ఆయనో ప్రధాన అనకొండ!
ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతలు చేస్తున్న అక్రమాల్ని, అడ్డగోలు దోపిడీని చూసి ఆ అత్యున్నతాధికారి కూడా స్ఫూర్తి పొందినట్టున్నారు! ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల ఎసైన్డ్ భూములను అనకొండలా మింగేశారు.
విశాఖ చుట్టుపక్కల ఓ అత్యున్నతాధికారి భూదందా
ఎకరం రూ.30-40 లక్షల చొప్పున 200 ఎకరాలకు పైగా కొనుగోళ్లు
ఇప్పుడు ఆ భూముల విలువ రూ.2 వేల కోట్ల పైమాటే!
పేదల్ని మభ్యపెట్టి వందల ఎకరాల డి-పట్టా భూముల కొనుగోళ్లు
ఎసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ నిర్ణయంలో ఆయన భాగస్వామి
అదే అధికారి రైతుల్ని మభ్యపెట్టి భూములు కొనడం ఇన్సైడర్ ట్రేడింగే
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్టుడే- వన్టౌన్, ఆనందపురం
ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతలు చేస్తున్న అక్రమాల్ని, అడ్డగోలు దోపిడీని చూసి ఆ అత్యున్నతాధికారి కూడా స్ఫూర్తి పొందినట్టున్నారు! ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల ఎసైన్డ్ భూములను అనకొండలా మింగేశారు. ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతూ, వారు చెప్పినదానికల్లా తలాడించడమే ఎజెండాగా పెట్టుకున్న ఆ అధికారి... పదవీ విరమణ వయసు కూడా దగ్గరపడుతుండటంతో భారీ భూ దందాకు తెరతీశారు. విశాఖ చుట్టుపక్కల వివిధ గ్రామాలకు చెందిన పేద రైతుల్ని మభ్యపెట్టి, భయపెట్టి వారి నుంచి వందల ఎకరాల డి-పట్టా భూముల్ని బినామీల ద్వారా చౌకగా కొనేశారు.
దేశాన్ని పాలించిన ఒక ముఖ్య నాయకుడి పేరు పెట్టుకున్న ఆ అత్యున్నతాధికారి... ఎసైన్డ్ భూముల్ని నిర్దిష్ట గడువు దాటాక లబ్ధిదారులకు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో కీలక భాగస్వామి. ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉండగానే ఆయన మాస్టర్ప్లాన్ వేశారు. విశాఖ నగర శివారులోని పలు గ్రామాల పేదలకు చెందిన సుమారు 200 ఎకరాలకుపైగా డి-పట్టా భూముల్ని బినామీలతో కొనిపించారు. భూముల యజమానులకు ఎకరానికి రూ.30-40 లక్షల చొప్పున ముట్టజెప్పి... తన బినామీల పేరు మీద జీపీఏ, భూ విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు. ఎసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చట్టసవరణ చేయగానే.. తాను కొన్న భూములకు 22(ఎ) నుంచి వేగంగా మినహాయింపునిచ్చేలా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంత పెద్ద అధికారే చెప్పేసరికి జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద ఆ భూముల్ని డీనోటిఫై చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని ఆ ఉన్నతాధికారి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు. పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూములు ఇప్పుడు ఆయన పరమవుతున్నాయి. ఆ భూముల విలువ ప్రాంతాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. ఒక్క ఆనందపురం మండలంలో చేతులు మారిన 200 ఎకరాల విలువే రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ అధికారి బినామీలకు భూములు అమ్ముకున్న పేద రైతుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలే.
ఇది కదా ఇన్సైడర్ ట్రేడింగ్!
విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసిన వైకాపా ముఖ్య నేతలు... ఈ అయిదేళ్లలో విచ్చలవిడిగా దోపిడీపర్వం కొనసాగించారు. అయిదేళ్లు అధికారంలో ఉండే నాయకులే రూ.వేల కోట్ల విలువైన భూముల్ని మడతెట్టేస్తుంటే... 34 ఏళ్లపాటు సర్వీసులో ఉండే మనం ఇంకెంత దందాలు చేయాలా? అని ఆ అత్యున్నతాధికారి ఆలోచించారు. ప్రభుత్వ పెద్దలు విశాఖ నగరంలోని దసపల్లా, ఎన్సీసీ, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో వంటి అత్యంత విలువైన భూముల్ని స్వాహా చేసేస్తే... ఆ ఉన్నతాధికారి వారికేమీ తీసిపోని విధంగా విశాఖ చుట్టుపక్కలున్న పేదల భూములపై కన్నేశారు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్న ఆ అధికారికి రెవెన్యూ వ్యవహారాల్లోని మతలబులన్నీ కొట్టిన పిండి. డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం... పేదలకు తెలియకముందే వారి భూములు కొట్టేసి రూ.కోట్లలో లబ్ధి పొందారు. రాజధాని అమరావతిలో ‘ఇన్సైడర్’ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నాయకులు అసత్యప్రచారం చేశారుగానీ... ఆ అత్యున్నతాధికారి విశాఖలో పేదల భూములతో చేసిన దందానే అసలు సిసలు ‘ఇన్సైడర్’ ట్రేడింగ్.
పేదల్ని బెదిరించి..
పేదలకు చెందిన డి-పట్టా భూముల్ని కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేసిన ఆ అధికారి... దాన్ని అమలు చేసేందుకు ముగ్గురు బినామీల్ని విశాఖలో దించారు. చందమామను తలపై ధరించిన ఈశ్వరుడనే అర్థం వచ్చే పేరుగల వ్యక్తి, మూడు లోకాల్లో పూజ్యనీయుడైన సాయి అని అర్థం వచ్చే పేరుగల మరో వ్యక్తి, భరతజాతికి మూలపురుషుడి పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి... ఆ అత్యున్నతాధికారి తరఫున భారీగా డి-పట్టా భూములు కొన్నారు. ఆ ముగ్గురూ రైతుల నుంచి తమ పేరుపై జీపీఏ చేయించుకున్నారు. డీనోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగి, అప్పుడు రైతుల్ని భూముల్ని రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ముందుగానే రైతులతో జీపీఏ చేయించేసుకున్నారు. ‘మీ భూముల్ని మాకు అమ్మకపోతే నష్టపోతారు. వాటిపై మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించవు. ప్రభుత్వం తన అవసరాలకు మీ భూముల్ని తీసుకుంటే మీకు ఎలాంటి పరిహారం రాదు’ అని అమాయకులైన పేద రైతుల్ని భయపెట్టి వారి భూముల్ని కొట్టేశారు. ప్రభుత్వం నిర్దిష్ట గడువు దాటిన డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించనుందని, అదే జరిగితే తమ భూముల క్రయవిక్రయాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ధరలు పెరుగుతాయని తెలియని అమాయక రైతులు.. వారి మాయలో పడికారుచౌకగా భూములు అమ్మేశారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్టసవరణను అనుసరించి.. నిర్దిష్ట గడువు దాటిన డి-పట్టా భూములకు 22ఎ నుంచి మినహాయింపునిస్తూ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిందే తడవు చకచకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించేస్తున్నారు. ఆనందపురం మండల పరిధిలో కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక, చందాక, పేకేరు, గొట్టిపల్లి, బాకూరుపాలెం, గిడిజాల, శొంఠ్యాం గ్రామాల్లోని సుమారు 200 ఎకరాల భూముల్ని ఇటీవలే కలెక్టర్ డీనోటిఫై చేశారు. ఇప్పుడు ఆ భూములన్నీ రైతుల నుంచి ఈ బినామీల పేరుమీదకు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం వంటి మండలాల పరిధిలో సైతం డీనోటిఫై చేసిన వందల ఎకరాల భూములకూ ఇదే తరహాలో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.
డీనోటిఫికేషన్లో జాప్యం చేశారంటూ ఓ అధికారికి స్థానచలనం?
డి-పట్టా భూముల క్రమబద్ధీకరణపై చట్టసవరణ 2023 ఆగస్టులో జరిగితే.. ఆ భూముల్ని 22(ఎ) జాబితా నుంచి మినహాయించే ప్రక్రియ ఈ ఏడాది జనవరి 17 నుంచి ప్రారంభమైంది. డి-పట్టా భూముల దందా వెనుక ఆ ఉన్నతాధికారితో పాటు, పలువురు వైకాపా నాయకుల హస్తం కూడా ఉండటంతో డీనోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. వారు చెప్పినంత వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేయనందుకే ఇటీవల జేసీ విశ్వనాథ్ను బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోతే ఐఏఎస్ అధికారినే బదిలీ చేయించామని, మీకూ అదే గతి పడుతుందని రెవెన్యూ అధికారుల్ని.. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి బినామీలు బెదిరిస్తున్నారు.
మంత్రులు, వైకాపా నేతలదీ అదే దందా!
రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఏకంగా ఇక్కడ 300 ఎకరాల వరకు డి-పట్టా భూములు కొనేశారు. వాటిని 22(ఎ) నుంచి మినహాయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
- వైకాపాలో క్రియాశీలకంగా, నామినేటెడ్ పోస్టులో ఉండి, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఒక నేత ఆనందపురం మండలం గండిగుండం పరిధిలో 15 ఎకరాల వరకు కొన్నట్లు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. సదరు భూములు ఆ నేత పేరునే రైతుల నుంచి బదిలీ అయ్యాయి.
- గతంలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఓ నేత బినామీల పేరుతో భోగాపురంతోపాటు, ఆనందపురం పరిధిలో భారీగా డి-పట్టా భూములు కొనేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి