‘ప్రవాసీ’.. వైకాపా పాలనలో పరదేశీ!
ఎడారిలోని ఇసుక తిన్నెల్లో కాసులు పండించుకోవాలని పొరుగు దేశానికి వెళ్లిన వలసజీవి సీఎం జగన్ చేతిలో వాడిపోయాడు.
ప్రవాసాంధ్రుల భరోసా పట్టని జగన్
బీమా ప్రీమియం చెల్లింపునకు ససేమిరా
20 లక్షల మంది వలస జీవులపై ప్రభావం
వారి వాటా భరిస్తామంటూ... ఎన్నికల ముందు కొత్త నాటకం
ఈనాడు, అమరావతి
ఎడారిలోని ఇసుక తిన్నెల్లో కాసులు పండించుకోవాలని పొరుగు దేశానికి వెళ్లిన వలసజీవి సీఎం జగన్ చేతిలో వాడిపోయాడు. కొలువులు పట్టాలని ఉన్నత చదువుల కోసం విదేశాల బాటపట్టిన వారు జగన్ ఆడిన ఆటలో ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు ‘బీమా’ అని ధీమా ఇచ్చిన జగన్.. గెలవగానే గేలి చేశారు.. తమ వాటా బీమా సొమ్ము చెల్లించకుండా తొండిచేశారు! ప్రవాసాంధ్ర బీమా పథకానికి పాతరేశారు.. వలసజీవి బతుక్కు ‘భరోసా’ లేకుండా చేశారు!!
ఉపాధి కరవై పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వలసపోయిన పేద ప్రజలు, జీవితంలో స్థిరపడాలన్న ఆశయంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల వేటలో విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం కోసం గత తెదేపా ప్రభుత్వం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రవాసాంధ్రులు చెల్లించే ప్రీమియంలో సగం వరకు ప్రభుత్వమే భరించేది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రీమియం చెల్లింపు నుంచి తప్పుకొంది. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారులే (ప్రవాసాంధ్రులు) భరించాలని స్పష్టం చేసింది. తెదేపా ప్రవేశపెట్టిన ఈ పథకం ఉనికే లేకుండా చేయాలని ప్రయత్నించింది. వారి ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏముందనుకుందో.. ఇక్కడ ఉండకుండా ఓట్లు వేయని వారి గురించి పట్టించుకోవడం శుద్ధదండగ అనుకుందో తెలియదు గానీ.. ప్రవాసాంధ్రుల సంక్షేమాన్నే జగన్ సర్కారు పక్కన పెట్టేసింది.
ప్రయోజనాలు ఇలా..
- వైకాపా హయాంలో ఈ పథకం కింద కార్మికులు, ఉద్యోగులు రూ.550, విద్యార్థులు రూ.180 ప్రీమియం చెల్లించాలి.
- ప్రీమియం చెల్లించిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందిన రూ.10 లక్షల పరిహారం ఇస్తారు.
- ప్రమాదం వల్ల అస్వస్థతకు గురైతే ఆసుపత్రి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లిస్తారు
- అస్వస్థత కారణంగా పని, ఉద్యోగం చేయలేని, చదువు కొనసాగించలేని వారు స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమానఛార్జీ ఇస్తారు.
- పని, ఉద్యోగ సమయంలో కంపెనీలతో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే.. పరిష్కరించుకునేందుకు రూ.45 వేలు అందజేస్తారు.
- గర్భిణులకు ప్రసూతి ఖర్చుల కింద సాధారణమైతే రూ.35 వేలు, సిజేరియన్ అయితే రూ.50 వేలు ఇస్తారు.
- ఒకసారి ప్రీమియం చెల్లించి పేరును నమోదు చేసుకుంటే ఉద్యోగులకు మూడేళ్లు, విద్యార్థులకు ఏడాదిపాటు ఈ పథకం వర్తిస్తుంది.
నాలుగేళ్లలో 33,596 మందికే..
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే తెదేపా ప్రభుత్వం 16,713 మంది ప్రవాసాంధ్రులను నమోదు చేయించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. గత నాలుగున్నరేళ్లలో కేవలం 33,596 మందినే ఈ పథకం కింద చేర్పించింది. గత తెదేపా ప్రభుత్వం ఒక్క ఏడాదిలో నమోదు చేయించిన సంఖ్య ప్రకారమైనా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం 83 వేల ప్రవాసాంధ్రులనైనా ‘భరోసా’ కింద చేర్పించాల్సి ఉండేది.
అధికారంలోకి వచ్చీరాగానే..
గత తెదేపా ప్రభుత్వం 2018 మార్చిలో ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం కింద కార్మికులు, ఉద్యోగులు రూ.442, విద్యార్థులు రూ.177ను ప్రీమియంగా చెల్లించాల్సి ఉండేది. అందులో కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ప్రీమియం రూ.292.50(జీఎస్టీతో కలిపి), విద్యార్థుల ప్రీమియం రూ.99(జీఎస్టీతో సహా) రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. మిగిలిన మొత్తాన్ని కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు చెల్లించేలా పథకాన్ని రూపొందించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తన వాటాను నిర్దాక్షిణ్యంగా ఎత్తేసింది. అయితే, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త నాటకానికి తెరతీసింది. కార్మికులు, ఉద్యోగుల ప్రీమియంలో సగం వాటాను, విద్యార్థుల పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
ఎక్కువ వలసవెళ్లే వారిలో రెండో రాష్ట్రం
రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు దాదాపు 20 లక్షల మంది ఉంటారు. యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్, సౌదీ, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాల్లో 8 లక్షల వరకు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా తదితర దేశాల్లో 12 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఇతర దేశాలకు వెళుతున్న వారు కేరళ తర్వాత మన రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నారు. తాపీ మేస్త్రీ, ఇంటి పనులు, డ్రైవర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ తదితర పనులు చేసుకునే వారు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. ఇలాంటి వారికి ‘బీమా’ చాలా అవసరం. వారికి ప్రభుత్వం ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద తన వాటాను చెల్లించకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది.
ఆర్థికసాయంలోనూ క్రూరత్వమే..
విదేశాల్లో ఏటా 15 నుంచి 20 మంది ప్రవాసాంధ్రులు వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. సాధారణ మరణాలు 75-100 వరకు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ అధికారిక గణాంకా లే. సమాచారం అందని మరణాలు మరో 20-25% ఉండే అవకాశముంది. బీమా కింద నమోదు కానివారు గత నాలుగున్నరేళ్లలో 489 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో కనీసం 10% మంది ప్రమాదవశాత్తు మరణించి ఉంటారని అంచనా. వీరిని బీమా పథకంలో చేర్చని కారణంగా బాధిత కుటుంబాలు రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాయి. ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థికసాయం మాత్రమే అందింది. ఈ సాయం ఇవ్వడంలోనూ ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. విదేశాలకు వెళ్లి కనీసం నాలుగేళ్లు దాటిన వారికే ఈ పరిహారాన్ని పంపిణీ చేసింది. ప్రవాసాంధ్రులకు ప్రత్యేక బీమా పథకాన్ని దూరం చేసిన వైకాపా సర్కారు కనీసం ఆర్థికసాయం అందించడంలోనూ క్రూరంగా వ్యవహరిస్తోంది.
గడువు తీరాక కంటితుడుపు ప్రకటన
‘ప్రవాసాంధ్ర భరోసా’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ద్వారా ఓ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద గడువు గత జనవరి నెలతో ముగిసింది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఏదైనా బ్యాంకుతోగానీ, సంస్థతోగానీ ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆ గడువు ముగియక ముందో, గడువు ముగిసే చివరి రోజునో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలి. లేనిపక్షంలో మరో బ్యాంకు/సంస్థతో తిరిగి ఒప్పందం చేసుకోవాలి. వైకాపా సర్కారు మాత్రం గడువు ముగిశాక తీరిగ్గా.. ‘బ్యాంకుతో త్వరలో ఒప్పందం చేసుకుంటాం’ అంటూ ఏపీఎన్ఆర్టీఎస్తో ఓ కంటితుడుపు ప్రకటన ఇప్పించింది. అప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ కింద నమోదు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు