జిందాల్కు ఓబుళాపురం గనులు?
వడ్డించే వారు మనవారైతే కడాన కూర్చున్నా ఒక్కటే అనే సామెత తీరుగా ఉంది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల లీజుల వ్యవహారం. జిందాల్ కోరకు.. జిందాల్ కోసం.. జిందాల్ చేత.. అనేలా నిర్వహించిన టెండర్లను ఆ సంస్థే దక్కించుకోనుంది.
అంతా ప్రణాళిక ప్రకారమే!
1,300 హెక్టార్లలో ఖనిజాన్వేషణ, లీజు కోసం టెండర్లు
జేఎస్డబ్ల్యూ, దాని అనుబంధ సంస్థలే బిడ్ల దాఖలు
గతంలో ఏపీఎండీసీకి రిజర్వ్ చేయగా.. చేతులెత్తేసిన వైనం
ఈనాడు - అమరావతి
వడ్డించే వారు మనవారైతే కడాన కూర్చున్నా ఒక్కటే అనే సామెత తీరుగా ఉంది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల లీజుల వ్యవహారం. జిందాల్ కోరకు.. జిందాల్ కోసం.. జిందాల్ చేత.. అనేలా నిర్వహించిన టెండర్లను ఆ సంస్థే దక్కించుకోనుంది. తొలుత ఏపీఎండీసీకి రిజర్వ్ చేసిన ఈ భూముల్లో వ్యూహాత్మకంగా ఖనిజాన్వేషణ చేయకుండా.. వాటిని వదులుకునేలా చేసి, ఇప్పుడు జిందాల్ చేతిలో పెట్టేందుకు తెర వెనుక పెద్దలు చక్రం తిప్పారు. దీంతో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా ఓబుళాపురం వద్ద మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజ గనుల లీజును ఆ సంస్థ దక్కించుకోవడం లాంఛనం కానుంది. గనుల శాఖ పిలిచిన టెండర్లలో జేఎస్డబ్ల్యూతో (జిందాల్) పాటు మరో రెండు అనుబంధ కంపెనీలే బిడ్లు వేశాయి. దీంతో ఆ సంస్థే బిడ్ను సొంతం చేసుకోనుందని తెలిసింది.
ఏపీఎండీసీ చేతులెత్తేసింది ఇందుకేనా?
తొలుత మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో 1,300 హెక్టార్లను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. ఈ సంస్థ అటవీ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకొని ఖనిజాన్వేషణ చేయాలి. ఇందుకోసం 70 చోట్ల బోర్లు వేయాలని ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలి. అందుకు దాదాపు 16 హెక్టార్ల అటవీ భూమి తీసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా మరోచోట అటవీ శాఖకు భూములు కేటాయించి, పరిహారం చెల్లించాలి. దీనికి సంబంధించి తొలుత దస్త్రం కదిలింది. ఉమ్మడి వైయస్ఆర్ జిల్లాలోని ఓబుళవారిపల్లె మండలంలోని ఏపీఎండీసీకి చెందిన భూముల్లో కొంతమేర అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని భావించారు. తరువాత ఆ ప్రతిపాదనలన్నీ ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం కేటాయించిన భూముల్లో అయిదేళ్లలో ఖనిజాన్వేషణ పూర్తిచేసి, లీజు పొందలేకపోతే రద్దవుతుంది. ఇలా ఏపీఎండీసీ అయిదేళ్లలో ఖనిజాన్వేషణే మొదలుపెట్టలేదు. దీంతో ఆ సంస్థకు 1,300 హెక్టార్ల రిజర్వ్ రద్దయింది. తాజాగా వీటికి గనుల శాఖ టెండర్లు పిలిస్తే జిందాల్ దక్కించుకోవడానికి సిద్ధమైంది. కార్పొరేట్ సంస్థకు అవి దక్కేలా ఏపీఎండీసీ ఖనిజాన్వేషణ చేయకుండా చేతులెత్తేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మించేరి రిజర్వ్ అటవీ భూముల్లో 50 శాతం వరకు ఐరన్ కంటెంట్ ఉండే హెమటైట్ వెరైటీ ఇనుప ఖనిజ నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. 70 శాతం వరకు ఐరన్ కంటెంట్ ఉండే ముడి ఇనుప ఖనిజానికి, దీన్ని జతచేస్తే స్టీల్ప్లాంట్కు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ మూడూ వారికి చెందినవే
మించేరీ రక్షిత అటవీ ప్రాంతంలో 1,300 హెక్టార్లలో ఇనుప ఖనిజ నిల్వల కోసం ఖనిజాన్వేషణకు గనుల శాఖ కొద్ది రోజుల కిందట టెండర్లు పిలిచింది. ఆయా భూముల్లో బోర్లు వేసి, ఖనిజాన్వేషణ చేసి.. ఎంతమేర నిల్వలున్నాయో నిర్ధారించుకుంటారు. తరువాత ఆ నిల్వలున్న విస్తీర్ణం మేరకు లీజు కేటాయిస్తారు. గనుల శాఖ పిలిచిన టెండర్లలో 3 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తొలిసారి పిలిచిన టెండర్లలో కనీసం మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయాలనే నిబంధన ఉండగా.. విచిత్రంగా మూడే వేశాయి. అందులో జేఎస్డబ్ల్యూతో పాటు, జిందాల్కే చెందిన మరో రెండు సంస్థలు ఉన్నట్లు తెలిసింది. అటవీ, పర్యావరణ అనుమతులన్నీ టెండరు పొందిన సంస్థ పొందాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అయిదేళ్ల వ్యవధిలో మూడేళ్లలో ఖనిజాన్వేషణ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరో రెండేళ్లు ఈ గడువు పెంచేందుకు వీలు కల్పించారు. ఆ తరువాత మైనింగ్ లీజు కేటాయించనున్నారు. తవ్వి తీసే ఇనుప ఖనిజంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ధర ప్రకారం కనీసం 10 శాతాన్ని బేస్ ప్రైస్గా ఖరారు చేశారు. బిడ్లు వేసిన మూడు సంస్థలూ ఒకరివే కావడంతో దాదాపు 10 శాతం మేరకే కోట్ చేసి ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు బిడ్ల సాంకేతిక అర్హతలను పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి