జగన్.. మా ఇంటికి దారేది?
అజీర్తి రోగికి ఆకలి ఎక్కువన్నట్లు... జగన్కు ప్రచారంపై మక్కువ.. ‘కాలనీలు కాదు ఊళ్లు కడుతున్నాం’ అని చెప్పిన జగన్.. వాగులూ వంకల్లో.. కొండలూ గుట్టల్లో..ఇళ్ల స్థలాలు ఇచ్చారు... వాటినైనా సవ్యంగా అప్పగించారా అంటే అదీ లేదు!
తప్పులు తడకలతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు
స్థలాలు, హద్దులు చూపించకుండానే హడావుడి!
చదును చేయని లేఅవుట్లు ఎన్నో!
సర్వే, ప్లాట్ల నంబర్ల నమోదులో పొరపాట్లు!
అజీర్తి రోగికి ఆకలి ఎక్కువన్నట్లు... జగన్కు ప్రచారంపై మక్కువ.. ‘కాలనీలు కాదు ఊళ్లు కడుతున్నాం’ అని చెప్పిన జగన్..
వాగులూ వంకల్లో.. కొండలూ గుట్టల్లో..ఇళ్ల స్థలాలు ఇచ్చారు... వాటినైనా సవ్యంగా అప్పగించారా అంటే అదీ లేదు!
అవి ఎక్కడున్నాయో చూపడం లేదు..చూపిన వాటికీ దారీతెన్నూ లేదు.. ఆ మాత్రం దానికే..తన ఫొటో ముద్రించిన ఉత్తుత్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చి‘ఇళ్లు నిర్మించేశాం.. ఊళ్లు కట్టించేశాం..’ అని బాకా ఊదుతున్నారు!
ఇంటి పట్టాల ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లతో పేదల్ని అయోమయానికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కన్వీనియన్స్ డీడ్ రూపంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రచార యావతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అసలు కన్వీనియన్స్ డీడ్ పేరుతో రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే తొలిసారి. ఈ హడావుడి ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడిచినా రకరకాల సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న నిర్ణయం ప్రకారం పట్టా కేటాయించిన పదేళ్ల తర్వాతే లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అయినా కన్వీనియన్స్ డీడ్లతో ఏదో ఉపయోగం ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల పేరుతో లబ్ధిదారులను ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఈ క్రమంలో గతంలో దొర్లిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పట్టాల్లో పేర్లు, సర్వే నంబరు, ప్లాట్ నంబరు, స్థలం హద్దులు తప్పుగా నమోదవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పొలాలు, చెరువులు, కొండగట్లలో లేఅవుట్లు వేసి, పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. మొదట పట్టాలిచ్చి, తర్వాత సీఎం ఫొటోతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పేరిట ప్రచారం చేసుకుంటోంది. చదును చేయనందున చాలా జిల్లాల్లో లేఅవుట్లలో పిచ్చిమొక్కలు మొలిచాయి. చాలాచోట్ల స్థలాలు అనువుగా లేకపోవడం, దూరంలో ఉన్నందున లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. వారి అభ్యర్థనలపై పునఃపరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.
సర్వే నంబరు తప్పుతో నిలిచిన రిజిస్ట్రేషన్లు!
ప్రకాశం జిల్లా పొదిలిలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచింది. జిల్లాలోనే ఒకేచోట ఎక్కువ మంది పేదలకు పట్టాలిచ్చిన లేఅవుట్గా ఉన్న సర్వే నంబరు 1177లోని ప్లాట్ నంబర్లకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. అయితే.. సర్వే నంబర్లు 1195, 1193గా ఆన్లైన్లో గతంలోనే నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్ చేస్తే పట్టా పొందిన వ్యక్తి స్థలం మరో నంబరులోకి మారిపోతోంది. దీంతో ఇక్కడ రిజిస్ట్రేషన్లను నిలిపేశారు. మండలంలో 2,350 మందికిగాను ఇప్పటివరకు సుమారు 400 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
- ఏలూరు మండలం మాదేపల్లిలో ఏడు గ్రామాలకు చెందిన 754 మందికి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ప్లాట్ల విభజన జరగకుండా, పూర్తిగా భూమి చదును చేయకుండా పట్టాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలోని కొండగట్టులో 255 మంది అర్బన్ లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తూ లేఅవుట్ వేశారు. అయితే ఇక్కడ విద్యుత్తు స్తంభాలు వేసి, నీళ్ల ట్యాంకులు పెట్టి వదిలేశారు. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించలేదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంత యలమంచిలిలో 23 మందికి ఓ శ్మశానవాటికని ఆనుకుని స్థలాలు కేటాయించారు. అవి వద్దని లబ్ధిదారులు ఇటీవల ఆందోళనకు దిగారు.
- చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో 904 పట్టాలకుగాను 400 వరకు వివిధ కారణాలతో ఆన్లైన్లో తిరస్కరణకు గురయ్యాయి.
- కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 2019 సంవత్సరంలో రెండు విడతల్లో దాదాపు 4000 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటి వరకూ ఎవరికీ స్థలాలు చూపించలేదు. మూడేళ్ల కిందట కేటాయించిన స్థలాలు ఎలా ఉన్నాయో... ఇప్పుడూ అలాగే ఉన్నాయి. చదును చేసి, లేఅవుట్గా విభజించి, సరిహద్దులు ఏర్పాటు చేసి, స్థలాలు కేటాయిస్తామన్న నేతలు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. సరిహద్దు రాళ్లు వేయకుండానే రిజిస్ట్రేషన్లకు రావాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు.
- కాకినాడ నియోజకవర్గంలో 2,500 మంది పేదలకు పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదు. భూసేకరణ జరిగినా లేఅవుట్లు సిద్ధం చేయలేదు. ఇక్కడ పట్టాలు పొందినవారికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు లేవు.
- కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికీడులో 155 మందికి, కె.సీతారాంపురంలో 321 మందికి రెండేళ్ల కిందట పట్టాలు పంపిణీ చేశారు. ఈ రెండుచోట్ల లేఅవుట్లలో స్థలాలు విభజించి, లబ్ధిదారులకు పొజిషన్ చూపించలేదు. తాజా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ రెండు గ్రామాలకు మినహాయింపు ఇచ్చారు.
- గన్నవరం నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాల్లో 25,699 మందికి పట్టాలు ఇచ్చినా 15,549 మందికి మాత్రమే స్థలాలు చూపించారు. చాలా గ్రామాల్లో ఇంకా భూసేకరణ జరగలేదు. వేరే గ్రామాల్లో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది.
- పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 2,400 మంది లబ్ధిదారులకు పది కిలోమీటర్ల దూరంలోని లేఅవుట్లలో స్థలాలు ఇచ్చారు. ఆయా లేఅవుట్లలో ఇప్పటివరకు సరిగా చదును చేయలేదు. కానీ రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. మరోవైపు కొందరి పేదల ఇంటి స్థలాలను పలువురు వైకాపా నేతలు ఇప్పటికే కొనేస్తున్నారు.
దూరంగా స్థలాలిచ్చిన వారికి...
లబ్ధిదారుల్లో కొందరికి వారి నివాస ప్రాంతాలకు 15-20 కి.మీ. దూరంలో స్థలాలిచ్చారు. ఏ గ్రామంలో స్థలాలు ఇచ్చారో.. ఆ గ్రామ సచివాలయ అధికారితోపాటు లబ్ధిదారు రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ వేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇదో పెద్ద సమస్యగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామీణ మండలంలోని వి.కె.రాయపురం ముంపు ప్రాంతంలో... అదీ 6కి.మీ. దూరంలో చిన్నపాటి వర్షానికే మునిగిపోయే పొలాల మధ్య కొన్న స్థలాలు తమకొద్దని.. వేరేచోట ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. స్థలాలు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు.
‘సర్వర్’ సహకరించక...!
ఒక్కో సచివాలయ పరిధిలో రోజూ 50 పట్టాల రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యం పెట్టుకున్నా.. చాలాచోట్ల కనీసం 20 కూడా పూర్తవడం లేదు. ప్రకాశం జిల్లాలో 51,060 పట్టాల పంపిణీ జరగ్గా గడిచిన రెండు వారాల్లో 24,471 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 54 వేలకు గాను మూడోవంతు రిజిస్ట్రేషన్లే జరిగాయి. ఇతర జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. లబ్ధిదారుల్లో 90% మంది దినసరి కూలీలే. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో కూలి డబ్బులు పోగొట్టుకుని మరీ నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ కారణంగా కొందరు లబ్ధిదారులు రిజిస్ట్రేషన్లకు రావడమే లేదు. సర్వర్ మొరాయిస్తుండటంతో కొన్నిచోట్ల ఒక్కో పట్టా రిజిస్ట్రేషన్కు గంట సమయం పడుతోంది. కొన్ని సచివాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో లబ్ధిదారులు అప్పటి వరకు నిరీక్షిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించడంతో సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను రిజిస్ట్రేషన్లకు రావాలని బతిమాలుకోవాల్సిన పరిస్థితి.
పదేళ్ల తరువాతే అమ్ముకోవాలి!
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా.. పదేళ్ల తరువాతే లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. పట్టా ఇచ్చిన 24 నెలల్లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి. పట్టాల పంపిణీ జరిగి 24 నెలలు ఇప్పటికే గడిచినా.. చాలాచోట్ల నిర్మాణాలు జరగలేదు. ప్రస్తుతం ‘కన్వీనియన్స్ డీడ్’ పేరుతో జరుగుతోన్న రిజిస్ట్రేషన్లవల్ల లబ్ధిదారులకు అదనంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ వైకాపా ప్రభుత్వం ప్రచారం కోసం విలువైన సమయాన్ని, మానవ వనరులను వృథా చేస్తోంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!