జగన్ వెడలె.. జనం గుండెలదరగ...!
‘‘రాజువెడలె రవితేజములలరగ’’ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు.
‘‘రాజువెడలె రవితేజములలరగ’’ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు. ‘‘జగన్ వెడలె జనం గుండెలదరగ’’ అన్నట్లుగా అడుగు బయటపెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువులు. గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి పాదంమోపిన ప్రతిచోటా ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. విద్యార్థులు ఆగమయ్యారు. తన పర్యటనలకోసం జనజీవనాన్ని స్తంభింపజేయడం- జగన్మోహన్రెడ్డి నియంతృత్వానికి నిలువుటద్దం. ఇక రాజకీయ సభలకోసం పచ్చని చెట్లు, పంట పొలాలు, కాల్వలను నాశనం చేయించడమైతే- నిస్సందేహంగా జగన్ పైత్యమే!
కూల్చివేతలు, నరికివేతలు... క్షతగాత్రులతో కకావికలమైనది ....యుద్ధక్షేత్రం! చెట్ల నరికివేతలు... కట్టడాల కూల్చివేతలు.. పంట కాలువ మూసివేతలు.. పరీక్షల వాయిదాలు... బలవంతపు రవాణాలు... ఇదీ- జగన్ సిద్ధ క్షేత్రం! ఆయన వస్తున్నాడంటే మనుషులే కాదు... చెట్టూ పుట్టా, రోడ్లూ, కాలువలూ... అన్నీ అదురుతున్నాయి. మౌనంగా రోదిస్తున్నాయి!
అడ్డగోలు పనులన్నింటికీ ‘సిద్ధం’
అకాల వర్షాలో వరదలో ముంచెత్తినప్పుడు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తుంటారు. జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తారు. కానీ, ఒక రాజకీయ సభకోసం పరీక్ష తేదీని హఠాత్తుగా మార్చిపారేయడం అంటే- అది హద్దులెరగని అధికార దుర్వినియోగం. అంతకుమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జగన్ వికార వ్యక్తిత్వానికి నిదర్శనం. తన బురదజల్లుడు ఉపన్యాసాలు, అసత్య విన్యాసాల ప్రదర్శనకుగాను జగన్కు జనం కావాలి. జిల్లాల నుంచి వారిని సభావేదికల దగ్గరికి తరలించడానికి బస్సులు పెట్టాలి. అందుకుగానూ విద్యాలయాలను మూసేయించాలి. ఆ రోజు పరీక్షలు ఏమైనా ఉంటే- వాటినీ ఆపేయాలి. మొన్న మూడో తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ‘సిద్ధం’ సభకోసం ఇంటర్ పరీక్షను అలాగే వాయిదా వేశారు. అయిదు లక్షల మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. జనాన్ని లోకువగా జమకట్టే జగన్కు ఇది అలవాటైన పాత రోత పనే!
పిచ్చి ముదిరి...
ప్రజాస్వామ్య దేశంలో వీఐపీల పేరిట కొంతమందికి రాచమర్యాదలు చేయడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఛీత్కరించింది. అసహ్యకరమైనదిగా ‘సుప్రీం’ అభివర్ణించిన ఆ వీఐపీ సంస్కృతిని జగన్ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. తన పర్యటనలప్పుడు భద్రత పేరిట పట్టణాలూ నగరాల దిగ్బంధనాన్ని ఆయన ఓ ఆనవాయితీగా మార్చారు. ముఖ్యమంత్రికి తగిన విధంగా రక్షణ కల్పించడాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు. కానీ, అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల ముందు నుంచే షాప్లను మూసేయించడం, బ్యారికేడ్లు పాతి జనం రాకపోకలను అడ్డుకోవడం, ప్రతిపక్షాలూ ప్రజాసంఘాల నేతలను గృహనిర్బంధం చేయించడం వంటివి కచ్చితంగా కిరాతక పాలకుడి దుర్లక్షణాలే.
- పదిహేను నెలల క్రితం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్లారు జగన్. ఆ రోజు ఉదయం నుంచే ఆ పట్టణంలోకి వచ్చే అయిదు రోడ్లనూ పోలీసులు మూసేశారు. ఎక్కడి వారిని అక్కడే కట్టిపడేసినట్లు పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు.
- మదనపల్లెలో జగన్ పర్యటన సందర్భంగా టమాటా మార్కెట్ యార్డును మూసేసి రైతుల పొట్టకొట్టారు. యార్డును పార్కింగ్ ప్రదేశంగా మార్చేశారు. స్థానిక దుకాణాలకూ తాళాలేయించారు.
- జగన్ నర్సీపట్నం వెళ్లినప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేశారు. సీఎం భద్రతకోసం ముందస్తు జాగ్రత్త అంట అది! కరెంట్ ఉంటే జగన్కు వచ్చే ప్రమాదమేముంటుంది... పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం కాకపోతే!
- రాజమహేంద్రవరంలో అయ్యవారి రోడ్ షో కోసం కొట్లను కట్టేయించి వ్యాపారుల నోట్లో మట్టికొట్టారు. కుప్పంలోనేమో రోడ్లు తవ్వి బ్యారికేడ్లు బిగించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, సామర్లకోట, అమలాపురం, తిరువూరు, గుంటూరు, నెల్లూరు జిల్లా సంగం, అనంతపురం జిల్లా నార్పాల, తిరుపతి, నగిరి, చిత్తూరు... ఇలా అన్ని చోట్లా జగన్ పర్యటనలు స్థానికులను నరకయాతనలకు గురిచేశాయి. జగన్ సభలకు జనాన్ని తరలించడానికి వందల సంఖ్యలో బస్సులను వినియోగిస్తుంటారు. ఆ సమయంలో పిల్లాజెల్లాతో బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు గాస్తూ ఆర్టీసీ ప్రయాణికులు అనుభవించే కష్టాలైతే చెప్పనలవి కానివి!
‘కంస మామ’
నిరుడు అనంతపురం జిల్లాలో జగన్ సభకోసం స్థానిక జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షలను వాయిదా వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కామర్స్, న్యాయ, అనుబంధ కళాశాలల్లో సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ను అలాగే ఆపేశారు. విద్యార్థులను సీఎం కార్యక్రమానికి తరలించారు. జగన్ పార్టీ ప్లీనరీకోసమని చెప్పి నాగార్జునా విశ్వవిద్యాలయంలోనూ పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల కోసం పిల్లలు రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటారు. అవి హఠాత్తుగా వాయిదా పడితే- వారు అనుభవించే మానసిక క్షోభ అంతాఇంతా కాదు. తన పనికిమాలిన రాజకీయాలకోసం విద్యార్థులను విపరీతమైన ఒత్తిడికి గురిచేసిన జగన్ను ‘కంస మామ’ అని తిట్టుకుంటున్నారు అందరూ!
హెలికాప్టర్లో జగన్... రోడ్లన్నీ బంద్!
వీఐపీల రాకపోకల పేరిట ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టేయడం సబబు కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. అయిదు పది నిమిషాలకు మించి ట్రాఫిక్ ఆపొద్దని పోలీసులకు సూచించింది. జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో సాటిలేని ప్రజాకంటకులైన ఏపీ ఖాకీలకు ఇటువంటి పట్టింపులేమీ లేవు. వైకాపా అధినేత అడుగులకు మడుగులొత్తుతూ వారు చేసిన తలకుమాసిన పనులకు లెక్కేలేదు. విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్ పర్యటన కోసమని అక్కడికి 135 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆపేశారు. తాను హెలికాప్టర్లో వెళ్తుంటే కింద రోడ్లన్నీ నిర్మానుష్యం కావాలనుకునే అధికార అహంభావం జగన్ది! అవసరానికి మించి హెలీపాడ్లను నిర్మించి ప్రజాధనాన్ని మట్టిపాలు చేయడం వంటివీ ఆయన ఏలుబడిలో పరిపాటి అయ్యాయి.
చెట్లను కూల్చిన చరిత్రహీనుడు
విద్వేష మనస్కులు, హింసోన్మాదుల్లో అత్యధికులు వ్యక్తిగతంగా భయస్తులు. జగన్మోహన్రెడ్డిది కూడా అదే బాపతు. అందుకే ప్రాణవాయువును అందించే చెట్లను చూసినా ఆయన వెన్నులో వణుకుపుడుతుంది. రాజ్యాధినేతగా రహదారుల పక్కన మొక్కలు నాటించిన అశోకుడు చరిత్రలో నిలిచిపోయాడు. నడమంత్రపు అధికార కిరీటం పెట్టుకున్న జగన్- తాను అడుగుపెట్టిన ప్రతిచోటా పచ్చటి చెట్లను కొట్టేయించి చరిత్రహీనుడయ్యారు. అసలు ఇంతకూ చెట్లకూ భద్రతకూ లంకె ఏమిటో... దేశంలో మరే ముఖ్యమంత్రికి, ఆఖరికి రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు కూడా లేని సమస్య జగన్కు ఎందుకో ఎవరికీ తెలియదు.
