనేది లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా నాలుగు మండలాల్లోని 5,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. రూ.145 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును జగన్ సర్కారు తన తొలి ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తానంది. ఐదేళ్లు కరిగిపోయినా... పూర్తి చేయలేకపోయింది.
మహేంద్రతనయ రిజర్వాయర్ ఎప్పటికయ్యేనో?
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం చాప్రా గ్రామంలో మహేంద్రతనయ నదిపై 1.76 టీఎంసీల సామర్థ్యంతో ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. రూ.127 కోట్ల అంచనా వ్యయంతో దీనికి 2007లో పాలనామోదం ఇచ్చారు. జలాశయం నుంచి 1.89 టీఎంసీల నీటిని నాలుగు మండలాల్లోని 108 గ్రామాల్లో ఉన్న 24,600 ఎకరాల ఆయకట్టుకు మళ్లిస్తారు. 26 గ్రామాలకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగునీటికి 0.180 టీఎంసీలను వినియోగించాలనేది ప్రణాళిక. బడ్జెట్ కేటాయింపుల్లో ఏకంగా రూ.425 కోట్లు చూపినా... ఖర్చు చేసింది మాత్రం చాలా స్వల్పం. దాంతో ఇప్పటికీ పనులు పూర్తవడంలేదు.
మద్దువలస రెండో దశ... ఏదీ ధ్యాస?
శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలం మద్దువలస వద్ద ఈ ప్రాజెక్టు ఉంది. ఈ రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు అందించాలనేది లక్ష్యం. ఇందుకోసం 1.12 టీఎంసీల నీటిని వినియోగించుకుని జి.సిగ్ధం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కల్పించాలి. సకాలంలో బిల్లులివ్వని కారణంగా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఫలితంగా ఈ ప్రాజెక్టు పనులూ ముందుకు సాగడం లేదు.
తారకరామా... కరుణించవయ్యా...!
విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు సమీపంలో చంపావతి నదిపై బ్యారేజీ నిర్మించి 16,538 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సారిపల్లి వద్ద తారకరామతీర్థసాగర్ జలాశయాన్ని చేపట్టారు. డెంకాడ ఆనకట్ట కింద 8,172 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించాల్సి ఉంది. 2019 మే నాటికే 47.51 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో చేసిన పనులు అంతంతమాత్రమే. దీనికి రాష్ట్ట్ర్ర బడ్జెట్లో రూ.500 కోట్లకుపైగా కేటాయింపులు చూపినా రూ.100 కోట్లనైనా ఖర్చు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం