వైఎస్‘ఆర్టీసీ’!
అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది.
సొంత ఆస్తిలా వైకాపా వినియోగం
రాప్తాడు ‘సిద్ధం’ సభకు 3 వేల బస్సులు.. తాడేపల్లిగూడెం ‘జెండా’ సభకు నో బస్
ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. పల్లె బస్సుకు బ్రేక్
అధికార పార్టీ సేవలో ఎండీ సహా అధికారులు
అద్దెలూ గట్టిగా అడగలేని దైన్యం
ముందే అద్దె చెల్లిస్తామన్నా.. ప్రతిపక్షాలకు ఒక్క బస్సూ ఇవ్వరు
ఈనాడు, అమరావతి
అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో త్వరలో జరిగే సభకు కూడా మొత్తం పది వేల బస్సులూ ఇచ్చేస్తాం, అవసరమైతే ఆర్టీసీకి సెలవులు ప్రకటించేందుకు ‘సిద్ధం’ అంటోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ‘జెండా’ సభకు 150 బస్సులు కావాలని, వాటికి ముందే సొమ్ము చెల్లిస్తామని చెప్పినా కూడా నో బస్! ప్రైవేటు వాహనాలు, పాఠశాల బస్సుల్నీ సిద్ధం సభకు తరలిస్తూ తరిస్తున్న రవాణా శాఖ.. ప్రతిపక్ష పార్టీల సభలకు వెళ్లే వాహనాలపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతోంది.
ఏపీఎస్ఆర్టీసీ కాస్తా.. వైఎస్ఆర్టీసీగా మారిపోయింది. వైకాపా ఇంటి సంస్థలా, జగన్ సొంత ఆస్తిలా తయారైంది. ప్రయాణికుల అవసరాల కంటే ముఖ్యమంత్రి సభలు, సమావేశాలకు బస్సులివ్వడమే ప్రాధాన్యంగా భావిస్తోంది. సీఎం సభ ఉందంటే ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం మానుకోవాల్సిందే. రాష్ట్రానికో రాజప్రాసాదం, బయటకెళ్లాలంటే వాహనాల వరుస, భద్రతకు ముప్పు పేరుతో రెండు హెలికాప్టర్లు సమకూర్చుకుని ఆకాశయానం చేసే జగన్.. సామాన్య జనానికి ఒకే ఒక్క ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సునూ అందకుండా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, వైకాపా బహిరంగ సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ప్రదర్శించుకునేందుకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు బస్సు ప్రయాణం మరింత దుర్లభంగా మారుతోంది. అవసరమైతే పెళ్లిళ్లకు కేటాయించిన వాటిని, పండగలకు పెట్టిన ప్రత్యేక బస్సుల్నీ అర్ధంతరంగా రద్దు చేసి మరీ సీఎం సభలకు మళ్లిస్తున్నారు. ఒక డిపోలో ఉండే మొత్తం బస్సుల్లో 80% వరకు తరలిస్తున్నారు. చివరకు తిరుమల ఘాట్ రోడ్డులో తిరిగే బస్సుల్నీ వదలడం లేదు. దీంతో ఆర్టీసీ బస్సునే నమ్ముకున్న బడిపిల్లలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం తమ భద్రతకు భరోసాగా భావించే మహిళలు, పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు, ఉపాధి బాటలో రోజూ పట్టణాలకు వెళ్లే కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పడం లేదు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హయాంలో.. ఎన్నడూ లేని అపఖ్యాతి
ఎండీ ద్వారకా తిరుమలరావు హయాంలో.. దేశంలో మరెక్కడా లేనంత అపఖ్యాతిని ఆర్టీసీ మూటగట్టుకుంటోంది. సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం అనే బాధ్యతను ఆర్టీసీ పూర్తిగా పక్కన పెట్టేసింంది. ‘వైకాపా సేవలో ఆర్టీసీ’ అనే కొత్త నినాదం ఆయన హయాంలో అమలవుతోంది. అధికార పార్టీ అడిగితే.. వందలు, వేలల్లో బస్సుల్ని జిల్లాలకు జిల్లాలు దాటించి వందల కిలోమీటర్లు పంపిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఎండీకి ఆ మాత్రం బాధ్యత లేదా? సీఎంఓ చెప్పిందని మొత్తం బస్సులిచ్చేస్తారా? గతంలో ఏ ఎండీ అయినా ఇంత ఏకపక్షంగా వ్యవహరించారా? ఆయనకు వైకాపా అంటే భయమా? భక్తా? ఆర్ఎం, డీఎంలే ఇచ్చేస్తున్నారని, అది నా పరిధిలోని విషయం కాదని చెప్పడానికి ఎండీ ఎందుకు? రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో వైకాపా సభలు పెట్టి ఒక్కో జిల్లాలో 500 బస్సులు ఇవ్వమంటే.. అన్నీ ఇచ్చేస్తారా? అధికార పార్టీ కోసం ప్రయాణికులకు సేవలు నిలిపేస్తారా? రెండు, మూడు రోజులపాటు డిపోలు మూసేస్తారా? ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి జీతాలిచ్చేది ప్రభుత్వమా? వైకాపానా?
70% బస్సులిచ్చేస్తే ప్రయాణికుల సంగతేంటి?
