ప్రత్తిపాటిపై కత్తికట్టారు!
రాష్ట్ర మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్బాబును పోలీసులు అరెస్టు చేశారు.
మాజీమంత్రి కుమారుడు శరత్ అరెస్టు
జీఎస్టీ ఎగవేశారంటూ ఆరోపణలు
పుల్లారావు సతీమణి సహా ఏడుగురిపై కేసు
కేంద్ర ఏజెన్సీ నోటీసు ఇస్తే.. జగన్ సర్కారు దూకుడు
ఎన్నికల వేళ ఇదో కుట్ర: తెదేపా ఆరోపణ
ఈనాడు - అమరావతి: రాష్ట్ర మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్బాబును పోలీసులు అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతకు, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విజయవాడ తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డీజీడీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్).. అవెక్సా కార్పొరేషన్లో తనిఖీలు చేసి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంటూ రూ. 16 కోట్లు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని 2022 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. ఆ సమయంలో అవెక్సా కార్పొరేషన్ తరఫున ఏపీలోని విజయనగరంలో ఏర్పాటైన బ్రాంచి ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కేంద్రం జారీ చేసిన నోటీసు ఆధారంగా రాష్ట్రంలోనూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ విచారణ నిర్వహించాలని మాచవరం పోలీసులకు రాష్ట్ర డీఆర్ఐ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కేంద్ర సంస్థ జారీ చేసిన నోటీసును జతచేశారు. కేంద్ర సంస్థ విచారణ జరుపుతుండగానే రాష్ట్ర అధికారులు దూకుడుగా వ్యవహరించి అరెస్టు వరకు వెళ్లడం ప్రభుత్వ రాజకీయ కుట్రను స్పష్టం చేస్తోందని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. సంస్థకు అదనపు డైరెక్టర్గా పట్టుమని రెండు నెలలు కూడా లేని శరత్ను ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్టు చేయడం ప్రభుత్వ దూకుడును స్పష్టం చేస్తోంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న సంస్థతో ఎటువంటి సంబంధం లేని శరత్ను అరెస్టు చేయడంతో జగన్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. పుల్లారావు కుమారుడు శరత్ను గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయం బయట అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.
అదనపు డైరెక్టరుగా 66 రోజులే..
నిర్మాణ పనులకు సంబంధించి బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ నుంచి అవెక్సా కార్పొరేషన్ సబ్కాంట్రాక్టులు పొందింది. 2017లో రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ ఎన్ 9 (ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు) రోడ్డు నిర్మాణ పనులను తీసుకుంది. దీంతో పాటు టాటా ప్రాజెక్టు నుంచి ఏపీ టిడ్కో ప్రాజెక్టు పనులు, ఎన్సీసీ లిమిటెడ్ నుంచి మిడ్ పెన్నా దక్షిణ కాలువ (అనంతపురం), సుధాకర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ నుంచి 800 హుద్హుద్ ఇళ్ల నిర్మాణం పనులు తీసుకుని చేపట్టింది. ఈ క్రమంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమంగా లబ్ధి పొందినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అవెక్సా కార్పొరేషన్కు శరత్ 2019 డిసెంబరు 9 నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు అదనపు డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలో జీఎస్టీ ఎగవేత జరిగిందన్న ఆరోపణలపై మాచవరం పోలీసుస్టేషన్లో ఫిబ్రవరి 25న కేసు నమోదైంది.
పుల్లారావు కుమారుడు శరత్తో పాటు కుర్రా జోగేశ్వరరావు (డైరెక్టర్), బొగ్గవరపు నాగమణి (అదనపు డైరెక్టర్), పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ (డైరెక్టర్), బొగ్గవరపు అంకమరావు (డైరెక్టర్), బొగ్గవరపు మార్కండేయులు (డైరెక్టర్), పి.భీమరాజు (అదనపు డైరెక్టర్)లను నిందితులుగా చేర్చారు. వీరిలో జోగేశ్వరరావు, నాగమణి మాత్రమే ప్రస్తుతం అవెక్సా సంస్థకు డైరెక్టర్, అదనపు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారందరికీ ప్రస్తుతం సంస్థతో ఎటువంటి సంబంధాలు లేకపోవడం గమనార్హం. 2009, 2011, 2015, 2019, 2020 సంవత్సరాల నుంచి వీరందరూ ఒక్కొక్కరుగా వైదొలిగారు. నిందితుల జాబితాలో పేర్కొన్న మార్కండేయులు కొన్నేళ్ల కిందటే మరణించారు.
దిల్లీ నుంచే శరత్ వేట మొదలు
హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు శరత్బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తీసుకువచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు దిల్లీ, హైదరాబాద్లలో మకాం వేశాయి. ఓ బృందం శరత్ను దిల్లీ నుంచే అనుసరించింది. ఆయన కదలికలను గమనిస్తూ హైదరాబాద్లోని బృందాన్ని అప్రమత్తం చేసింది. హైదరాబాద్కు విమానంలో వస్తున్నట్లు చెప్పడంతో.. ఓ బృందం శంషాబాద్ విమానాశ్రయం వద్ద కాపు కాసింది. బయటకు రాగానే అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చింది. శరత్ను విజయవాడలో పలుచోట్లకు మారుస్తూ విచారణ చేపట్టారు. టాస్క్ఫోర్స్ కార్యాలయం, కమాండ్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వన్టౌన్లో కరుడుగట్టిన నేరస్థులను విచారించే సీసీఎస్ ఇంటరాగేషన్ సెల్కు తరలించారు. శరత్ ఆచూకీ తెలియక పుల్లారావుతో పాటు, తెదేపా నేతలు ఆందోళన చెందారు.
కన్నీటిపర్యంతమైన పుల్లారావు
కుమారుడి అరెస్టు ఉదంతంపై ప్రత్తిపాటి పుల్లారావు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఉన్న నేతలు గద్దె రామ్మోహన్, పట్టాభి, దేవినేని ఉమా, తదితరులను చూసి పుల్లారావు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడిపై అక్రమంగా కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను నేతలు ఓదార్చి ధైర్యం చెప్పారు. శరత్ అరెస్టును తెదేపా నేతలు నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు ఖండించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు.
బోగస్ బిల్లులంటూ ఆరోపణలు
విజయవాడ పోలీసులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శరత్ అరెస్టుపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. అవెక్సా కార్పొరేషన్ సంస్థ.. 2017 నుంచి 2022 వరకు రాజధాని అమరావతి సీఆర్డీఏ పరిధిలో రోడ్లను నిర్మించకుండానే బినామీ కంపెనీల పేరుతో బోగస్ బిల్లులు సృష్టించారని ఆరోపించారు. రోడ్ల నిర్మాణానికి మెటీరియల్ను దిల్లీలో కొన్నట్లు బోగస్ బిల్లులతో ప్రభుత్వం నుంచి రూ. కోట్లలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా పొందినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్