మేతన్నకు.. కనిపించడా నేతన్న!
చేనేతలను ప్రోత్సహించేందుకు తెదేపా ప్రభుత్వం ‘ఆదరణ’ పథకం కింద జాకార్డు మిషన్లు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అందించింది. వారి జీవితాలకు బాసటగా నిలిచింది. జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేశారు.
ఆదరణ కరవు!
చేనేతలను ప్రోత్సహించేందుకు తెదేపా ప్రభుత్వం ‘ఆదరణ’ పథకం కింద జాకార్డు మిషన్లు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అందించింది. వారి జీవితాలకు బాసటగా నిలిచింది. జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేశారు.
చెమటోడ్చి మగ్గం నేసే నేతన్న అంటే.. అధికార పీఠమెక్కిన జగనన్నకు చులకన!
ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి.. తీరా గెలిచాక.. ముఖం చాటేశారు.. రాయితీ ఊసే లేకుండా చేశారు..
అర్థం పర్థంలేని నిబంధనలతో పింఛను ఎగ్గొట్టేస్తున్నారు..
నేత కూలీలకైతే ఏ పథకమూ వర్తించదనేస్తున్నారు
మొత్తంగా చిత్తశుద్ధి లేని వైకాపా సర్కారు ఏలుబడిలో.. చేనేత కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు!
ముఖ్యమంత్రి జగన్ ఏలుబడిలో చేనేతలు కుదేలయ్యారు. బీసీలు వెన్నెముక కులాలంటూ పదే పదే ఊదరగొట్టే ఆయన, అదే వర్గానికి చెందిన నేత కార్మికులను మాత్రం అష్టకష్టాల పాలు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు చేనేతలకు హామీల వర్షం కురిపించారు. అధికార పీఠమెక్కగానే, వారికి ఆదరువే లేకుండా చేశారు. చేనేత సంఘాల సభ్యులు మొదలు, మాస్టర్ వీవర్స్ దగ్గర కూలీ మగ్గాలు నేసే వారి వరకు అందరికీ అష్టకష్టాలే. రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాలకు చెందిన దాదాపు 3.50 లక్షల మంది కార్మికులు వృత్తి రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వినేందుకుగానీ, వాటిని పరిష్కరించేందుకుగానీ ముందడుగు వేసిన సందర్భమే లేదు.
ముడిసరకు రాయితీకి చెల్లుచీటి..
ఒక చేనేత కార్మికుడు మగ్గంపై నేసేందుకు నెలకు గరిష్ఠంగా ఆరు కిలోల ముడిసరకు వినియోగించవచ్చు. ఆ ప్రాతిపదికన గత తెదేపా ప్రభుత్వం 2014-18 వరకు ఒక్కో కార్మికునికి నెలకు ఆరు కిలోలకుగాను కిలోపై రూ.200 చొప్పున రాయితీగా చెల్లించింది. ఆ ప్రకారం ఏడాదికి రూ.14,400 అందించింది. చేనేత కార్మికుల గుర్తింపునకు పట్టు, నూలు రాయితీ పుస్తకాలు అందించి వారికి రాయితీని వర్తింప చేసింది. ముడి సరుకుపై పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేతకు మరింత చేయూత ఇవ్వాలనే ఆలోచనతో 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచింది. అంటే ఏడాదికిగాను మగ్గం నేసే కార్మికునికి రూ.24 వేలు అందినట్టే. ప్రతిపక్షనేతగా జగన్ 2017లో ముడి సరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు కూడా! వారి ఓట్లు దండుకుని గెలిచిన తర్వాత మాత్రం తీసేశామని చెప్పకుండానే రాయితీ లేకుండా చేశారు.
పట్టించుకున్న పాపాన పోలేదు...
నూలుపై 5 శాతం, రంగులూ, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ ఉంది. ముడిసరకు ధర ప్రస్తుతం కిలో రూ.5,500 ఉంది. ఇదేకాకుండా డిజైన్ పంచింగ్ కార్డ్స్, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగింది. ఆ మేరకు చీరల ధరల్ని పెంచితే కొనుగోలుదారులు ముందుకురారనే ఆలోచనతో పెంచడం లేదు. కొంతమంది ఉత్పత్తి ధరకే చీరలను అమ్మేశారు కూడా. ధర్మవరం, మదనపల్లె, ఉప్పాడ, మంగళగిరి, ఎమ్మిగనూరు, చీరాల, కొడమూరులోని పట్టు చీరలు నేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా పట్టించుకోలేదు.
100 మగ్గాలుండే మాస్టర్ వీవర్స్కు రూ.24 వేల సాయం అందిస్తారట. కానీ ఆయన దగ్గర కూలీకి పనిచేసే కార్మికునికి మాత్రం సాయం వర్తించదట. అదేమంటే మ్యానిఫెస్టోలో సొంత మగ్గం ఉన్న వారికే సాయం అందిస్తామని చెప్పారట. దీన్ని సాకుగా చూపి వేల మంది అసలైన పేద చేనేత కార్మికులకు ఆర్థికసాయం అందించకుండా ఎగ్గొడుతున్నారు.
లెక్క తేల్చడం లేదు..
జగన్ 50 ఇళ్లకో వాలంటీర్ను పెట్టి కుటుంబాల సమస్త సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాంటిది మాస్టర్ వీవర్స్ దగ్గర ఎంత మంది కూలికి పనిచేస్తున్నారో గుర్తించడం కష్టమా? నేత పనుల్లో అల్లు పోయడం, రంగులు అద్దడం, వార్పింగ్, జరీపోయడం, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, డిజైనింగ్ పనులను అనుబంధ రంగాల వారు చేస్తారు. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరిలో సొంత మగ్గాలున్న 488 మందికి 5వ విడతలో నేతన్ననేస్తం సాయం అందించారు. వీరు కాకుండా మాస్టర్ వీవర్స్ మగ్గాల షెడ్లలో, సొసైటీల్లో నేసే 700 మందికి, ఇళ్లల్లో అద్దె మగ్గాలపై నేసే మిగతా వారికి పథకం వర్తించని పరిస్థితి. ఇక్కడ ఉప వృత్తుల మీద 5 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గద్వాల్ పట్టు చీరలు నేసే కార్మికులు 8,200 మంది ఉంటే నేతన్న నేస్తం సాయం అందించింది 1,800 మందికే. మిగతా 6,400 మంది మాస్టర్ వీవర్స్ దగ్గర కూలీ కింద మగ్గాలు నేసేవారే. వీరికి ప్రభుత్వం నుంచి నేతన్ననేస్తం కింద ఎలాంటి ఆదరువూ లేదు. ఇక్కడ అనుబంధ రంగాల వారు ఎనిమిది వేల మంది వరకు ఉంటారని అంచనా. మదనపల్లె పరిధిలో 2,904 మందికి నేతన్ననేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక్కడ అద్దె మగ్గాలు నేసే 1,500 మంది, అనుబంధ రంగాలకు చెందిన మరో 3 వేల మందికి మొండిచేయే.
చేనేత పింఛన్లకూ ఎసరు
ఏళ్లుగా అందుతున్న పింఛన్లకూ జగన్ ఎసరు పెట్టారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సామాజిక భద్రత పింఛన్లకు 6 దశల నిబంధనలు అమలు చేసింది. ఇవి చాలవన్నట్టు తాజాగా చేనేత పింఛన్ల మంజూరుకు అదనంగా రెండేళ్లపాటు జీఎస్టీ చెల్లింపులు, మాస్టర్ వీవర్స్ ఖాతా నుంచి కూలీ మగ్గాలు నేసే కార్మికుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా వేతనాల చెల్లింపులు ఉండాలనే నిబంధనలు తెచ్చింది.
కరోనా సమయంలోనూ కరుణించలేదు...
ప్రతి చేనేత కుటుంబానికి రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో 2017 అక్టోబరులో ప్రతిపక్షనేతగా జగన్ మాటిచ్చారు. కార్మికులకు ఇళ్లూ, మగ్గాలకు షెడ్లూ నిర్మిస్తామన్నారు. అయిదేళ్లుగా వడ్డీ లేని రుణం ఊసే ఎత్తలేదు. కరోనాతో వ్యాపారం కుదేలైన సందర్భంలో రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉండగా.. ఆ ఆలోచన కూడా చేయలేదు.
లెక్కలోకే తీసుకోవడం లేదు..
ధర్మవరంలో చేనేతలపై అధారపడి జీవిస్తున్న వారు 33 వేల మంది. కానీ గతేడాది జులైలో అక్కడ నేతన్ననేస్తం సాయం కేవలం 10 వేల మందికే అందింది. మిగతా 23 వేల మందిలో 15 వేల మంది కూలీకి మగ్గాలు నేస్తున్నారని, మిగిలిన 8 వేల మంది చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారని వారిని అసలు లెక్కలోకే తీసుకోలేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!