ఈ అరాచకం అనంతం!
ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసం, పరిహారం చెల్లించకుండా జగన్ ప్రభుత్వం వారి బతుకులతో చెలగాటమాడుతోంది.
ఓడిస్తారనే భయంతో ఓట్లను మార్చేశారు
పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ
నేరపూరిత కుట్రకు తెరలేపిన అధికార పార్టీ ‘అరాచక శక్తి’
రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలోకి 2,400 ఓట్లు
పాత్రధారులుగా మారిన అధికారులు
పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా మార్చేస్తారంటూ బాధితుల ప్రశ్న రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ‘ఈనాడు-ఈటీవీ’తో నిర్వాసితుల ఆవేదన
ఈనాడు-రాజమహేంద్రవరం, అమరావతి
న్యూస్టుడే-దేవీపట్నం, గోకవరం
ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసం, పరిహారం చెల్లించకుండా జగన్ ప్రభుత్వం వారి బతుకులతో చెలగాటమాడుతోంది. రాష్ట్రం కోసం ఇళ్లూ, వాకిళ్లు, ఆస్తులు, భూములు త్యాగం చేసినా వారిని ఆదుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ నిర్వాసితులంతా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి తమ ఆగ్రహాన్ని చూపిస్తారని భయపడ్డ అధికార పార్టీ కీలక నాయకుడు నేరపూరిత కుట్రకు తెరలేపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలకు చెందిన 2,400 మందికి పైగా గిరిజనేతర నిర్వాసితుల ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పించేశారు. ఓటర్లకు తెలియకుండా, వారికి కనీస సమాచారం లేకుండా ఈ అక్రమానికి తెగబడ్డారు. రంపచోడవరంలో ‘అరాచక శక్తి’గా వ్యవహరిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధి ఈ దందాకు సూత్రధారి కాగా ఆయన ఆదేశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు పాత్రధారులయ్యారు. వేలమంది ఓట్లు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తుంటే క్షేత్రస్థాయి అధికారులు తమకేమీ తెలీదంటూ తప్పించుకుంటున్నారు.
ఆ రెండు గ్రామాల్లోనే అత్యధికంగా..
దేవీపట్నం మండలం పరిధిలో పోలవరం ముంపు గ్రామాలైన కొండమొదలు నుంచి గంగంపాలెం వరకూ మొత్తం 18 ఊళ్లలోని గిరిజనేతరులైన 1,067 కుటుంబాలకు గోకవరం మండలం (జగ్గంపేట నియోజకవర్గం) కృష్ణునిపాలెంలో పునరావాసం కల్పించారు. వీరిలో చాలామందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. వారిలో 17 గ్రామాలకు చెందిన ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ జాబితాలోనే కొనసాగిస్తున్న అధికారులు.. తొయ్యేరు గ్రామ ఓటర్లను మాత్రం జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం మండలంలోకి మార్చేశారు. దేవీపట్నానికి చెందిన నిర్వాసితులకు ఇప్పటివరకూ ఎక్కడా పునరావాసమే కల్పించలేదు. దీంతో వారంతా రెండేళ్లుగా వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరందరి ఓట్లు సైతం.. వారికెలాంటి సంబంధమూ లేని కృష్ణునిపాలెం జాబితాలో చేర్చేశారు. దేవీపట్నంలో గతంలో వారు నివసించిన ఇంటి నంబర్లనే చిరునామాల్లో పేర్కొని జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్చేశారు. ఈ ఓట్ల బదలాయింపు వెనక రాజకీయ కుట్ర ఉందని బాధితులు చెబుతున్నారు. దేవీపట్నం మండలంలో అత్యధిక ఓట్లు దేవీపట్నం, తొయ్యేరులలోనే ఉన్నాయి. ఆ ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో లేకుండా చేసేస్తే తమకు రాజకీయంగా ఇబ్బంది ఉండదనే దురుద్దేశంతోనే అధికార పార్టీ ‘అరాచక శక్తి’ ఈ కుట్రకు పాల్పడ్డారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలియకుండా ఓట్లు మార్చేయడం మోసం కాదా?
నిర్వాసితులకు పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల్లో) పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే వారు ఆ ప్రాంతానికిచెందినవారనేననినిరూపించే ఆధారాలు ఉండాలి. అన్నిరకాల ఆధారాలున్నా సరే ఇప్పటికే కొంతమందిని ప్యాకేజీకి అనర్హులుగా తేల్చేశారు. ఇలాంటి నేపథ్యంలో పునరావాసం, పరిహారం ఇంకా చెల్లించకుండానే.. ఓట్లను వేరే జిల్లా పరిధిలోని నియోజకవర్గంలోకి మార్చేయడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారంలో చొరవ చూపని అధికారులు, నాయకులు తమకు తెలియకుండా ఓట్లు మార్చేయడం మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈనాడు-ఈటీవీ ఆంధ్రప్రదేశ్’తో వారు తమ ఆవేదనను పంచుకున్నారు.
ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవట్లేదు?
- తొయ్యేరు గ్రామస్థులు 2020 నుంచి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో నివసిస్తున్నందునే వారి ఓట్లు అక్కడికి మార్చామని, పోలవరం పరిహారానికి ఓట్ల మార్పిడికి సంబంధం లేదని రంపచోడవరం సబ్ కలెక్టర్, ఆ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) ఎస్.ప్రశాంత్కుమార్ ‘ఈనాడు’తో చెప్పారు. సరే ఆ ప్రాతిపదికతోనే ఓట్లు బదలాయించారనుకుంటే.. తొయ్యేరుతో పాటు మరో 17 గ్రామాలకు చెందిన కొందరు నిర్వాసితులు సైతం కృష్ణునిపాలెం పునరావాస కాలనీలోనే నివసిస్తున్నారు. మరి వారి ఓట్లు మాత్రం రంపచోడవరం నియోజకవర్గంలో ఎలా కొనసాగిస్తున్నారు? వాటిని ఎందుకు జగ్గంపేట నియోజకవర్గానికి మార్చలేదు? ఈ ప్రశ్న అడిగితే.. ఈఆర్వో నుంచి అసలు సమాధానమే ఇవ్వలేదు.
- దేవీపట్నం గ్రామ నిర్వాసితులకు ఇప్పటివరకూ ఇంకెక్కడా పునరావాసం కల్పించలేదు. వారు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అలాంటప్పుడు వారు కృష్ణునిపాలెంలో నివసిస్తున్నట్లు ఓటర్ల జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నిస్తే ఈఆర్వో ప్రశాంత్కుమార్ సమాధానమివ్వలేదు. దేవీపట్నంలో వారు నివసించిన ఇళ్లకు సంబంధించిన డోర్ నంబర్లను చిరునామాలుగా పేర్కొని.. కృష్ణునిపాలెంలో ఓట్లు చేర్చటం అక్రమం కాదా? అని అడిగినా స్పందించలేదు.
- నిర్వాసితుల ఓట్లతో ఇలా బంతాట ఆడుతూ.. అక్రమానికి తెగబడితే.. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టరు ఎందుకు స్పందించట్లేదు? నియోజకవర్గ ఈఆర్వోగా ఉన్న సబ్ కలెక్టర్ ఎందుకు బాధ్యత వహించట్లేదు? కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపట్లేదు? ఇవన్నీ ప్రశ్నలే!
పాత డోర్ నంబర్లతో..
కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో ఇప్పటివరకూ డోర్ నంబర్లే ఖరారు చేయలేదు. కానీ తొయ్యేరులో గతంలో మేం నివసించిన ఇళ్లకు సంబంధించిన డోర్ నంబర్లు వేసేసి మా ఓట్లు మాకు తెలియకుండా జగ్గంపేట నియోజకవర్గానికి బదిలీ చేసేశారు. మా గ్రామంలో 30 మంది నిర్వాసితులకు యువ ప్యాకేజీ, 100 మందికి ఇళ్లు రావాల్సి ఉంది. 70 మందికి ఇంకా పరిహారం అందలేదు. పునరావాస కాలనీల్లోని సమస్యలు గురించి పట్టించుకోని అధికారులు మా ఓట్లు మాత్రం మార్చేశారు.
శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు
రాజకీయ కుట్రతోనే మా ఓట్లు మార్చేశారు
-బుర్రి ఆనందరావు, దేవీపట్నం
దేవీపట్నం గ్రామానికి చెందిన 110 నిర్వాసితుల కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదు. రాజకీయ కుట్రలో భాగంగా మా అందరి ఓట్లను రంపచోడవరం నియోజకవర్గం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి మార్చేశారు. మాకు పునరావాసం, పరిహారం ప్యాకేజీలు దక్కనీయకుండా చేయాలనే దురుద్దేశంతో ఇలా చేశారు.
కృష్ణునిపాలెంలో ఇల్లు లేకున్నా ఓటిచ్చారు..
-గేదెల చినసుబ్బారావు, దేవీపట్నం
పోలవరం నిర్వాసితుడినైన నాకు ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. మా సోదరుడికి ఆర్ఆర్ ప్యాకేజీ అందలేదు. దేవీపట్నంలో 1-140 డోర్ నంబర్తో మా ఇల్లు ఉంది. నాకు కృష్ణునిపాలెంలో అసలు ఇల్లే లేకపోయినా సరే మా పాత డోర్ నంబర్తో అక్కడికి నా ఓటు మాత్రం బదిలీ చేసేశారు. నేను రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో అద్దెకు ఉంటున్నాను. మా ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టని అధికారులు.. ఎవరి ప్రొద్బలంతో మా ఓట్లు మార్చరో తేలాలి.
ఓట్ల బదిలీ చేయటం నేరం
- కుంజం రాజామణి, సర్పంచి, దేవీపట్నం
మా పంచాయతీ పరిధిలోని తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల్లోని నిర్వాసితుల ఓట్లను మరో జిల్లాలోని నియోజకవర్గంలోకి మార్చడం అన్యాయం. దేవీపట్నం నిర్వాసితులకు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేయకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా కృష్ణునిపాలెంలో ఉన్నట్లు ఓట్లు ఎలా బదలాయిస్తారు? అపరిష్కృతంగా ఉన్న పునరావాస సమస్యలు పరిష్కరించకుండా గ్రామసభలు పెట్టకుండా ఓట్లు బదిలీ చేయడం నేరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు