అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ సతీసమేతంగా శుక్రవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి స్వాగతం పలికారు.

Updated : 24 Feb 2024 06:04 IST

సింహాచలం, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ సతీసమేతంగా శుక్రవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని