కడప జైల్లో రూ. కోట్ల బేరం!
ఇప్పటికే లెక్కలేనన్ని మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ ఇది. ఈ కేసుకు సంబంధించి కడప జైల్లో ‘కోట్ల విలువైన’ కథే నడిచిందా? తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి సంబంధించి ‘అప్రూవర్’ షేక్ దస్తగిరి సరికొత్త విషయాలు బయటపెట్టారు.
‘కొట్టి అప్రూవర్గా మార్చినట్లు’ చెప్పాలని భారీ ఆఫర్
అడ్వాన్సుగా రూ. 20 కోట్లు వెంటనే ఇస్తామన్నారు
శివశంకర్రెడ్డి కుమారుడు జైలుకు వచ్చి మరీ చెప్పారు
వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వెల్లడి
పులివెందులలో జగన్పై పోటీ చేస్తానని ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: ఇప్పటికే లెక్కలేనన్ని మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ ఇది. ఈ కేసుకు సంబంధించి కడప జైల్లో ‘కోట్ల విలువైన’ కథే నడిచిందా? తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి సంబంధించి ‘అప్రూవర్’ షేక్ దస్తగిరి సరికొత్త విషయాలు బయటపెట్టారు. ‘వివేకా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్సింగ్ నిన్ను కొట్టి, బెదిరించి అప్రూవర్గా మార్చారని కోర్టుకు చెబితే నీకు కోట్ల రూపాయలిస్తాం. అడ్వాన్సుగా వెంటనే రూ. 20 కోట్లు చెల్లిస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి తనను ప్రలోభ పెట్టారని షేక్ దస్తగిరి వెల్లడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన ఖైదీలకు వైద్య పరీక్షల పేరుతో కడప జైల్లోకి వచ్చి తనను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ‘వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి కూడా.. సీబీఐ ఎస్పీ రామ్సింగ్ తనను కొట్టి, ఒత్తిడి చేసి వాంగ్మూలం ఇప్పించుకున్నారంటూ ప్రకటించారు. నువ్వూ అలాగే చెబితే మొత్తం కేసే వీగిపోతుంది. అందరూ జైలు నుంచి బయటకొచ్చేస్తారు’ అని చైతన్యరెడ్డి చెప్పారని దస్తగిరి వివరించారు. వివేకా కేసులో హైదరాబాద్లోని సీబీఐ ప్రధాన న్యాయస్థానం ఎదుట మంగళవారం దస్తగిరి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీల్ గురించి వెల్లడించారు. ఏ రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. తనను కొనేందుకు, ప్రలోభపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారో.. అదే రాజకీయంలోకి తాను దిగుతానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల్లో జగన్పై పోటీ చేసి ఆయన్ను ఢీకొంటానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
జగన్కు జనం ఓట్లేసే పరిస్థితి లేదు
‘‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివేకా హత్య కేసు తీవ్ర ప్రభావం చూపుతోంది. అది తనకు నష్టం కలిగిస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ కేసు వల్ల జగన్కు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. అందుకే నన్ను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించి ఇటీవల కొన్ని నెలల పాటు కడప జైల్లో నిర్బంధించారు. అప్పుడే డాక్టర్ చైతన్యరెడ్డి నన్ను కలిసి ప్రలోభ పెట్టారు. అప్రూవర్గా మారినందున నన్ను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వైఎస్మనోహర్రెడ్డి బెదిరిస్తున్నారు. నా భార్య, పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారు.
రక్షణ కల్పించాలని రేవంత్రెడ్డికి విన్నపం
జగన్ ప్రభుత్వం నాపై అక్రమంగా కిడ్నాప్ కేసు పెట్టి అరెస్టు చేసింది. నాకు 2+2 గార్డులు, 2+2 గన్మెన్లు, 5+5 ఎస్కార్టు ఉంది. నిరంతరం వారు నాతో పాటే ఉంటారు. వారికి తెలియకుండా నేనెలా కిడ్నాప్ చేస్తాను? నా భద్రతా సిబ్బందిని బెదిరించి నాకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. వీటన్నింటికీ జగన్మోహన్రెడ్డే కారణం. వీటిపైనా సీబీఐకి ఫిర్యాదు చేశాను. జగన్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. నాకు భద్రత కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇప్పటికే ఒకసారి కోరాను. మరోసారి విన్నవిస్తున్నా. నాకు భద్రత కల్పించాలని న్యాయస్థానంలో కూడా పిటిషన్ దాఖలు చేశా’’ అని దస్తగిరి చెప్పారు.
కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: వివేకా హత్య కేసులో 8వ నిందితుడైన కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులైన టి.గంగిరెడ్డి, యాదాటి సునీల్యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, వై.ఎస్.భాస్కర్రెడ్డిలను జైలు నుంచే హాజరుపరిచారు. సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేశ్బాబు వారి రిమాండ్ను మార్చి 12 వరకూ పొడిగించారు. ఈ కేసులో దస్తగిరిపై జారీ అయిన నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను ఉపసంహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక