నా.. నీ.. ‘భేదం లేదు..’ సర్వం గుట్కాయ స్వాహా!
కబ్జాల నుంచి కాల్మనీ వరకు.. వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు.. గుట్కా నుంచి మట్కా వరకు.. అన్నింటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి.. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్!
భూముల నుంచి బియ్యం వరకూ అన్నీ బుక్కేశారు!
అధికారులకు వేధింపులు.. సామాన్యులకు బెదిరింపులు
నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోడ్డూ బాగు చేయలేదు
ఉమ్మడి కృష్ణాలో అడుగడుగునా ఆయన అరాచకమే
ఈనాడు, అమరావతి
కబ్జాల నుంచి కాల్మనీ వరకు.. వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు.. గుట్కా నుంచి మట్కా వరకు.. అన్నింటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి.. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్! ఎవరో గాడిదకు నల్లబెలూన్లు కట్టినా... కచ్చితంగా తననే అవమానించారని.. భుజాలు తడుముకునే మహాజ్ఞాని..! ఆయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు.. తన శాఖ మీద కూడా పట్టులేని విజ్ఞాని!! ఆయన గ్యాంగ్ వస్తే వ్యాపారులు.. ఆయన నోరు విప్పితే జనాలు.. జడుసుకోవాల్సిందే!
ఆయన మాట్లాడుతుంటే టీవీలో ‘బీప్’ శబ్దాలే ఎక్కువ.. ఆయన మాటలు అంత ‘కంపు’గా ఉంటాయి మరి.. ఇది ఆయన వ్యక్తిగతమే అయినా, ఆయనో ఓ ప్రజాప్రతినిధి కావడమే.. ప్రజల దౌర్భాగ్యం.
ఆయన నలుగురుకీ ఆదర్శం మాట అటుంచి పలువురిని దోచుకుని వెనకేసుకున్న తీరు ఎవరైనా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. కొన్నాళ్లు మంత్రిగానూ వ్యవహరించారు. ఒక్కసారీ ఆ శాఖను సమీక్షించిన దాఖలాలు లేవు. సన్నబియ్యం ఇస్తామని మాటమార్చిన వ్యక్తి. అదే అడిగితే.. బూతు పురాణం అందుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గానికి ఉన్న కీర్తిని దిగజార్చారనేది ప్రజాభిప్రాయం. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనుడు. యువతను చేరదీస్తున్నట్లు మేలి ముసుగు కప్పుకొని వారికి అన్ని రకాల చెడు వ్యసనాలను అంటగట్టి బానిసలను చేసుకోవడం ఆయనకు గుట్కాతో పెట్టిన విద్య. మంత్రి అయ్యాక ఒక్కటేంటి.. అనేక అక్రమాలూ, అరాచకాలతో రూ.కోట్లకు పడగలెత్తారు.
కంకరరాళ్ల దందా..!
ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో గ్రావెల్ అనుమతులు పొంది బినామీలకు అప్పగించారు. కొండలన్నీ బోడిగుండ్లు చేసేశారు. ఇదీ తన నియోజకవర్గంలో కాదు.. పక్క నియోజకవర్గంలో కావడం విశేషం. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మారే పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుడే అని మొత్తం అనుమతులు తనే తీసుకున్నారు. పలు సంస్థలకు గ్రావెల్ రవాణా చేశారు. రూ.కోట్లు పోగేశారు. పోలవరం కాలువ కట్టలను మాయం చేశారు. పట్టణ పరిధిలో టిడ్కో ఇళ్లకు మట్టి సరఫరా పేరుతో రూ.కోట్లు కుమ్మేశారు.
ఒక్క రోడ్డు వేయలేదు..!
ఇంత చేసీ తన నియోజకవర్గంలో ఒక్క రోడ్డయినా వేయలేకపోయారు. నియోజకవర్గ కేంద్రం నుంచి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉంటుంది. మరో రోడ్డుకు ఎన్డీబీ నిధులతో శంకుస్థాపన చేసినా.. దాన్నీ పూర్తి చేయించలేదు.
ఇనాం భూములకు ఎసరు..?
కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణానికి శివారున ఉన్న దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. వస్తే.. రూ.500 కోట్ల ఇనాం కొండ లేదంటే.. ఆయన భాషలో ఒక వెంట్రుక. వాటిని కొంతమందికి ఇనాంగా ఇచ్చినా.. తర్వాత రైత్వారీ పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారాయి. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇవి దేవాదాయ భూములుగానే ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారితో కలిసి దీని ఆక్రమణకు స్కెచ్ వేశారు. అంతా సిద్ధమైంది.. రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్ ఇవి దేవాదాయశాఖకు చెందిన భూములు కావని ఎన్వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ క్లియరెన్సు దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్లో పడింది. అప్పటికే నాటి మంత్రికి రూ.కోట్లు ముట్టాయంటున్నారు. ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి, ఇటీవల కంచెలు కూడా వేశారు.
- ఓ పట్టణ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల్లో కొంత భాగాన్ని కొందరు వ్యాపారులు కొన్నారు. దాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. అక్రమాల్ని సక్రమం చేసి కోట్లు అందుకున్నారు.
- ఆ పట్టణానికి సమీపంలోనే 8.64 ఎకరాల డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్ను ఈ ‘బీప్..’ ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. ఒక ప్రముఖ వ్యక్తి.. మరో వ్యక్తికి ‘పవర్ ఆఫ్ అటార్నీ’ జారీ చేశారు. ఆమేరకు కొంతమంది ఈ భూములను కొనుగోలు చేసుకుని సొసైటీ పేరుతో లేఅవుట్ వేసుకుని.. స్థలాలు పంపిణీ చేసుకున్నారు. అన్ని అనుమతులూ వచ్చాక.. విద్యుత్తు స్తంభాలు వేసే సమయంలో ‘గ్యాంగ్’ అడ్డుపడింది. దీంతో తాను పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికీ ఇవ్వలేదని మెలిక పెట్టి అసలు వ్యక్తి ఎదురు తిరిగారు. ఆయనకు ఈ నేత మద్దతుగా నిలిచారు. స్థలాన్ని తన అనుచరుల పేరుమీదకు మార్చుకుని స్వాధీనం చేసుకున్నారు.
- పట్టణంలో ఒక స్థిరాస్తి వ్యాపారి షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణం చేశారు. ఆయన భారీగా సంపాదించారు. తనకు అప్పు ఉన్నారని, దాన్ని చెల్లించాలని ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. దాన్ని రూ.కోట్లలో చూపారు. మరోవైపు అధికారులతో ఒత్తిడి పెంచారు. తట్టుకోలేక ఆ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్ కాంప్లెక్సు ఈ నేత స్వాధీనం చేసుకున్నారు.
- మంత్రిగా ఉన్నప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డిప్యుటేషన్పై ఒక జిల్లా అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి. ఇంకేముంది ధాన్యం కొనుగోలు పేరుతో రెండేళ్లు దండుకున్నారు. ఫలితంగా మంత్రికి ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చారు.
- ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 వరకు ధాన్యం మిల్లులు ఉంటాయి. అందరికీ సీఎంఆర్ కేటాయిస్తుంటారు. దీని రీసైక్లింగ్లో ఓ మిల్లరు ప్రసిద్ధి. దీంతో వారి నుంచి భారీగా విరాళం అందింది. అంతేకాదు.. నాడు మరో మంత్రితో కలిసి జిల్లా కేంద్రంలో ఒక గోదాము నిర్మించారు. దీన్ని గిడ్డంగుల సంస్థకు లీజుకు ఇచ్చి బియ్యం నిల్వ చేస్తుంటారు. గోదాము నిర్వహణ బాధ్యతను తమ చేతుల్లో ఉంచుకుని కాకినాడ పోర్టుకు పెద్దఎత్తున బియ్యం తరలిస్తున్నారనేది అధికారులు సైతం అంగీకరిస్తున్న సత్యం.
చీడపురుగులా మారి...
- గతంలో ఆ నియోజకవర్గానికి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి కేంద్రంలో సంక్రాంతికి గోవా తరహా క్యాసినో నిర్వహించారు. క్యాబరేలు, మందులూ, విందులకు కొదవే లేదు. పక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్నేహితుడు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు.
- పక్క మండలంలో సీఎం బామ్మర్దంటూ ఒక అనుచరుడిని తయారు చేశారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ భూములను 50 ఎకరాలు ఆక్రమించి చెరువులు తవ్వి లీజుకు ఇచ్చారు. దీనిలో చెరిసగం ఆదాయం.
- నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో చేపల చెరువులను తవ్వుతుంటే.. ఆర్ఐ అడ్డుకున్నారు. అంతే అతనిపై అనుచర గణం దాడి చేసి లంచాలు అడిగారని ఎదురు కేసు పెట్టింది.
- మరో అనుచరుడు ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోగా డబ్బు అడిగితే ఎదురు దాడికి దిగారు. కేసు పెడితే నీరు గార్చారు. కొంతమంది మహిళలు పక్క నియోజకవర్గంలో గాడిదకు నల్లబెలూన్లు కడితే.. తననే అవమానించారని పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టించారు.
యువతే లక్ష్యం..!
గ్రామానికో పది మందిని ఎంపికచేసి తన గ్యాంగులో చోటిచ్చి.. వారిని జల్సా రాయుళ్లలా మార్చడం.. ఎన్నికల సమయంలో ప్రయోగించడం.. ఈ ప్రజాప్రతినిధి పని. ప్రతిపక్షంపై దాడులు చేయించడం, అభిమాన సినీ హీరోల పుట్టినరోజు వేడుకలు స్వయంగా జరిపించడం.. వారికి ఫ్లెక్సీలు కట్టించడం ద్వారా యువతను ఆకట్టుకోవడంలో నేర్పరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం