తీపి మాటలు చెప్పి.. పీల్చి పిప్పి!
ప్రభుత్వం ఏదైనా.. రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడుతుంది. సాగుకు ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంది.
చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టిన జగన్
చెరకు రైతులను ఆదుకోని వైకాపా సర్కారు
రూ.2 వేల కోట్ల ఆస్తుల ధారాదత్తానికి సిద్ధం
రూ.400 కోట్లు కేటాయిస్తే రైతులు, కార్మికులకు మేలు
ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం
ఈనాడు - అమరావతి
ప్రభుత్వం ఏదైనా.. రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడుతుంది. సాగుకు ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంది. అయితే జగన్ సర్కారు తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆయన సీఎం అయ్యాక.. రాష్ట్రంలోని చెరకు రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది. చెరకు సాగు ప్రశ్నార్థకమైంది. 2018-19వ సంవత్సరంలో 2.55 లక్షల ఎకరాల్లో చెరకు సాగు అయితే.. 2023-24వ సంవత్సరంలో సాగు 67 వేల ఎకరాలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంతో పోల్చితే ఐదేళ్ల వైకాపా పాలనా కాలంలో 74% సాగు విస్తీర్ణం తగ్గింది. అయినా.. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ బాకా ఊదుతున్న సీఎం జగన్ను ఏం అనాలి?
రూ.400 కోట్లు ఇస్తే.. సహకార రంగ పరిధిలోని చక్కెర కర్మాగారాలను పని చేయించొచ్చు. రైతులకు ఆదాయమూ కల్పించవచ్చు. అయితే దేశంలోనే ధనిక సీఎం అయిన జగన్కు ఇవేమీ పట్టవు కదా?! ఆదాయం వచ్చే మార్గాలే ఆయనకు ముఖ్యం కదా? అందుకే ఏకంగా రైతుల భవిష్యత్తునే అమ్మకానికి పెట్టారు. యంత్రాలు, భూములతో సహా మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఆరు చక్కెర కర్మాగారాలను.. అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. జగన్ దృష్టిలో రైతును ఆదుకోవడమంటే.. అమ్మేయడమేనేమో?
‘‘ఒక్క అవకాశం ఇవ్వండి.. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తా. రైతుల బతుకులు మారుస్తా’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నికలకు ముందు ఎన్నెన్నో తీపి కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారి భవిష్యత్తును నుజ్జునుజ్జు చేస్తున్నారు. తెరిపిస్తామన్న ఆరు కర్మాగారాల్లో ఒక్కటీ తెరవలేదు. పైగా.. వాటిని ఏకంగా అమ్మకానికి పెట్టింది ఘనత వహించిన జగన్ సర్కారు. అదీ చాలదన్నట్లు.. ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలకు తాళం వేసింది. మరో కర్మాగారం పరిస్థితి నేడో, రేపో అన్నట్లుగా తయారైంది. మరోవైపు వైకాపా పాలనలో చెరకు సాగు గణనీయంగా తగ్గింది. వెరసి.. ఐదేళ్ల పాలనలో వైకాపా చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది! రాష్ట్రంలో చెరకు సాగుకు ఉరి వేసింది. రైతులను పీల్చిపిప్పి చేసింది.
పనిచేస్తోంది ఒక్కటే..
సహకార రంగ పరిధిలో మొత్తం 10 చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది మూతపడ్డాయి. ప్రస్తుతం గోవాడ పరిశ్రమ ఒక్కటే పనిచేస్తోంది. మూతపడిన వాటిలో ఆరు పరిశ్రమలను పునరుద్ధరించి, రైతులను ఆదుకుంటామని చిత్తూరు, కడప, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రల్లో, ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు.
రూ.400 కోట్లతో పూర్వవైభవం
మూతపడిన ఆరు పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఒక్కో చక్కెర కర్మాగారానికి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు అవసరం. ఈ లెక్కన రూ.400 కోట్ల వరకు ఖర్చు పెడితే ఈ ఆరు కర్మాగారాలకు పూర్వవైభవం వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. వీటివల్ల రైతులకు ఆదాయం రావడంతోపాటు కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. అయితే, ‘రైతు భరోసా’ ఇస్తున్నాం కదా? చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటిద్వారా రైతులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడం ఎందుకు అనుకుందో ఏమో.. లిక్విడేషన్కు తెరతీసింది. కార్మికులు, అన్నదాతల ప్రయోజనాలకు గండికొడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న... కర్మాగారాలను తక్కువ ధరలకే ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి సిద్ధపడింది. 9,100 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఆరు కర్మాగారాల్లో 1,600 మందికి పైగా కార్మికులు ఉన్నారు. సుమారు 65 వేల మందికి పైగా రైతులు చెరకు పండించి వీటికి సరఫరా చేస్తున్నారు.
అమ్మకాలపై అన్నదాతల ఆగ్రహం
ఆరు చక్కెర పరిశ్రమలకు జాతీయ రహదారుల పక్కనే సుమారు 720 ఎకరాల భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుంది. వాటిలోని యంత్రాలు, ఇతర సామగ్రిని కలిపితే ఆరు కర్మాగారాల మొత్తం ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకు పైగానే. వీటికి ఉన్న అప్పులు రూ.550 కోట్లకు మించదు. అయితే ప్రభుత్వం వీటికి లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చక్కెర కర్మాగారాల ఆస్తులను అమ్మితే సహించేది లేదంటూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారాలను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు విక్రయించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని సర్కారును ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరాంధ్ర రైతుల నడ్డి విరిచేలా?
ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా రైతులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. వైకాపా పాలనలోనే చెరకు రైతులకు న్యాయం జరుగుతుందంటూ నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచారు జగన్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే నాలుగు పరిశ్రమలకు విరామం ప్రకటించారు. 2019-20వ సంవత్సరంలో అనకాపల్లి, విజయనగరం జిల్లా విజయరామ గజపతి కర్మాగారాలను, 2021-22లో ఏటికొప్పాక, పాయకరావుపేటలోని తాండవ పరిశ్రమలను మూసివేయించారు. ప్రస్తుతం చోడవరం(గోవాడ) చక్కెర కర్మాగారంలోనే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లోనూ గతంతో పోల్చితే క్రషింగ్ సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. 2018-19వ సంవత్సరంలో సుమారు 5 లక్షల టన్నుల క్రషింగ్ జరిగితే. అది ఇప్పుడు 2 లక్షల టన్నులకు పడిపోయింది.
ప్రోత్సాహం కరవు.. అడిగితే లాఠీల ప్రయోగం
చెరకు రైతులను ఆదుకుంటామన్న జగన్.. కనీసం సాగుకు ప్రోత్సాహం కూడా అందించలేదు. బకాయిలను చెల్లించాలని కోరినందుకు ఉత్తరాంధ్రలో పోలీసులు అన్నదాతలపై లాఠీలు ప్రయోగించి వారి నడుంవిరిచారు. ఇలాంటి ప్రతికూల పరిణామాల కారణంగా చెరకు రైతులు క్రమంగా సాగు నుంచి వైదొలగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్ల కిందట 88 వేల ఎకరాల్లో చెరకు సాగు అయింది. ఈ ఏడాది 22 వేల ఎకరాలకే పరిమితమైంది. చెరకు సాగులో రెండో స్థానంలో ఉండే చిత్తూరు జిల్లాలోనూ 56 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు తగ్గింది. విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ ఐదేళ్ల క్రితంతో పోల్చితే ఈ ఏడాది సగానికిపైగా సాగు విస్తీర్ణం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత