వరసిద్ధుడికి విరాళంగా 6 కిలోల బంగారం

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5 కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు.

Published : 01 Mar 2024 08:12 IST

కాణిపాకం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5 కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. దానికి అవసరమైన ఆరు కిలోల బంగారాన్ని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆ బంగారాన్ని స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాత శ్రీనివాస్‌, ఆయన ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్‌లకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని