జగన్ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే
శ్రీరాముడి విగ్రహం తలనరికేశారు... లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం తగలబెట్టేశారు... బెజవాడ దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను తస్కరించారు.. ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు.... సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు.. గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు..
ఆయన గద్దెనెక్కింది మొదలు హిందూ దేవాలయాలపై వరుస దాడులు
శ్రీరాముడి విగ్రహం తలనరికేయటం మొదలు.. రథాల దహనం వరకూ వందల ఘటనలు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల కూల్చివేతలు, దేవత విగ్రహాల విధ్వంసాలు, దేవస్థానాల్లో చోరీలు
అసలు నేరగాళ్లను పట్టుకోని పోలీసులు
దుశ్చర్యలకు పాల్పడ్డ దుండగులు జగన్ నిర్లక్ష్యంతో దర్జాగా తిరుగుతున్నారు
ఆ అలసత్వం ఫలితమే తాజాగా అమరలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ
ఈనాడు - అమరావతి
శ్రీరాముడి విగ్రహం తలనరికేశారు...
లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం తగలబెట్టేశారు...
బెజవాడ దుర్గమ్మ వెండిరథంలోని సింహాలను తస్కరించారు..
ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పంటించేశారు....
సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు..
గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి యత్నించారు..
పదుల సంఖ్యలో ఆలయాల్ని తవ్వేశారు.. వందల సంఖ్యలో దేవతా ప్రతిమలను ధ్వంసం చేసేశారు.. హుండీలు కొల్లగొట్టారు.. ఆభరణాలు దోచుకెళ్లారు. ఇలా ఒకటా.. రెండా.. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగనన్ని దాడులు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో దేవాలయాలపై దుశ్చర్యలకు తెగబడుతుంటే జగన్ ప్రభుత్వంలో చలనం లేదు. శ్రీరాముడి విగ్రహం తల తెగ్గోస్తే.. హా ఏముందిలే కొత్త విగ్రహం పెట్టేస్తామన్నారు.. దివ్యరథం తగలబెట్టేస్తే నూతన రథం నిర్మించి ఇచ్చేస్తామన్నారు. దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఒక్కటంటే ఒక్క చర్యా తీసుకోవట్లేదు. దేవస్థానాల్లో వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికారు. అసలు అవి పనిచేస్తున్నాయో లేదో పట్టించుకునే దిక్కు లేదు. అన్నిచోట్లా భద్రతా ఆడిట్ చేసేశామంటూ ఆర్భాటపు ప్రకటనలిచ్చారు.. ఆలయాల్ని కొల్లగొడుతుంటే అడ్డుకునేవారు లేరు. ఈ లెక్కలేనితనం ఫలితంగానే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా అమరావతిలోని ప్రఖ్యాత అమరరామలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ ఘటన... జగన్ జమానాలో దేవాలయాల్లో భద్రత లేమికి నిలువెత్తు నిదర్శనం.
మతిస్థిమితం లేని వ్యక్తులు చేశారట!
- విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికేసిన ఘటన జరిగి మూడేళ్ల మూడు నెలలవుతోంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించినా.. నిందితులెవరో కూడా ఇప్పటివరకూ తేల్చలేకపోయారు.
- అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి దివ్యరథం దహనమై మూడున్నరేళ్లవుతోంది... దానిపై మొదట్లో ఏవేవో కట్టుకథలు చెప్పిన పోలీసులు తర్వాత ఆ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని చేతులు దులిపేసుకున్నారు. అటు సీబీఐ కూడా ఆ కేసు తీసుకోలేదు.
- బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని తేల్చేసి, ఆ కేసును అటకెక్కించేశారు.
- మతిస్థిమితం లేని వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నవారు ఈ దాడులకు పాల్పడ్డారంటూ చాలా కేసుల్ని పోలీసులు తేల్చేశారు. మూఢ నమ్మకాలు, గుప్తనిధుల కోసం ఈ దారుణాలకు ఒడిగట్టారంటూ మరికొన్ని కేసుల్ని నీరుగార్చేశారు. కొన్ని ఘటనల్లో అసలు కేసులే నమోదు చేయలేదు. మరికొన్ని ఘటనల్లో ఏళ్లు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ విధ్వంసాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులకే ఆ నేరాన్ని ఆపాదింజేయడం మరింత దారుణం.
సీఎంపై పోస్టు పెడితే వెతికి మరీ పట్టుకుంటారే... దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోలేరా?
2020 జనవరి నుంచి 2021 జనవరి మధ్య రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసాలు, ఆలయాల్లో చోరీల ఘటనల్లో ముఖ్యమైన 44 కేసుల్ని తీసుకుంటే.. వాటిలో 15 కేసులను ఇప్పటి వరకూ ఛేదించలేకపోయారు. మిగతా 29 కేసుల్లో కూడా ఎవరో ఒకర్ని నిందితులుగా చూపించి, మమ అనిపించేశారు. సత్వరం స్పందించకపోవటం, సరైన దర్యాప్తు చేయకుండా వదిలేయటం, నేరగాళ్ల అరెస్టుకు చొరవ చూపకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, అధికార పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఓ చిన్న పోస్టు పెడితే చాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారెవరో, ఎక్కడున్నారో వెతికి వెతికి పట్టుకునే పోలీసులు.. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వారిని మాత్రం పట్టుకోరు. హిందూ దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన ఆ దుండగులు జగన్ సర్కారు పుణ్యమా అని దర్జాగా ఎక్కడో చోట గడిపేస్తున్నారు.
భద్రత ఆడిట్లు.. సీసీ కెమెరాలు ఏమైపోయాయి?
2020-21 మధ్య దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో.. ‘రాష్ట్రంలోని 58,871 ప్రార్థనా మందిరాలను గుర్తించి మ్యాపింగ్, భద్రత ఆడిట్ పూర్తి చేశాం. 13,296 ప్రదేశాల్లో 44,521 సీసీ కెమెరాలు అమర్చాం’ అని 2021 జనవరిలో అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. నిజంగా ఆయన చెప్పినట్లు భద్రత ఆడిట్ జరిగి, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడితే ఇప్పటికీ వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా? భద్రత లోపాల్ని సరిదిద్దారా లేదా అని ఈ రెండేళ్లలో ఒక్కసారైనా సమీక్షించకపోవటం వల్లే కదా హిందూ దేవాలయాలపై ఇన్ని దుశ్చర్యలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో గత 30 ఏళ్లలో అసలు చోరీయే జరగలేదు. అలాంటిది తాజాగా ఓ దుండగుడు అర్ధరాత్రి వేళ ఆలయంలోకి చొరబడి హుండీని కొల్లగొట్టాడు. అంత ప్రఖ్యాత ఆలయం వద్ద రాత్రి వేళలో గస్తీ నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఆలయంలో దేవాదాయ శాఖ తరఫున ఇద్దరు రాత్రికాపలాదారులు ఉంటారు. వారేం చేస్తున్నట్లు?
చేతులెత్తేసిన సిట్
జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, చోరీల ఘటనలు వందల సంఖ్యలో జరగ్గా... పోలీసులు కొన్నింటిలోనే కేసులు నమోదు చేశారు. వాటిలో ముఖ్యమైన కేసుల దర్యాప్తు కోసం డీఐజీ జీవీజీ అశోక్కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని కేసుల్ని మాత్రమే ఛేదించింది. తాగుబోతులు, మతిస్థిమితం లేని వారే ఈ నేరాలకు పాల్పడ్డారని తేల్చేసింది. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడే సంభవించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసింది. అంతే తప్ప వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ దాడుల వెనక ఉన్న సూత్రధారుల్ని మాత్రం పట్టుకోలేదు. అసలు నిందితుల్ని పట్టుకోలేక.. చివరికి పలు కేసుల్లో తెదేపా, భాజపా నాయకుల్ని అరెస్టు చేసి ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు యత్నించారు.
జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాల తదితర ఘటనల్లో ముఖ్యమైనవి ఇవీ
- 2020 మార్చి 12: ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం
- 2020 ఏప్రిల్ 9: ద్వారకాతిరుమలలో సీతారాముల విగ్రహాల్ని అపవిత్రం చేసిన ఘటన
- 2020 ఆగస్టు 4: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదకొండూరు పంచాయతీలో తిప్పపైనున్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో చోరీ
- 2020 ఆగస్టు 9: తాళ్లాయపాలెం కృష్ణా పుష్కర ఘాట్లోని శివుడి విగ్రహం ధ్వంసం
- 2020 సెప్టెంబరు 4: బేతంచర్ల ముచ్చట్ల మల్లికార్జునస్వామి జెండా స్తంభం ధ్వంసం
- 2020 సెప్టెంబరు 5: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం దహనం
- 2020 సెప్టెంబరు 15: విజయవాడ పటమటలోని సాయిబాబా విగ్రహం ధ్వంసం
- 2020 సెప్టెంబరు 15: విజయవాడ దుర్గగుడి వెండిరథంలోని వెండి సింహాల తస్కరణ
- 2020 సెప్టెంబరు 16: వత్సవాయిలో నంది విగ్రహం ధ్వంసం
- 2020 సెప్టెంబరు 22: గుంటూరు జిల్లా నకరికల్లులోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ
- 2020 సెప్టెంబరు 25: నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహం తోక ధ్వంసం
- 2020 సెప్టెంబరు 27: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆగరమంగళంలో ఆంజనేయస్వామి ఆలయంలో దోపిడీ.. నంది విగ్రహం ధ్వంసం.
- 2020 అక్టోబరు 5: మంత్రాలయం నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు ధ్వంసం
- 2020 అక్టోబరు 21: కోరింగలో హనుమాన్ విగ్రహం ధ్వంసం
- 2020 నవంబరు 2: మాచవరం దక్షిణామూర్తి విగ్రహం ధ్వంసం
- 2020 డిసెంబరు 12: కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు
- 2020 డిసెంబరు 12: కర్నూలు జిల్లా మద్దికెరలోని పురాతన మద్దమ్మ ఆలయాన్ని తవ్వేశారు.
- 2020 డిసెంబరు 8: రామతీర్థంలో సీతారామస్వామి విగ్రహం ధ్వంసం
- 2021 జనవరి 1: రాజమహేంద్రవరంలోని సిద్ధి విఘ్నేశ్వరస్వామి విగ్రహం ధ్వంసం
- 2021 జనవరి 3: విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని సీతాదేవి విగ్రహం ధ్వంసం
- 2021 జనవరి 10: అనంతపురం జిల్లాలోని దిగువచెక్కవారిపల్లెలో ఆంజనేయస్వామి పాదాల ధ్వంసం
- 2021 మార్చి 1: వెల్దుర్తి మండలంలోని తిక్కతాత స్వామి, ఎల్లమ్మ, అయ్యప్పస్వామి ఆలయాల్లో హుండీలు చోరీ
- 2021 మార్చి 3: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం
- 2021 మార్చి 21: విశాఖపట్నం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో 35 తులాల బంగారు ఆభరణాల చోరీ
- 2021 ఏప్రిల్ 16: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెంలో ముత్యాలమ్మతల్లి ఆలయంలో చోరీకి యత్నం
- 2022 ఏప్రిల్ 25: పులివెందుల పాతకూరగాయల మార్కెట్లోని తూర్పు ఆంజనేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు