దళితుల భూముల్లో వైకాపా పాగా
గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భూదాహానికి అంతే లేకుండా పోతోంది. ఆ ప్రజాప్రతినిధి దళితుల భూములను బినామీల పేరుతో కాజేసిన వ్యవహారం కలకలం రేపుతోంది.
రూ.15 కోట్ల విలువైన భూములు స్వాహా
బినామీ పేర్లతో చేజిక్కించుకున్న ప్రజాప్రతినిధి
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-పెదకాకాని, దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భూదాహానికి అంతే లేకుండా పోతోంది. ఆ ప్రజాప్రతినిధి దళితుల భూములను బినామీల పేరుతో కాజేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామంలో సర్వే నంబరు 56లో 22.38 ఎకరాల భూమి ఉంది. బ్రిటిష్ వారి హయాంలోనే ఈ భూమిని 55 మంది దళితులకు కేటాయించారు. ఈ పట్టాలను గ్రామానికి చెందిన నేత ఒకరు రద్దు చేయించారు. అనంతరం 1977లో అనుమర్లపూడికే చెందిన 9 మంది పేర్లతో డీకేటీ పట్టాలు మంజూరయ్యాయి. వీరిలో ఏడుగురు ఎస్సీలు, ఒకరు బీసీ, ఒక ఓసీ రైతు ఉన్నారు. ఈ క్రమంలో గతంలో పట్టాలు పొందిన 55 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీకేటీ పట్టాలు పొందిన 9 మంది రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ 55 మంది కేసులు కొనసాగిస్తూ వచ్చారు. 2022 జులైలో స్థానిక వైకాపా నేత ఒకరు 55 మందితో మాట్లాడి వివాదం పరిష్కరించుకుంటే అందరికీ డబ్బులు వస్తాయని నమ్మబలికారు.
దీంతో వారు కేసు ఉపసంహరించుకున్నారు. అనంతరం 9 మంది పట్టాదారులతో ప్రజాప్రతినిధి బినామీలు ప్రైవేటు ఒప్పందాలు చేసుకున్నారు. అప్పటికే ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. తాము అప్పట్లో మార్కెట్ విలువ చెల్లించినందున 22(ఎ) నుంచి తమ సర్వే నంబర్లను తొలగించాలని పట్టాదారులు దరఖాస్తు చేశారు. వారికి మద్దతుగా ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు, కొందరు దళిత రైతులు ఆందోళనలు చేయడంతో తాత్కాలికంగా ఆ పనిని పక్కన పెట్టేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉండి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించారు. వెంటనే ప్రజాప్రతినిధి తన బినామీలైన 8 మంది పేరుతో 17.55 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇద్దరు భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించకపోవడంతో వారి భూమి 4.83 ఎకరాలను మినహాయించారు. పెదకాకాని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తే విషయం బయటికి వస్తుందని దుగ్గిరాలలో రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ఒక ప్రముఖ ఆలయానికి ఛైర్మన్, ఆయన కుటుంబసభ్యుల పేర్లతో పాటు పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన ఇద్దరి పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో పట్టాదారులకు రూ.లక్షలు చెల్లించి రూ.15 కోట్ల విలువైన భూములు చేజిక్కించుకున్నారు.
ప్రణాళిక ప్రకారం చక్కబెట్టారు
అనుమర్లపూడిలో భూములను ప్రజాప్రతినిధికి కట్టబెట్టేందుకు అదే గ్రామానికి చెందిన నాయకులు, మండల ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారు. సదరు నేత తన వాటాగా రూ.లక్షల్లో కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై తహసీల్దార్ పెల్లూరి రత్నంను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు 20 ఏళ్లుగా 22(ఎ)లో ఉంటే వాటిని తొలగించాలని ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. దీని ఆధారంగా కలెక్టర్కు నివేదిక పంపామన్నారు. జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకొని అనుమర్లపూడి గ్రామంలోని భూమిని 22ఎ నుంచి తొలగించినట్లు చెప్పారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన
అనుమర్లపూడిలోని దళితుల భూములు దుగ్గిరాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుసుకున్న తెదేపా పెదకాకాని మండల నాయకులు గురువారం ఆ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తెదేపా మండల అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే దళితుల భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. పెదకాకాని శివాలయం ఛైర్మన్ అమ్మిశెట్టి శివశంకర్ కుటుంబసభ్యుల పేరుపై సుమారు 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల