ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సర్వ హక్కులు
‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు.
58 నెలల్లో 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం
ఒంగోలు సభలో సీఎం జగన్ ప్రకటన
జిల్లా నేతల ప్రస్తావన లేకుండానే ప్రసంగం
గైర్హాజరైన సిటింగ్ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీలు
ఈనాడు, ఒంగోలు: ‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్లస్థలాల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచితంగా పంపిణీ చేసిన ఇంటి స్థలాలపై మహిళలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసి హక్కు పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మరో పది రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని తెదేపా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు. నాడు- నేడు, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని, పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పించామని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్త మ్యానిఫెస్టోతో ఇంటింటికీ కిలో బంగారం, బెంజ్ కారు అనే హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తారని విమర్శించారు.
పొగిడినా ఫలితం లేకపోయే..
సభలో తొలుత ప్రసంగించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్, జగన్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇళ్లపట్టాలు పంపిణీ చేసి, ఇచ్చిన మాట నిలుపుకొన్నారంటూ కొనియాడారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఒంగోలులో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమమని చెప్పలేదు. దాదాపు గంటపాటు మాట్లాడిన ఆయన.. ఎక్కడా బాలినేని పేరు ప్రస్తావించలేదు. ఒంగోలు నుంచి పోటీ చేస్తారని, గెలిపించాలంటూ సీఎం చెబుతారని బాలినేని అభిమానులు ఆశించి నిరుత్సాహానికి గురయ్యారు. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి అసలు ఆహ్వానమే అందలేదు. ప్రొటోకాల్ ప్రకారం కూడా సమాచారం లేకపోవడంతో ఆయన దూరంగానే ఉండిపోయారు. దర్శి వైకాపా సిటింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా సభకు హాజరుకాలేదు. బాపట్ల జిల్లా చీరాల నుంచి కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, కందుకూరు నుంచి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వచ్చారు. అదే సమయంలో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గైర్హాజరయ్యారు.
ఏమో.. అభ్యర్థులు మారా వచ్చు..
బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు కార్పొరేటర్లు, ఇతర నాయకులతో ఫొటోలు దిగారు. జిల్లా నేతలు, అధికారులను పలకరించారు. హెలిప్యాడ్ వద్ద దాదాపు గంటపాటు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ముచ్చటించారు. అభ్యర్థులు ఎవరనేది చూడకుండా, ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసికట్టుగా అందరి గెలుపు కోసం కృషిచేయాలని వారికి సూచించినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో సిటింగ్లు, సమన్వయకర్తల్లో అయోమయం నెలకొంది. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేస్తారని చెప్పకపోవడం, ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై కూడా గందరగోళం నెలకొంది.
తీసుకొచ్చారు.. ఎండలో వదిలేశారు..
సీఎం సభ పేరుతో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 500 ఆర్టీసీ బస్సులు, ఉమ్మడి ప్రకాశంలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 400 బస్సులు, మినీ వ్యాన్ల ద్వారా జన సమీకరణ చేశారు. వీరందరినీ సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణానికి తెచ్చి వదిలేశారు. బస్సులను దూరంగా తీసుకెళ్లి నిలిపారు. సభా ప్రాంగణం నుంచి కొప్పోలు రోడ్డు వరకు పొలాల మధ్య మూడు కిలోమీటర్లు కొత్తగా వేసిన మట్టిరోడ్డు కావడంతో వాహనాల రాకపోకలతో పరిసరాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఏ బస్సు ఎక్కడుందో తెలియక మహిళలు రెండు గంటలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. నీళ్లు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. సభకు రావాల్సిందేనంటూ బలవంతంగా తీసుకొచ్చారని, తీరా ఇక్కడ పట్టాలు ఇవ్వకపోగా భోజనమైనా పెట్టకుండా ఎండలో వదిలేశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొందరు బస్సుల్లోనే ఉండిపోయారు. మరికొందరు సభకు వెళ్లకుండా బయటే కూర్చున్నారు. ఇంకొందరు సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో బస్సులను కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలపాటు బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్