అంతా తూచ్.. ఉద్యమం లేదు
అంతా తూచ్.. ఉద్యమం లేదట! వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి.
మినిట్స్లో హామీ ఇచ్చారట.. ‘చలో విజయవాడ’ను వాయిదా వేశారట
ఉద్యమాన్ని మధ్యలో వదిలేయడంపై మండిపడుతున్న ఉద్యోగులు
సామాజిక మాధ్యమాల్లో బండి శ్రీనివాసరావుపై విమర్శలు
ఈనాడు, అమరావతి: అంతా తూచ్.. ఉద్యమం లేదట! వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఏపీ ఐకాస తరఫున ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సమయంలోనే ‘మాకు నమ్మకం లేదు దొర’ అంటూ ట్రోల్ చేశారు. మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ విమర్శలు సంధించారు. ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విచిత్రమేమిటంటే ఒక్క డిమాండ్పైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా మినిట్స్లోపెట్టినందుకు ఈ నెల 27న జరగాల్సిన ‘చలో విజయవాడ’ను వాయిదా వేస్తున్నట్లు బండి శ్రీనివాసరావు ప్రకటించడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయాన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘం(యూటీఎఫ్), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) ఖండించాయి. ఏపీ ఐకాసలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తూతూమంత్రంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించి వాయిదా వేశారని విమర్శిస్తున్నాయి. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడైన బండి ఈ నెలలో పదవీవిరమణ పొందనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో ఏ ఒక్క హామీ లభించకపోయినా ‘చలో విజయవాడ’ను రద్దు చేయడమంటే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లోని చైతన్యాన్ని నీరుగార్చడమేనని ఏపీటీఎఫ్ పేర్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీ ఐకాస ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా సాధించకుండానే వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ ప్రకటించింది.
ముందుగా లీక్ చేసి..
‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉండదని ఏపీ ఐకాస కీలక నేత మంత్రివర్గ ఉప సంఘం చర్చలకు ముందే తనకు సన్నిహితంగా ఉండే నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమం అనుమతి కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ను కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని, కనీసం లేఖనే ఇవ్వలేదని చెబుతున్నారు. మరోపక్క ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపీ ఐకాస తరఫున పోస్టర్లు, కరపత్రాలను జిల్లాలకు పంపించాల్సి ఉండగా.. వాటిని సక్రమంగా సరఫరా చేయలేదు. దీన్ని వాయిదా వేసేందుకే ఆ నాయకుడు ముందు నుంచి ఇలాంటి వ్యవహారాలు చేసినట్లు విమర్శలున్నాయి. ప్రభుత్వ సలహాదారుతో శనివారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
రూ.250 కోట్లే చెల్లించినా
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21 వేల కోట్లు ఉంటే కేవలం రూ.250 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటి వరకు 12వ పీఆర్సీ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోగా..9మంది సభ్యులను ఇప్పుడు నియమించింది. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. మధ్యంతర భృతి ఇవ్వకుండా జులైలో పీఆర్సీ ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటినుంచో చెబుతోంది. సెప్టెంబరు 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ అమలు చేస్తామని చర్చల్లో చెబుతూనే అమలు చేయడం లేదు. గతంలో పెన్షనర్లకు ఉన్న అదనపు క్వాంటం పెన్షన్ను పీఆర్సీ సమయంలో జగన్ సర్కారు తీసేసింది. ఇప్పుడు దాన్ని ఇస్తామని మాత్రమే చెప్పింది.
వీటిపై ప్రభుత్వం మినిట్స్ ఇవ్వడంతో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఐకాస ప్రకటించింది. ఏ ఒక్క సమస్యకూ స్పష్టమైన హామీ లేకపోయినా మధ్యలోనే ఉద్యమాన్ని వదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మరణించిన ఎయిడెడ్, స్థానిక సంస్థలకు చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఎంతో కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, డేటా సేకరిస్తున్నామని మాత్రమే మినిట్స్లో ప్రభుత్వం పేర్కొంది. సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు మరో 15రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికీ డేటా సేకరిస్తుంటే ఏం ప్రయోజనం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగులను వంచించడమే..
‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలూ పొందకుండా, ఐకాస పేర్కొన్న 20 డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా ‘చలో విజయవాడ’ను వాయిదా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఉద్యమాన్ని నిలిపివేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను వంచించడమే. కాలయాపన చేయడం తప్ప ఒక్క ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులకు కల్పించలేదు.
చెన్నుపాటి మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్
అంతా బూటకమే..
జీపీఎఫ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి బకాయిలు రూ.20 వేల కోట్లు చెల్లించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మినిట్స్ జారీ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. మధ్యంతర భృతి ఇవ్వకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పడం బూటకం. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నందున ఉద్యమం చేయాల్సిన సమయంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యమాన్ని వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోరాటాన్ని కొనసాగించాలి’
వెంకటేశ్వర్లు, ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూటీఎఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి