ఇసుకాటేస్తున్నారు!
అధికార బలం అండగా.. ధనదాహమే మెండుగా.. ఎవ్వరినీ లెక్కచేయకుండా మొండిగా.. వైకాపా నేతలు బరితెగించగా.. ఇసుక తవ్వకాలు దండిగా.. ఆ గుంతల్లో పడి.. అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా.. సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతుండగా.. పట్టించుకోవాల్సిన సర్కారు చేష్టలుడగ్గా.. బాధితుల కష్టాలు చూస్తూ.. ఎలా ఉండగలుగుతున్నారు జగన్ నిస్సిగ్గుగా..!!
నదీ పరివాహకాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
భారీ గుంతల విషయం తెలియక మునిగిపోతున్న సామాన్యులు
కుటుంబాలను కకావికలం చేస్తున్న జగన్ సర్కారు నిర్లక్ష్యం
ఎన్ని ప్రాణాలు పోతున్నా ఆగని ఉల్లంఘనలు.. రూ.వందల కోట్ల దోపిడీ
శవాల మీద కోట్లు కూడబెడుతున్న వైకాపా నేతలు
ఈనాడు, అమరావతి, రాజమహేంద్రవరం, ‘న్యూస్టుడే’ యంత్రాంగం
అధికార బలం అండగా.. ధనదాహమే మెండుగా.. ఎవ్వరినీ లెక్కచేయకుండా మొండిగా.. వైకాపా నేతలు బరితెగించగా.. ఇసుక తవ్వకాలు దండిగా.. ఆ గుంతల్లో పడి.. అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా.. సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతుండగా.. పట్టించుకోవాల్సిన సర్కారు చేష్టలుడగ్గా.. బాధితుల కష్టాలు చూస్తూ.. ఎలా ఉండగలుగుతున్నారు జగన్ నిస్సిగ్గుగా..!!
- కొడుకు చదువు పూర్తి కావొస్తుండటంతో, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరి కుటుంబ బాధ్యతలు చూస్తాడని అమ్మానాన్నలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎదిగొచ్చిన కొడుకును ఇసుక గుంతలు మింగేస్తే.. ఆ కుటుంబం పడే క్షోభను మాటల్లో వర్ణించలేం.
- కూలి పనులు చేసుకుంటూ ఇంటిని నడిపిస్తున్న పెద్దదిక్కుని ఇసుక గుంతలు పొట్టునపెట్టుకుంటే.. ఆ ఇల్లాలు, పిల్లల పరిస్థితి ఏంటి? ఇక ఆ ఇల్లు గడిచేదెలా?
- స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు.. సరదాగా స్నానానికి నీళ్లలోకి దిగగా.. అక్కడ పొంచి ఉన్న ఇసుక గుంతలు వారిని బలిగొంటే..? పిల్లలే ప్రపంచమనుకొని బతుకుతున్న ఆ తల్లిదండ్రుల కలలన్నీ కల్లలే కదా?
..ఇటువంటి దీనగాథలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు. వైకాపా నాయకుల ధనదాహమే ఇందుకు కారణం. నదీ తీరాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ.. అక్రమంగా వందల కోట్లు పోగేస్తూ.. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇసుక గుంతల్లో చిక్కుకొని, ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏ ఇంటి తలుపు తట్టినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. కన్నీటి రోదనలే వినిపిస్తున్నాయి. అయినా సరే.. జగన్ ప్రభుత్వం మాత్రం అక్రమ తవ్వకాలపై దృష్టి సారించడం లేదు. ఎంత మంది ప్రాణాలు పోతే మాకేంటి.. కోట్ల రూపాయలతో మా గల్లాపెట్టెలు నిండితే చాలనే ధోరణిలో కర్కశంగా
వ్యవహరిస్తోంది.
* రాష్ట్రంలో ఇసుక తవ్వకం, తరలింపు ప్రక్రియ మొత్తం ఓ మాఫియాను తలపిస్తోంది. ఏ నదీ తీరం చూసినా.. తాటిచెట్టంత లోతైన గుంతలతో మృత్యుకుహరాలుగా భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో వైకాపా నేతలు, టెండరు దక్కించుకున్నామని చెబుతున్న గుత్తేదారులు.. నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. ఇష్టానుసార తవ్వకాలతో అభం శుభం తెలియనివాళ్లంతా ఆ భారీ గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్ నివసించే తాడేపల్లికి దగ్గరలో కృష్ణా నదికి ఇరువైపులా నాలుగున్నరేళ్లలో 34 మంది ఇసుక గుంతల్లో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో యువత, విద్యార్థులే అధికం. ఒకటి, రెండు ఘటనల తర్వాతనైనా స్పందించి, ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలను అడ్డుకోవాల్సిన సర్కారు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇసుకాసురులు మరింత విచ్చలవిడిగా తవ్వుకునేలా సహకారం అందిస్తోంది. దీంతో ఇసుక గుంతల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. మానసిక క్షోభను అనుభవించే కుటుంబాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. మా ఉసురు ఇసుకాసురులకు తప్పకుండా తగులుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. అయినాసరే ఈ ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం లేదు.
ఇంజినీరింగ్ అయ్యాక అండగా ఉంటాడనుకుంటే..
మా కుమారుడు రమేశ్ అనంతపురంలో ఇంజినీరింగ్ చదివేవాడు. 2022 ఆగస్టులో ఇంటికి వచ్చినప్పుడు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని వేదవతి నదికి వెళ్లాడు. ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతల్లో చిక్కుకొని మృతిచెందాడు. మరో ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని, ఏదో ఒక ఉద్యోగంలో చేరితే.. మా అప్పులు తీరిపోతాయని భావించాం. కానీ, ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు.
మృతుడు రమేశ్ తల్లిదండ్రులు, కెంచానపల్లి, అనంతపురం జిల్లా
కొడుకే ఇంటికి పెద్ద దిక్కు..
నా భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోతే.. ఒక్కగానొక్క కొడుకు కరుణాకర్ ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచే హైదరాబాద్లో మేనమామ దగ్గరుంటూ పని చేసుకునేవాడు. అప్పు చేసి అమ్మాయికి పెళ్లిచేశాం. 2021 మేలో హైదరాబాద్ నుంచి పనిమీద ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి జొన్నాడ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లాడు. అక్కడ ఇసుక గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి మా ఇంటికి ఆధారం లేకుండా పోయింది.
నాగవేణి, కొత్తపేట, కోనసీమ జిల్లా
దిగులుతో నా భార్య మంచం పట్టింది
నాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పిల్లల్ని ఎంత కష్టమైనా చదివిస్తున్నా. పెద్ద కుమారుడు త్రిలోక్ కుటుంబానికి కుడిభుజంగా ఉంటాడని ఆశించా. గతేడాది మే 21న స్నేహితులతో కలిసి గోదావరిలోకి దిగి ఇసుక గుంతలో చిక్కుకుని, చనిపోయాడు. అప్పటి నుంచి నా భార్య ఆరోగ్యం ఇప్పటికీ కుదుటపడలేదు. ఆమెకు మందుల కోసమే నెలకు రూ.1,200 ఖర్చవుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు.
మోటూరి శ్రీను, ఎన్.పెదపాలెం, అయినవిల్లి మండలం
కొడుకు మృతి తట్టుకోలేక భర్త కూడా..
మా కుమారుడు శివనాగరాజు (24) ట్రాక్టరు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2021 నవంబరులో కార్తికమాసంలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగాడు. ఇసుక గుంతల్లో మునిగి చనిపోయాడు. ఈ దిగులుతోనే నా భర్త 2022 నవంబరులో చనిపోయారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నాను. కుమారుడు చనిపోయాక కలెక్టర్ రూ.50 వేలు పరిహారంగా ఇచ్చారు.
రమాదేవి, తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా
మా ఆశలూ నీటమునిగాయి
కొంతకాలం కిందట నాభర్త మృతిచెందారు. పూలు అమ్ముతూ.. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని పోషిస్తున్నా. కుమారుడు హుస్సేన్ అలియాస్ బబ్లూ (15)... 2022 డిసెంబరులో స్నేహితులతో కలిసి కృష్ణా నదికి వెళ్లాడు. ఇసుక గుంతల్లో ప్రాణాలు కోల్పోయాడు. పరిహారంగా రూ.15 లక్షలు, ఇల్లు ఇప్పిస్తామని వైకాపా నాయకులు హామీ ఇచ్చారు. కానీ, రూ.3 లక్షలే అందించారు.
దూదేకుల గౌరి, పటమట దర్శిపేట, విజయవాడ
రెండేళ్లలో ఇద్దరిని మింగేశాయి
నాతోపాటు సోదరుడు పెద్దబాజీ (26) బీరువాల పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవాళ్లం. ఇంట్లో శుభకార్యం ఉండటంతో నేను, పెద్దబాజీ, మరొకరు కలిసి రెండేళ్ల క్రితం కృష్ణానదిలో స్నానానికి వెళ్లాం. పెద్దబాజీకి ఈత రాకపోవడంతో ఇసుక గుంతలో కూరుకుపోయాడు. అంతకు ముందు ఏడాది మా మేనల్లుడు షేక్ రిజ్వాన్ బాషా (20) కూడా కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇసుక గుంతల వల్ల చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు.
చిన్న బాజీ, దిడుగు, పల్నాడు జిల్లా
తండ్రి మీదే ఆధారపడాల్సి వచ్చింది
రెండేళ్ల కిందట వినాయక నిమజ్జనానికి కుటుంబ సభ్యులమంతా కలిసి కృష్ణా నదికి వెళ్లాం. తిరిగి వచ్చే క్రమంలో సమీప బంధువు భార్గవాచారి నీటిలో మునిగిపోతుండగా, అతడిని కాపాడేందుకు నాభర్త మల్లికార్జునరావు (29) ప్రయత్నించారు. నదిలో భారీ ఇసుక గుంతలు కారణంగా ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూతురిని చదివిస్తున్నా. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు.
నవ్య హరిత, 14వ మైలు గ్రామం, పల్నాడు జిల్లా
పిల్లలిద్దరూ తండ్రి లేనివారయ్యారు
మేం చిన్న హోటల్ నిర్వహిస్తున్నాం. మా కుమారుడు భార్గవాచారి డ్రైవర్గా పనిచేస్తూ, హోటల్లో మాకు సహకరిస్తుండేవాడు.రెండేళ్ల క్రితం వినాయక నిమజ్జనానికి అంతా కలిసి కృష్ణా నదికి వెళ్లాం. అక్కడ నీటిలోకి దిగిన మా కొడుకు మళ్లీ బయటకు రాలేదు. తన పిల్లలిద్దరూ తండ్రి లేనివారయ్యారు. ప్రభుత్వం రూ.2 లక్షల సాయం మాత్రమే అందించింది.
గోవిందమ్మ, శ్రీనివాసరావు, లేమల్లె, పల్నాడు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు