సర్కారువారి విషపు ‘సుక్క’
మామూలుగానైతే... మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకుల ధనదాహం.. విషాల రసాయనం.. వెరసి గుల్లవుతున్న పేదల దేహం.. కాలేయాలు చెడిపోయి.. నాలుకలు ఎండిపోయి.. కడుపులు మంటెక్కిపోయి.. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితం.. కుటుంబాలు కకావికలం.. జె బ్రాండ్లలో హానికర అవశేషాలున్నాయని తేలినా.. వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు.. ఆయనకేమో కట్టలకొద్దీ డబ్బులు.. పేదల ఇళ్లలో చావుడప్పులు!
అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న జె బ్రాండ్ మద్యం
చిన్న చిన్న సమస్యలతో మొదలై.. కాలేయాన్నే తినేస్తున్న మందు
పేద కుటుంబాలతో జగన్ చెలగాటం
ఎవరిని కదిపినా.. కన్నీటి గాథలే..
‘ఈనాడు’, ‘న్యూస్టుడే యంత్రాంగం’ రాష్ట్ర వ్యాప్త సర్వేలో వెల్లడి
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే యంత్రాంగం
మామూలుగానైతే... మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకుల ధనదాహం.. విషాల రసాయనం.. వెరసి గుల్లవుతున్న పేదల దేహం.. కాలేయాలు చెడిపోయి.. నాలుకలు ఎండిపోయి.. కడుపులు మంటెక్కిపోయి.. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితం.. కుటుంబాలు కకావికలం.. జె బ్రాండ్లలో హానికర అవశేషాలున్నాయని తేలినా.. వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు.. ఆయనకేమో కట్టలకొద్దీ డబ్బులు.. పేదల ఇళ్లలో చావుడప్పులు!
ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా విషమని తెలిసీ కొనుక్కుంటారా? ప్రాణాంతకమని తెలిసినా.. రోజువారీ సంపాదనలో సగానికి పైగా సొమ్ము దాని కోసమే తగలేస్తారా?
మేము మాత్రం ‘జగన్ అమ్ముతున్న’ ఆ విషాన్నే కొంటున్నాం.. చావును కొనితెచ్చుకుంటున్నామని ఏపీలో మద్యం తాగే వారు చెబుతున్నారు. రోజువారీ ఆదాయంలో సగానికి పైగా మద్యానికే అవుతుందని,
ప్రభుత్వానికి డబ్బులిచ్చి మరీ బలిపీఠంపైకి ఎక్కుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలవాటు మానుకోలేక.. నాణ్యమైన మద్యం దొరక్క.. ‘జగన్ అమ్మే మందు’ తాగుతున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో మద్యం తాగే అలవాటున్న పలువురిని ‘ఈనాడు’, ‘న్యూస్టుడే’ ప్రతినిధులు పలకరించగా వెలిబుచ్చిన అభిప్రాయాలివీ..
‘రాష్ట్రంలో ఇప్పుడు లభిస్తున్న మందంతా నాసిదే. ఈ మద్యం వల్ల తెలిసిన వారు చాలామంది నా కళ్లముందే చనిపోయారు’ అని విశాఖ గంగవరానికి చెందిన ఓ మత్స్యకారుడు చెప్పారు.
‘వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం నాసిరకమైంది. దీని బారిన పడి మా గ్రామంలో చిన్న వయసులోనే అనేక మంది మృతిచెందారు. ఇలాంటి మందు అమ్మకాలను ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది’ అని విజయనగరం జిల్లా ముంజేరుకు చెందిన ఒకరు అన్నారు.
నిద్ర పట్టదు.. కడుపులో మంట తగ్గదు
- ‘ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు. కడుపులో మంట వస్తోంది. నోరంతా ఎండిపోతోంది. నాసిరకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతింది. ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతున్నా’ అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు.
- ‘నాసిరకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి, గుండె దడ వస్తోంది. వైద్యులేమో విశ్రాంతి తీసుకోమన్నారు. గతంలో రోజంతా పనిచేసుకుని, రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్లీ పనికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నాం’ అని గుంటూరు మిర్చియార్డులో కూలీగా పనిచేసే ఓ వ్యక్తి వివరించారు.
ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా
కొన్నేళ్లుగా మద్యం తాగుతున్నా, ఏ సమస్యా రాలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక నాసిరకం మందును తీసుకొచ్చారు. ఆ ప్రభావంతో కాలేయం దెబ్బతింది. తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
రాము, అల్లూరి సీతారామరాజు జిల్లా
కాలేయం దెబ్బతిందన్నారు
రెండు నెలల కిందట విపరీతంగా కడుపులో మంట వచ్చింది. వైద్యులు పరీక్షించి.. మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతిందన్నారు.
రిక్షా కార్మికుడు, ఏలూరు
ప్రతిపక్షాల కుట్ర అంటూ కొట్టిపడేసిన జగన్
రాష్ట్ర మద్యంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తొలి నుంచీ సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయినా సరే.. జగన్ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసింది. చెన్నై ల్యాబ్ నివేదికపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మద్యం ఆదాయాన్ని తగ్గించేందుకు ప్రతిపక్షాలు కుట్రకు తెరలేపాయనీ.. సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకోవాలనేదే ఉద్దేశమంటూ అడ్డగోలుగా వాదించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో తరచూ తాగే అలవాటున్న వారి అభిప్రాయాలను విశ్లేషిస్తే.. వైకాపా సర్కారు అమ్ముతున్న మద్యంపై వస్తున్న ఫిర్యాదులు, అనుమానాలు, సందేహాలు నిజమేనని స్పష్టమవుతోంది.
అంతకుముందెన్నడూ లేనిది..
మద్యం ‘స్లో పాయిజన్’లా తమ ఊపిరి తీసేస్తోందనీ, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటోందనీ, ఉన్నట్టుండి ఆయాసంగా అనిపిస్తోందనీ.. ఇలా రకరకాల దుష్ప్రభావాలను ఏకరవు పెడుతున్నారు. కొందరైతే చర్మం కందిపోతూ.. కళ్లు ఎరుపెక్కిపోతున్నాయంటున్నారు. ఇంకొందరు.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటోందని, మూర్ఛతో పడిపోతున్నామని వాపోతున్నారు. అసలేం జరుగుతోందో తెలిసేలోగానే కాలేయం, క్లోమ గ్రంథి (పాంక్రియాస్) దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నామంటూ మరికొందరు ఆందోళనగా చెబుతున్నారు. చాలా ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. అంతకు ముందెన్నడూ ఆరోగ్య సమస్యలు లేవనీ.. స్పిరిట్లో రంగు, ఇతర ఫ్లేవర్లు కలుపుతుండటంతో నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
విష రసాయనాలు ఉన్నట్లు అప్పుడే వెలుగులోకి..
రాష్ట్రంలో విక్రయిస్తున్న పలు రకాల బ్రాండ్ల మద్య నమూనాలను తెదేపా నేతలు సేకరించి.. చెన్నైలో పరీక్షలు చేయించారు. వాటిల్లో పైరోగలాల్, ఐసోపులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఆ పరీక్ష ఫలితాలను 2022 జూన్ నెలలో బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యంలో బెంజోక్వినోన్, స్కోపారోన్, పైరోగలాల్, వొల్కొనిన్, కాప్రోనల్యాక్టమ్ తదితర రసాయనాలు ఉన్నట్లు 2022 మార్చి నెలలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేయించిన పరీక్షల్లో తేలింది. ఈ వివరాలతో ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారాయన. ఈ రసాయనాలు కలిసిన మద్యం ‘స్లో పాయిజన్’తో సమానమని అందులో పేర్కొన్నారు.
నీళ్లూ హానికరమేనంటూ ప్రభుత్వ వాదన
ప్రధానమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా వాదించింది. నీళ్లూ మనిషికి హానికరమేననీ, కొబ్బరి నీళ్లు సైతం వినియోగానికి పనికిరావంటూ వ్యంగ్యంగా స్పందించింది. అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గుంటూరులోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాల కెమికల్ ఎగ్జామినర్ విలేకరులతో మాట్లాడుతూ.. అత్యధిక రెజల్యూషన్ కలిగిన మాస్ స్పెక్టోమెట్రీపై ఆర్బీట్రాప్ పద్ధతి ద్వారా విశ్లేషిస్తే నీళ్లు కూడా మనుషులకు హానికరమేననీ, అందులోనూ చిన్న చిన్న మలినాలు కనిపిస్తాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం