అమెరికా అంటివి.. అటకెక్కిస్తివి!
ఈవీల వినియోగంలో ఆంధ్రాని అమెరికాలా మార్చేస్తాం.. ఆదర్శమంటోన్న తమిళనాడుకు మించిన పాలసీ తెస్తాం.. ఉద్యోగులకు ఐదు లక్షల రాయితీ వాహనాలు అందిస్తాం... ఇలా ఎన్నెన్నో భ్రమలు కల్పించింది జగన్ సర్కారు.
జగనన్నా.. ఈవీలకు ప్రోత్సాహకాలేవీ?
10 లక్షల వాహనాల లక్ష్యం.. ఉన్నవి 70 వేలే!
పాలసీ గడువు ముగిసినా.. కొత్తది తేలేదు
మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబాటు
ఈనాడు, అమరావతి
ఈవీల వినియోగంలో ఆంధ్రాని అమెరికాలా మార్చేస్తాం.. ఆదర్శమంటోన్న తమిళనాడుకు మించిన పాలసీ తెస్తాం.. ఉద్యోగులకు ఐదు లక్షల రాయితీ వాహనాలు అందిస్తాం... ఇలా ఎన్నెన్నో భ్రమలు కల్పించింది జగన్ సర్కారు. కానీ అందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. మాటలు కోటలు దాటినా.. ఈవీలు లక్ష కూడా దాటలేదు!
విద్యుత్ వాహనాల వినియోగాన్ని వచ్చే పదేళ్లలో 10.56 లక్షలకు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? వాటిని ప్రోత్సహించేలా అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం ఐదేళ్లలో చేతకాలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 2018-23 ఈవీ పాలసీ గడువు ముగిసి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటికీ కొత్త పాలసీని రూపొందించలేదు. రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంపై జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
కాలుష్య నియంత్రణ, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోడానికి విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకం ప్రత్యామ్నాయంగా మారింది. ఆ మేరకు రాష్ట్రంలో ఈవీలను పెంచాలన్నది జగన్ ప్రభుత్వ లక్ష్యం. అందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామనీ, ఉద్యోగులకు దశల వారీగా 5 లక్షల ద్విచక్ర వాహనాలను అందిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. వాటివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారమేమీ లేదు. ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి.. వాటి ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమన్వయం చేయాలి. ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2034 నాటికి 10.56 లక్షల విద్యుత్ వాహనాలు రోడ్లపై పరుగులు పెట్టాలని జగన్ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య సుమారు 70 వేలు(6.68 శాతం) మాత్రమే. అంటే వచ్చే పదేళ్లలో 9.86 లక్షల వాహనాలు అందుబాటులోకి రావాలి. ఏడాదికి కనీసం లక్ష కొత్త ఈవీలు రోడ్డెక్కాలి. కానీ ఆ సూచనలే కనిపించడంలేదు.
ఇదో ‘విఫల’ ప్రచారం
ఆటోమొబైల్ రాజధాని అమెరికాలోని డెట్రాయిట్ తరహాలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఈవీల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేస్తాం. తమిళనాడు భారీ రాయితీలతో నూతన ఈవీ పాలసీ విడుదల చేసింది.. దాని కంటే ఆకర్షణీయంగా పాలసీ తయారు చేస్తాం.. జగన్ ప్రభుత్వం చెప్పిన మాటలు ఇవి. కానీ ఇవేవీ వాస్తవరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా.. జాతీయ రహదారుల వెంబడి ప్రతి 25 కి.మీ.కు, నగర పరిధిలో 3 కి.మీ.కు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. దీనికోసం 4 వేల లొకేషన్లను గుర్తించినట్టు ప్రభుత్వం చెప్పింది. నోడల్ ఏజెన్సీగా నియమించిన నెడ్క్యాప్.. వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈవీల సంఖ్య తక్కువగా ఉండటంవల్ల గిట్టబాటు కాదని సంస్థలు వెనకంజ వేస్తున్నాయి. దీంతో జాతీయరహదారి వెంబడి 450 చోట్ల కార్లు, బస్సుల ఛార్జింగ్ కేంద్రాలను తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. తప్పని పరిస్థితుల్లో వాహన విక్రయాలు పెంచుకోవడానికి టాటా సంస్థ 150 చోట్ల ఛార్జింగ్ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడక్కడా ప్రైవేటు కంపెనీలు, వ్యక్తిగతంగా ఇళ్లలో ఛార్జింగ్ కోసం నెడ్క్యాప్ నుంచి ఛార్జింగ్ కేంద్రాలకు అనుమతి కోసం 294 దరఖాస్తులు వచ్చాయి.
ఆర్టీసీలోనూ సాధ్యం కాలేదు
ఆర్టీసీలో అద్దె ప్రాతిపాదికన తిరుపతి, విజయవాడ, గుంటూరు, కాకినాడల్లో 350 విద్యుత్ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ నిర్దేశించిన ధరకు బస్సులు నడిపేందుకు తిరుపతిలో మాత్రమే గుత్తేదారు ముందుకు రాగా, 100 విద్యుత్ బస్సులను నడపుతున్నారు. మిగిలిన చోట్ల గుత్తేదారు సంస్థ నిర్దేశించిన ధరలు ఎక్కువగా ఉన్నాయని విద్యుత్ బస్సులు నడపడానికి అధికారులు అంగీకరించలేదు.
ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం 2021 జులైలో ఉత్తర్వులు ఇచ్చింది. దశల వారీగా 5 లక్షల వాహనాలు ఇవ్వాలని భావించింది. పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను నెడ్క్యాప్కు అందించింది. ప్రతి నెలా పెట్రోలుకు చేసే ఖర్చుతో వాయిదా మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు ఉంటుందని ప్రచారం చేసింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేలా బ్యాంకర్లు, సమన్వయం కోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇంత చేసినా ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్ర వాహనాలు ఎన్నో తెలుసా? కేవలం వంద.
కంపెనీలు తిరిగి చూస్తే ఒట్టు
రాష్ట్రంలో రూ.1,750 కోట్లతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ తయారీ యూనిట్తోపాటు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కైనెటిక్ సంస్థ ప్రతినిధులు 2021 సెప్టెంబరులో సీఎం జగన్ను కలిసి చెప్పారు. మూడేళ్లు గడచినా ఆ సంస్థ ఇప్పటి వరకు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు.
ఇచ్చే రాయితీ ఊడగొట్టేస్తుందా?
విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల్లో యూనిట్కు రూ.6.70 వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. అందులో 10 శాతాన్ని నిర్వాహకులకు రాయితీగా ఇస్తోంది. 2024-25 నుంచి ఆ రాయితీ మొత్తాన్ని ఉపసంహరించాలని డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. యూనిట్కు రూ.20 చొప్పున వసూలు చేసుకోవచ్చని ఛార్జింగ్ కేంద్రాల నిర్వాహకులకు నెడ్క్యాప్ అనుమతించింది. ప్రస్తుతం యూనిట్కు వివిధ రూపాల్లో సగటున రూ.13 వరకు వారికి ఖర్చు అవుతోంది. ఒకవేళ సర్కారు రాయితీని ఎత్తివేస్తే.. ఛార్జింగ్ కేంద్రాల ఆదాయం తగ్గి, భవిష్యత్తులో ఆ భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉంది.
మౌలిక సదుపాయాలు కరవు
- విశాఖ, విజయవాడ నగరాల్లో పవర్ గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి జపాన్ బ్యాంకు ఆసక్తి చూపుతోందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది.
- ఆర్టీసీ బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, ప్రైవేటు స్థలాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు హడావుడి చేశారు.
- విద్యుత్ వాహనాలు, విడిభాగాలను పరీక్షించేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థ సహకారంతో రూ.250 కోట్లతో వాహనాలను పరీక్షించే టెస్టింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
- విజయవాడలో బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేదు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల పెట్టుబడి అవసరం. దీంతో ఏ సంస్థా ముందుకు రాలేదు.
- విజయవాడ, విశాఖ, తిరుపతిలలో ఆటోలకు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ కిట్లను అమర్చి.. విద్యుత్ వాహనాలుగా మార్చే ప్రాజెక్టు చేపడతామని.. అమలులో విఫలమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల