అన్నం బిల్లులకూ ఆటంకాలే!
అయిదేళ్ల కిందట... చక్కెర పోయకుండానే... నాలుకలను తీపెక్కించారు! చిక్కటి హామీలతో... మెదళ్లను మార్చేశారు! పీఠమెక్కాక అసలు రంగు చూపించారు! హాస్టల్ పిల్లలనూ ఆకలికి వదిలేశారు.. అన్నం బిల్లులను అటకెక్కిస్తున్నారు.. మేనమామనంటూనే మేలు మరిచారు!!
వసతి గృహాలకు డైట్ఛార్జీలను సక్రమంగా చెల్లించని జగన్
భోజనం పెట్టేందుకు అల్లాడుతున్న వార్డెన్లు
రాష్ట్రవ్యాప్తంగా రూ.54 కోట్ల బకాయిలు
ఈనాడు - అమరావతి
అయిదేళ్ల కిందట...
చక్కెర పోయకుండానే...
నాలుకలను తీపెక్కించారు!
చిక్కటి హామీలతో...
మెదళ్లను మార్చేశారు!
పీఠమెక్కాక అసలు రంగు చూపించారు!
హాస్టల్ పిల్లలనూ ఆకలికి వదిలేశారు..
అన్నం బిల్లులను అటకెక్కిస్తున్నారు..
మేనమామనంటూనే మేలు మరిచారు!!
పిల్లల ఆకలిదప్పులను తీర్చే వారిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం మేనమామదే. అందుకే మేలు కోరేవాడే మేనమామ అంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు తనను తాను మేనమామగా ప్రచారం చేసుకుంటున్న జగన్... వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారానికి ఏడాదిన్నరగా సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం ఆయా హాస్టళ్లకు కొన్నిచోట్ల 3 నుంచి 5 నెలల డైట్ఛార్జీల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులకు పోషకాహారం అందించలేక వార్డెన్లు చేతులెత్తేస్తున్నారు. కొందరు ఉన్నవాటితో సర్దుబాటు చేస్తున్నారు. మరికొందరు నాసికరం సరకులు తెచ్చి పెడుతున్నారు. కొన్నిచోట్ల సొంత డబ్బులతో పిల్లలకు తిండి పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హాస్టళ్లకు సంబంధించి మొత్తం రూ.54 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.
ఇవిగో కొన్ని ఉదాహరణలు
- పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు మూడు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
- కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో 2023 సెప్టెంబరు నుంచి బకాయి పెట్టారు.
- కర్నూలు జిల్లాలో బీసీ వసతి గృహ విద్యార్థులకు అయిదు నెలలుగా డైట్ఛార్జీల చెల్లింపులు లేవు.
- అనంతపురం జిల్లా పరిధిలోనూ కొన్ని వసతి గృహాలకు 5 నెలలు, మరికొన్ని వసతి గృహాలకు ఆరు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
- సీఎం జగన్ సొంత జిల్లా వైయస్ఆర్లోనూ బీసీ వసతి గహాలకు 2023 నవంబరు నుంచి చెల్లింపులను నిలిపేశారు.
- విజయనగరం జిల్లాలోని ఎస్సీ ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు 2023 అక్టోబరు నుంచి డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి.
గ్రీన్ఛానల్లో చూపుతూనే...
వాస్తవానికి వసతి గృహ విద్యార్థుల డైట్ఛార్జీల బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలి. ఏ నెలకానెల నిధులను ఠంచనుగా విడుదల చేయాలి. జగన్ అధికారంలోకి రాగానే గ్రీన్ ఛానల్ కూడా రివర్స్ అయింది. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే తప్ప... వాటికి సకాలంలో చెల్లింపులు జరగడంలేదు. పైగా అదేం మాయో గానీ... గ్రీన్ఛానల్లో ఎప్పుడూ డబ్బులు ఉన్నట్లు కనిపిస్తుంది.
మూడేళ్లపాటు విన్నవిస్తే... నిరుడు విదిల్చారు...
ప్రస్తుత నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రభుత్వం డైట్ ఛార్జీల కింద విద్యార్థులకు చెల్లిస్తున్నది నామమాత్రమే. అవి కూడా సక్రమంగా చెల్లించకపోతే ఎలా? వైకాపా అధికారంలోకి రాకముందున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్నింటి ధరలు వంద శాతానికిపైగా పెరిగాయి. సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేళ్లపాటు డైట్ ఛార్జీలను పెంచాలని వసతి గృహాల అధికారులు విన్నవిస్తున్నా... జగన్ వినిపించుకోలేదు. విద్యార్థులను తీవ్ర ఇక్కట్లపాలు చేశారు. ఎట్టకేలకు గతేడాది జూన్ నుంచి నామమాత్రంగా పెంచారు. నిత్యావసరాల ధరలను పరిగణనలోకి తీసుకోకుండా పెంపును 15 శాతానికే పరిమితం చేశారు. అధికారులు కనీసం 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం. పైగా సంబంధిత బిల్లులను కూడా సక్రమంగా చెల్లించడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో 33% నుంచి 66% పెంపు
గత ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు 2018లో డైట్ఛార్జీలను పెంచి, అమలు చేసింది. మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు 2012 నుంచి నెలవారీగా ఇస్తున్న మొత్తం రూ.750 ఉండగా 2018లో తెదేపా ప్రభుత్వం రూ.1000 (33%)కి పెంచింది. 5, 6, 7 తరగతుల విద్యార్థులకిచ్చే మొత్తాన్ని రూ.750 నుంచి రూ.1,250 (66%)కి, 8, 9, 10 తరగతులకు రూ.850 నుంచి రూ.1,250 (47%)కి, ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులకు రూ.1,200 నుంచి రూ.1,400 (16.5%)కు పెంచడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్