కలరా కలకలం
గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం తొక్కేసింది. కలరా మహమ్మారి గురించి దాదాపుగా అందరూ మర్చిపోయిన తరుణంలో.. ఈ కేసులు బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరులో ముగ్గురికి సోకినట్లు గుర్తింపు
కలుషిత నీటిని తాగడమే కారణం!
మురికిగుంటల్లో మంచినీటి పైపులు
రిపోర్టులను గుట్టుగా ఉంచిన వైకాపా సర్కారు
ఈనాడు, అమరావతి: గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం తొక్కేసింది. కలరా మహమ్మారి గురించి దాదాపుగా అందరూ మర్చిపోయిన తరుణంలో.. ఈ కేసులు బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు. వందల మంది చికిత్స పొందారు. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 345 మల నమూనాలను పరీక్షిస్తే... మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా (బ్యాక్టీరియా) కేసు బయటపడ్డాయి. కలరా సోకిన వారు ముగ్గురూ వాంతులు, విరేచనాలతో గత నెల 10 తర్వాత చికిత్స కోసం చేరారు. అందరి నమూనాలను పరీక్షిస్తున్న తరుణంలోనే.. ముగ్గురికి గంజినీళ్లలా విరేచనాలు అవుతుండటంతో అనుమానించి వారి నమూనాలను కల్చర్ టెస్ట్ చేయించారు. దాంతో వీరికి కలరా ఉన్నట్లు తేలింది. వీరు కోలుకోవడానికి 20 రోజుల సమయం పట్టింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మురుగు నీటిలోనే మంచినీటి పైపులు ఉంటున్నాయి. అవి పగిలినప్పుడు మురుగునీరు మంచినీటితో కలిసి పైపుల్లో సరఫరా అవుతోంది. అదే అనారోగ్యాలకు కారణమవుతోంది.
కలరా, ఈ-కోలి, షగెలా బ్యాక్టీరియా కేసులు
విబ్రియో కలరా సోకినవారికి తీవ్రస్థాయిలో విరేచనాలు అయ్యి, బాగా నీరసిస్తారు. కలుషిత నీరు తాగినా, కలుషిత నీటితో కడిగిన కాయగూరలను శుభ్రంచేసి తిన్నా విబ్రియో కలరా బారినపడే ప్రమాదం ఉంది. ఈ-కోలి సోకినవారికీ విరేచనాలు వస్తాయి. విబ్రియో కలరా వచ్చినవారిలో ఉన్నంత అనారోగ్య తీవ్రత ఈ-కోలిలో ఉండదు. షగెలా అనే బ్యాక్టీరియా వల్ల జిగట విరేచనాలు అవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనం కూడా అవుతుంది. విందుల్లో కలుషిత నీరు తాగినా అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఎక్కువ. 2011 నుంచి 2020 మధ్య సుమారు పది సందర్భాల్లో కలరా వెలుగుచూసిందని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చి అండ్ పబ్లిక్ హెల్త్’ (2022) జర్నల్లో తెలిపారు.
ప్రజారోగ్యంతో చెలగాటం
గుంటూరు నగర ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తాగునీరు అందించే విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించింది. పర్యవసానంగా కలుషిత జలాలు కాటేసి గత నెలలో నలుగురు చనిపోగా వందలమంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో సగం మందికిపైగా గుంటూరు శారదా కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆ ప్రాంతాల్లో తాగునీటి పైపులు శిథిలావస్థలో ఉన్నా.. వాటి నిర్వహణను నగరపాలక విస్మరించింది. గతంలోనే ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా యంత్రాంగానికి పట్టలేదు. అప్పుడే మేల్కొని ఉంటే... నలుగురు మరణించేవారు కారు, వందల మంది ఆసుపత్రుల పాలయ్యేవారు కారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిలో సరిపడా క్లోరిన్, ఆమ్ల శాతాలు ఉండట్లేదని, దీనివల్ల నీటి నాణ్యత దెబ్బతింటోందని తేలింది. మంచినీటి పైపులు ఇప్పటికీ కొన్నిచోట్ల మురుగునీటి గుంటల్లోనే ఉన్నాయి. పైపులు శిథిలావస్థకు చేరుకోవడంతో మురుగునీరు వాటిలోకి పోతోంది. ఈ నీటినే స్థానికులు తాగి... అనారోగ్యం పాలవుతున్నారు. సంఘటనలు జరిగినప్పుడు ఉద్యోగులను సస్పెండ్ చేయడమే కాదు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని, అప్పుడే కలరా లాంటి మహమ్మారులు విజృంభించకుండా ఉంటాయని గుంటూరు నగరవాసులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