ఆర్టీసీకి ప్రయాణికులు, వారి సేవలే ముఖ్యం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకైతే కొన్ని బస్సులు ఇవ్వవచ్చు. రాజకీయ పార్టీల సభల కంటే ప్రయాణికుల అవసరాలకే ప్రాధాన్యమివ్వాలి. అయితే ఆర్టీసీ అందుకు విరుద్ధంగా డిపోలో ఉన్న బస్సుల్లో 70% నుంచి 80% బస్సులు వైకాపా సభలకు కేటాయించేస్తోంది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు డిపోలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 48 ఉండగా.. అందులో 40 బస్సుల్ని సీఎం సభకు కేటాయించడమే దీనికి నిదర్శనం. 2023 అక్టోబరులో దసరా పండగకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ద్వారా టికెట్లు కూడా అమ్మాక.. జగన్ పర్యటన పేరుతో రద్దు చేశారు.
‘సిద్ధం’కాదు.. ప్రయాణికులపై ‘యుద్ధం’
ఎన్నికల నేపథ్యంలో ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తున్న వైకాపా సామాన్య ప్రయాణికులకు బస్సుల్ని దూరం చేసి.. వారిపై యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు ఆర్టీసీ 13 జిల్లాల్లోని 78 డిపోల నుంచి సుమారు 3వేల బస్సులను కేటాయించింది.
- సంక్రాంతికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారిని పట్టించుకోకుండా.. జనవరి 20న విజయవాడ సభకు మొత్తం 2,069 బస్సులు వినియోగించారు.
- గతేడాది జులైలో రాజధాని ప్రాంతంలో సీఎం సభ సందర్భంగా 1,000 ఆర్టీసీ బస్సులు పంపారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపారు.
సీఎం సభ అంటే.. మూడు రోజులపాటు ప్రయాణాలు కష్టమే!
ఎక్కడైనా సీఎం సభ ఉందంటే.. రాష్ట్రంలోని సగం జిల్లాల ప్రయాణికులు మూడు రోజులపాటు ప్రయాణాలు మానుకోవాల్సిందే. సభ జరిగే రోజుతోపాటు ముందురోజు, తర్వాత రోజు అవి ఆ విధుల్లోనే ఉంటాయి. అనంతపురం జిల్లా రాప్తాడు సభకు 500 కి.మీ దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నుంచి బస్సులు కేటాయించడమే దీనికి ఉదాహరణ. దీంతో సరిపడా బస్సుల్లేక 40 మంది ప్రయాణికులు కూర్చోవాల్సిన బస్సులో 80 మందిని కుక్కేస్తున్నారు. అదే సమయంలో సీఎం సభకు నలుగురైదుగురితో వెళ్లే బస్సులు కనిపిస్తుంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలైతే.. ఆయా పథకాల లబ్ధిదారుల్ని తీసుకెళ్తే సరిపోతుంది.
వైకాపా అయితే మొత్తం సొమ్ము చెల్లించక్కర్లేదా?
ఏదైనా కార్యక్రమానికి అద్దెకు బస్సు తీసుకుంటే.. మొత్తం సొమ్ము ముందే చెల్లించాలి. నిరీక్షణకు అదనంగా డబ్బు కట్టాలి. దూరప్రాంతాల ప్రయాణమైతే కిలోమీటర్ల లెక్కన, దగ్గరయితే రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు. దూరాన్నిబట్టి కిలోమీటరుకు రూ.45 నుంచి రూ.52 వరకు వసూలు చేస్తారు. వైకాపా అద్దె మొత్తం ముందే చెల్లించకపోయినా బస్సులు పంపిస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభకు 3 వేల బస్సులకు రూ.8.9 కోట్ల అద్దె నిర్ణయించగా రూ.5.5 కోట్లు మాత్రమే చెల్లించారు. భీమిలి సభకు 850, దెందులూరు సభకు 1,350 బస్సులు వినియోగించగా ఇంకా రూ.30 లక్షల వరకు బకాయిలున్నాయి.
నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే ఇదా?
ఆర్టీసీ ప్రయాణికుల్లో అత్యధికం పేద, మధ్యతరగతి వర్గాలవారే. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణానికి వెళ్లాలన్నా పొద్దున్నే ఆర్టీసీ బస్సుల్నే ఆశ్రయిస్తారు. సమయానికి బస్సు అందుకోకపోతే.. బడికి వెళ్లలేమని విద్యార్థుల ఆందోళన అంతా ఇంతా కాదు. చిరుద్యోగులు, చిరువ్యాపారులు సహా ఎంతోమంది వీటిలోనే ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సు రాకపోతే ప్రయాణాలే మానుకోవాల్సిన పరిస్థితి అధిక శాతం పల్లెల్లో ఉంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని నమ్ముతారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రయాణికులకు ఇవే ఆధారం. కానీ వీరందరినీ ఇబ్బంది పెడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీలకు బస్సులివ్వకూడదనేది.. ఆర్టీసీ విధానమా?
అధికార పార్టీ సభలకే బస్సులిస్తామనేలా ఆర్టీసీ తయారైంది. గతేడాది డిసెంబరు 20న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే ‘యువగళం-నవశకం’ సభకు బస్సులు కావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ముందుగానే సొమ్ము చెల్లిస్తామన్నా.. ఒక్క బస్సూ ఇవ్వలేదు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన తెదేపా-జనసేన బహిరంగ సభకు 150 బస్సులు కావాలని కోరినా ఒక్క బస్సునూ కేటాయించలేదు. ‘అధికార వైకాపా సేవకే ఆర్టీసీ’ అనేందుకు ఇంతకంటే ఉదాహరణ కావాలా? రాబోయే రోజుల్లో.. వైకాపా కార్యకర్తలు, నేతలకే ఆర్టీసీ ప్రయాణం, ఇతరులెవరూ బస్సులెక్కొద్దని ఆదేశాలూ ఇస్తారేమో?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్