సామాజిక ఆస్తుల విధ్వంసం
ప్రచార సభలు నిర్వహించే మైదానాల్లో పిచ్చి మొక్కలు, రాళ్లు వంటివి ఉంటే తొలగించడం మామూలే. అంతటితో ఊరుకుంటే అది జగన్ పార్టీ ఎందుకు అవుతుంది. వైకాపా అధినేత ఆత్మస్తుతులకోసం అవసరమైతే పొలాలను పాడుచేయడానికి కూడా వెనకాడరు. దెందులూరు జగన్ సభ ఏర్పాట్లలో భాగంగా చుట్టుపక్కల మినప పంటను నాశనం చేశారు. సభాస్థలికి సమీపంలోని ఓ కాల్వను పూడ్చేశారు. కొద్ది నెలల క్రితం నూజివీడులో కూడా అలాగే జగన్కోసం ఓ పంట కాల్వను మట్టితో నింపేశారు. సీఎం కాన్వాయ్కు అడ్డు వస్తోందని చెప్పి అక్కడి మామిడి పరిశోధనా కేంద్రం ప్రహరీని కూల్చేశారు. అమలాపురంలోనూ అంతే. జగన్ సభ ఏర్పాట్లలో భాగంగా బాలయోగి స్టేడియం ప్రహరీని కూలగొట్టారు. ఒట్టి డబ్బు దండగ పనులు తప్ప వీటిలో ప్రజాప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అసలు? ప్రజలకు, సామాజిక ఆస్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించడం సర్కారీ బాధ్యత అన్న కనీస ఇంగితం జగన్ ప్రభుత్వంలో కొరవడింది. సీఎంకు స్వాగతం పలికేందుకు మండుటెండలో బడి పిల్లలను రోడ్డు పక్కన నిల్చోబెట్టడం వంటి పిచ్చి పనులతోనూ జగన్ జమానా పరువుమాసింది.
పరదాల మధ్యలో జగ్గరాజు!
ప్రజానాయకులు ఎవరైనా జనాన్ని నేరుగా కలుస్తారు. వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్ ఆ పని ఎప్పుడైనా చేశారా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఆయన సభలూ సమావేశాల్లో భారీయెత్తున బారికేడ్లు పాతేసి సామాన్యులను అల్లంత దూరంలో నిలబెట్టేస్తుంటారు. ఆఖరికి సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ పర్యటించినప్పుడూ అలాగే చేశారు. యుద్ధం, సిద్ధం అంటూ వీర ప్రగల్భాలు పలికే జగన్కు జాగృత జనవాహిని అంటే భయం. అందుకే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడూ స్థానికులకు తీవ్ర నిర్బంధం తప్పలేదు.
పరదాల మధ్యలో రాకపోకలు- సామాన్యుల ఆందోళనలను పట్టించుకోవడానికి ఇష్టపడని జగన్ నిజ నైజానికి తార్కాణాలు. నలుపు నారాయణ స్వరూపం అంటారు కానీ, ఆ రంగు చూస్తే జగన్కు తన పాలనపై పెల్లుబుకుతున్న జనాగ్రహం గుర్తొస్తుందేమో! నరసాపురంలో ఆయన నిర్వహించిన సభకు నల్లబట్టల్లోని వారిని అనుమతించలేదు. నల్ల చున్నీలు ధరించిన యువతులను వాటిని తీసేసి లోపలికి వెళ్లమన్నారంటే ఏమనుకోవాలి? బాధ్యత కలిగిన సీఎంగా జనహితాన్ని, రాష్ట్రాభివృద్ధిని జగన్ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ, మందీమార్బలంతో హంగూ ఆర్భాటాలతో పర్యటనలు చేస్తూ- కరకు ఆంక్షలతో జనజీవనాన్ని పెను ఇక్కట్ల పాల్జేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు