సంక్షిప్త వార్తలు(13)
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో క్రిమినల్ కేసులున్నవారు పదవీ విరమణ చెందితే.. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను (టెర్మినల్ బెనిఫిట్స్) చెల్లించకూడదని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
క్రిమినల్ కేసులుంటే పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వొద్దు
ఆదేశాలు జారీచేసిన ఆర్టీసీ యాజమాన్యం
ఈనాడు, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో క్రిమినల్ కేసులున్నవారు పదవీ విరమణ చెందితే.. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను (టెర్మినల్ బెనిఫిట్స్) చెల్లించకూడదని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినందున.. వారికి ఉన్న ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్టీసీలో గత నెల నుంచి పదవీ విరమణలు మొదలయ్యాయి. దీంతో క్రిమినల్ కేసులున్న ఉద్యోగులు రిటైర్ అయితే టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వడంపై కొన్ని జిల్లాల అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇంటి నిర్మాణానికి పదేళ్ల గడువు
ఈనాడు, అమరావతి: పట్టాలు పొందిన వారు ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం పదేళ్ల (120 నెలలు) గడువు ఇచ్చింది. గతంలో ఇంటి పట్టా పొందిన తేదీ నుంచి 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన అమల్లో ఉండేది. దీనిని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 25-12-2020 నుంచి పట్టాలు పొందిన వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.
కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతులకు నోటిఫికేషన్
ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, అనుచరులు ప్రైవేటు కళాశాలల అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఈ ప్రకటన విడుదల చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 వరకు గడువు విధించింది. అపరాధ రుసుము రూ.25 వేలతో మార్చి 16 వరకు అవకాశం కల్పించింది. కొత్త కళాశాలల మంజూరు ఆర్డర్లను ఏప్రిల్ 25న జారీ చేయనుంది.
సీఎంఏ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ ప్రభంజనం
హైదరాబాద్: ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు సత్తాచాటారని ఆ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సీఎంఏ ఇంటర్ మొదటి 50 ర్యాంకుల్లో.. జాతీయ స్థాయి 5వ ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు 49 మంది సాధించారని తెలిపారు. సీఎంఏ ఫైనల్ తొలి 50 ర్యాంకుల్లో..ఆలిండియా రెండో ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు 34 మంది పొందారని పేర్కొన్నారు. ర్యాంకులతో ప్రతిభ చూపిన విద్యార్థులను మోహన్ అభినందించారు.
ఎమ్మెల్సీ అశోక్బాబుకు చంద్రబాబు పరామర్శ
ఈనాడు డిజిటల్, అమరావతి: హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబును ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. ఇటీవలే అశోక్బాబుకు బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
రమణదీక్షితులపై చర్యలు తీసుకోండి
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న తమపై తిరుమల గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీపెద్దజీయర్, శ్రీచిన్నజీయర్స్వామి.. తితిదే ఈవో ధర్మారెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘శ్రీవారి కైంకర్యాలు శ్రీవైఖానసాగమ ప్రకారం, శ్రీ వైష్ణవ సంప్రదాయాలను అనుసరిస్తూ నిరంతరం జరగాలనే ముందుచూపుతో రామానుజాచార్యులు జీయంగారు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరారు.
ప్రవీణ్ప్రకాష్ను పదవి నుంచి తప్పించండి
సీఎస్కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ లేఖ
ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ను పదవి నుంచి తప్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ డిమాండ్చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి లేఖ రాశారు. ప్రవీణ్ప్రకాష్ అనుచిత వైఖరిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీపీటీ)కి రఘువర్మ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీపీటీ కోరింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖను సాధారణ పరిపాలన విభాగం వివరాలు అడిగింది. కాగా విద్యాశాఖకు అధికారిగా ప్రవీణ్ప్రకాష్ ఉండటం వల్ల నివేదిక సరిగా ఉండదని, ఆయన్ను తప్పించాలని రఘువర్మ సీఎస్కు లేఖ రాశారు.
లాస్య నందిత మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈనాడు డిజిటల్, అమరావతి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె తండ్రి సాయన్న మరణం మరిచిపోక ముందే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకోవడం విచారకరమని ‘ఎక్స్’లో శుక్రవారం పేర్కొన్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
ఎర్రన్నాయుడు సేవలు అద్వితీయం: ప్రజా నాయకుడిగా, తెదేపా నేతగా ప్రజలకు, పార్టీకి ఎర్రన్నాయుడి సేవలు అద్వితీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. బీసీల తరఫున ఆయన బలమైన గళమై గర్జించారని గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా నివాళి అర్పించారు.
చిరుధాన్యాలతో రుచికరమైన వంటలు పుస్తకం ఆవిష్కరణ
ఈనాడు డిజిటల్, అమరావతి: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023ను పురస్కరించుకుని ‘చిరుధాన్యాలతో రుచికరమైన 100 రకాల వంటలు’ అనే పుస్తకాన్ని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్, డాక్టర్ శారద జయలక్ష్మి, ఎన్జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి బాలునాయక్ పాల్గొన్నారు.
57 అమృత్ భారత్ స్టేషన్లకు 26న శంకుస్థాపన
ఈనాడు, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 57 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 34 స్టేషన్లకు రూ.613 కోట్లు అదే విధంగా మహారాష్ట్రలో 6 స్టేషన్లకు రూ.63 కోట్లు, కర్ణాటకలో 2 స్టేషన్లకు రూ.18.5 కోట్లు ఖర్చుచేసి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. దేశవ్యాప్తంగా 554 స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ఏకకాలంలో శంకుస్థాపన చేస్తారు.
12వ వేతన సవరణ సంఘానికి సిబ్బంది కేటాయింపు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 12వ వేతన సవరణ సంఘానికి అవసరమైన సిబ్బందిని మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. కమిషనర్కు ఒక కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రైవేట్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఉన్న ఉద్యోగుల నుంచి మరో ఏడుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఆప్కాస్ నుంచి పొరుగు సేవల సిబ్బందిని నియమించుకోవచ్చని పేర్కొన్నారు.
ఎస్సీ గురుకులాల్లో బదిలీలకు శాశ్వత మార్గదర్శకాలు
ఈనాడు, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో బదిలీలకుగాను త్వరలో శాశ్వత మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజుల క్యాజువల్ లీవు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో 72వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో పనిచేస్తున్న టీజీటీ ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పీజీ ఉండాలన్న ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం సడలించాలని నిర్ణయించామన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న జిల్లా సమన్వయ అధికారుల పదోన్నతులు ఇదివరకు ఉన్న జీవోల ప్రకారంగానే చేస్తామని వివరించారు. పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జీవో నంబర్ 59 ప్రాతిపదికన రెగ్యులర్ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ నీటిపారుదలశాఖకు సలహాదారు?
ఆదిత్యనాథ్, ఎస్.కె.జోషి సహా మరికొన్ని పేర్ల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: సాగునీటి రంగానికి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని సలహాదారుగా నియమించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పర్యవేక్షించి, తర్వాత ఏపీలో జలవనరుల శాఖ కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్దాస్ ఒకరు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలోనూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, పదవీ విరమణ తర్వాత కొంతకాలం సలహాదారుగా పని చేసిన ఎస్.కె.జోషి మరొకరు. అయితే ఆదిత్యనాథ్ వైపే మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్