ఎయిమ్స్పైనా జగన్ అక్కసు
ఎయిమ్స్.. దేశంలోనే అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తారు.
శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించకుండా కక్ష సాధింపు
సమీపంలోనే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్వహణ
నేడు జాతికి అంకితం చేయనున్నప్రధాని మోదీ
ఈనాడు, అమరావతి: ఎయిమ్స్.. దేశంలోనే అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తారు. సీఎం జగన్ మాత్రం వసతులు కల్పించట్లేదు సరికదా.. వాటికి అడుగడుగునా మోకాలడ్డుతున్నారు. అధికారం చేపట్టి అయిదేళ్లవుతున్నా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక ఆ సంస్థే.. తమ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటోంది. బహుశా దేశంలో ఏ ప్రఖ్యాత సంస్థా ఇంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొని ఉండదేమో. దీనికితోడు ఎయిమ్స్ ప్రవేశద్వారాన్ని ఆనుకుని 10 ఎకరాల విస్తీర్ణంలో జగన్ ప్రభుత్వం డంపింగ్యార్డు ఏర్పాటు చేసింది. తాడేపల్లి మంగళగిరి పట్టణాల్లో పోగయ్యే చెత్తను తెచ్చి ఇక్కడ పారబోసింది. రోజూ చెత్తకు నిప్పంటిస్తూ.. ఆ పొగతో రోగులు, వైద్యులు ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. చివరికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆసుపత్రికి చేరుకోవడానికి సరిపడా ఆర్టీసీ బస్సులు నడపకుండా తన అక్కసు ప్రదర్శిస్తోంది. ఈ సంస్థ తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రావడం, అందులోనూ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో జగన్ దీనిపై కక్ష సాధిస్తున్నారు.
మూడున్నరేళ్లు కాలయాపన చేసి..
గత తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి వద్ద రూ.1,618 కోట్ల వ్యయంతో 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)ను ఏర్పాటు చేసింది. 2019 మార్చి నుంచి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ అవసరాల కోసం రోజుకు 2.5 మెగాలీటర్ల నీరు(ఎంఎల్డీ) కావాలి. గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువుకు నీళ్లు మళ్లించి.. అక్కడి నుంచి అయిదున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి వరకూ పైపులైన్లు వేసి నీరు సరఫరా చేయాలనేది ప్రణాళిక. 2019 ఎన్నికల్లో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాటు తాగునీటి సదుపాయం కల్పించే పనులు చేపట్టలేదు. ఆ తరువాత ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో 2022 డిసెంబర్లో రూ.8 కోట్లతో పనులు ప్రారంభించింది. ఇప్పటికే రెండుసార్లు నిర్దేశిత గడువు దాటినా పనులు పూర్తికాలేదు.
అత్యవసర సేవల విభాగానికి స్థలం కేటాయించని జగన్
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోగయ్యే చెత్తను ఎయిమ్స్ సమీపంలోని 10 ఎకరాల్లో డంపింగ్ చేసేవారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావటంతో గత కొన్నాళ్లుగా అక్కడ చెత్త వేయట్లేదు. ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే అత్యవసర సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని నిర్మిస్తామంటూ ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయినా జగన్ సర్కార్ ఆ స్థలాన్ని అప్పగించడం లేదు.
సరిపడా ఆర్టీసీ బస్సులు నడపట్లేదు
గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఎయిమ్స్కు చేరుకునేందుకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. శని, ఆదివారాల్లో సర్వీసులను మరింతగా తగ్గిస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్న రోజుల్లో సర్వీసులన్నీ రద్దు చేస్తున్నారు. చాలా మంది వడ్డేశ్వరం వద్ద బస్సు దిగి అక్కడి నుంచి ఆటోల్లో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పేద రోగులకు ఈ రవాణా ఛార్జీలు భారమవుతున్నాయి.
రాజ్కోట్ నుంచి వర్చువల్గా
మంగళగిరి ఎయిమ్స్ను ప్రధాని ఆదివారం గుజరాత్లోని రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు కడప, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం ప్రభుత్వ బోధన ఆసుపత్రులతో పాటు తెనాలి, హిందూపురం జిల్లా ఆసుపత్రుల్లో రూ.230 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో స్టేట్ ఫుడ్ల్యాబ్ క్యాంపస్లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రో బయాలజీ టెస్టింగ్ ల్యాబ్ను, రూ.2.07 కోట్ల విలువైన నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లనూ ప్రారంభించనున్నారు.
రూ.3 లక్షలు చెల్లించలేరా?
- వడ్డేశ్వరం కూడలి నుంచి ఎయిమ్స్ వరకూ గతంలోనే రహదారి నిర్మించారు. దీనికి సంబంధించి కటింగ్ ఛార్జీల కింద జాతీయ రహదారి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లిస్తేనే కొండను తొలచి తాగునీటి పైపులైన్ వేసుకోవటానికి పర్యావరణ అనుమతులు లభించనున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
- ఎయిమ్స్కు తాగునీటి సదుపాయం కల్పన కోసం కొద్దిపాటి సివిల్ పనులు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవటంతో గుత్తేదారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాదాపు రూ.2 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
- రోగులు, వారి సహాయకులు సీసాల్లో తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఎయిమ్స్ కూడా అయిదేళ్లుగా ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటుంది. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేయాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట